సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 9, 2009

గోదావరి జ్ఞాపకాలు..!


'గోదావరి ' ఆ పేరులో ఏదో ఆత్మీయత.రాజమండ్రీలో పుట్టినందుకా?తెలీదు.పెరిగినది విజయవాడలో అయినా నాన్నగారి ఊరు 'కాకినాడ ' కావటంతో ప్రతి శెలవులకూ మాకు ఒకే ప్రయాణం...కాకినాడకి.అప్పట్లో సర్కార్ ఎక్ష్ప్రెస్ అనే రైలు ఉందేది.ఫొద్దున్నే యెక్కితే మధ్యాన్నం కాకినాడ చేరేవాళ్ళం.అది ప్రతి ఊరిలోనూ ఆగుతూ వెళ్ళేది.ఆప్ అండ్ డౌను చేసే స్టూడెంట్లు,ఉద్యోగస్తులూ,పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళివారితో ఆ రైలు ఎప్పుడూ గొదావరిలా నిండుగా ఉండేది. దారిలో రాజమండ్రీ వచ్చేది.సింహాచలం సంపెంగపూల కోసం రాజమండ్రీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్ళం.ముందు గొదావరి స్టేషను వచ్చేది,ఆ తరువాత గోదావరి బ్రిడ్జి మీద రైలు వెళ్ళేది.ఆదో గొప్ప అడ్వంచరులా ఉండేది.కిటికీ సీటు కోసం నేను,మా తమ్ముడు ఎప్పుడూ ఫైటింగే! నది లో పడవలూ,జాలరులూ,చేపలూ,మేము వేసే అర్ధరూపాయి,రూపాయి బిళ్ళలు(యెందుకో అలా చిల్లర డబ్బులు వేయించేవారు నదిలో) ...రైలు బ్రిడ్జీ దిగే దాకా మహా సరదాగా ఉండేది.ఒడ్డుకి ఒకవైపున 'రాణి చిత్రాంగి గారి ' ఒక పాత కోట ఉండేది. కానీ ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడూ 'గోదావరి ' చాలా మారిపోతూ ఉండేది.మధ్యలో నల్లని పాయలా కొన్నళ్ళు ఉందేది.అది మరోసారి వెళ్ళినప్పుడు ఆకుపచ్చగా మారిపొయింది.మళ్ళీ కొన్నాళ్ళకి అదొక చిన్న 'ఐలాండ్ ' అయిపొయింది.కొన్నాళ్ళకి ఆ ఐలాండ్ నిండా బాగ గడ్డి పెరిగిపోయింది.గడ్డి తినిపింఛడానికి ఆవులు,గేదెలు,మేకలూ తీసుకుని వాటి తాలూకు మనుషులు ,కొన్ని చిన్న చిన్న పాకలూ,వీటన్నింటితో అదొక చిన్న నివాస స్ఠావరంగా మారిపోయింది.ఇదంతా జరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.నీరు ఎండిపొతున్నందుకు బాధగా ఉన్నా కొత్తగా ఏర్పడిన ద్వీపం మాత్రం చూడటానికి ఎక్సైటింగ్ గా ఉందేది.ఇప్పుడింక కాకినాడ ,రాజమండ్రి రైలు ప్రయాణాలు ఆగిపొయినా ;ఆ జ్ఞాపకాలు మాత్రం తీయగా మిగిలి పోయాయి.

3 comments:

హరే కృష్ణ said...

మీ జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు..బాగుంది మీ టపా

Bhanu said...

chala bagudni

తృష్ణ said...

వెన్నెల గారూ,హరేకృష్ణ గారూ,మీ కామెంట్సుకి థ్యాంక్స్.
మీ బ్లాగులో బొంబాయి కబుర్లు బాగున్నాయి.మేమూ కొన్నాళ్ళు బొంబాయిలో ఉన్నాము.బహుశా ఆ సిటీలో నాకు దొరికిన స్వేచ్చ వల్లనేమో ఇప్పటికీ నాకు ముంబై అంటే ప్రాణం.