సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label నేటి కబుర్లు. Show all posts
Showing posts with label నేటి కబుర్లు. Show all posts

Tuesday, March 8, 2011

అభివందనం..



అన్నివేళలా పక్కనుండగల శక్తి
ఏది, ఏంత చెప్పినా వినే ఓరిమి
అర్ధం చేసుకునే సహనం
శ్రధ్ధ తీసుకోగల అభిమానం
అనురాగం ఆత్మీయత నిండిన
నవనీత హృదయ మగువ.

అన్నదమ్ములకు అనురాగం అందించినా
తల్లిదండ్రులకు అభిమానం పంచినా
స్నేహసౌరభాలు పంచిఇచ్చినా
భార్యగా బంధాలు పెనవేసినా
మాతృత్వపు మమకారాలు చూపినా
అత్తింట బాధ్యతలు తనవి చేసుకున్నా
ఉద్యోగభారాన్ని సమర్ధంగా మోసినా
ఎక్కడ ఎన్ని అవతారాలెత్తినా
తన స్త్రీత్వమనే అస్థిత్వాన్ని పదిలపరుచుకుంటుంది అతివ.


అపురూపమైన ఈ అస్థిత్వాన్ని గుర్తించలేని నిర్భాగ్యులు కొందరైతే
అదే అస్త్రంగా తమ స్త్రీత్వాన్ని ప్రజ్వలించుకునేవారు కోకొల్లలు.
పరిపూర్ణమైన ఆ స్త్రీత్వానికి వందనం.
ప్రతి బంధంలో ప్రాణం నింపే ప్రతి అతివకూ అభివందనం.




Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

Saturday, January 22, 2011

"యాహూ హోం పేజ్" లో తళుక్కుమన్న "Deol ladies"


పై ఫోటో లో ఉన్నది ప్రఖ్యాత హిందీ నటి హేమమాలిని, ఆమె కుమార్తెలు ఈషా, అహానా. "Namaste India" అనే Indo-American Association for Arts and Entertainment తాలూకూ లాంచ్ ప్రోగ్రాంలో నృత్యం చేస్తున్న ఫోటోలు ఇవి.

"యాహూ హోం పేజ్" లో "Deol ladies" పేరుతో కనబడ్డ ఈ ఫోటోలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వెంఠనే కాపీ చేస్కున్నాను. 62ఏళ్ళ ఈ అందమైన నటికి నృత్యం పట్ల ఉన్న passion,dedication నాకు ఆమె పట్ల గౌరవాన్ని పెంచుతాయి. కుమార్తెల కన్నా ఈమే ఎక్కువ అందంగా ఉందే అనిపిస్తుంది. పెరిగే వయసుతో పోటీపడే సౌందర్యం ఆమెది.

చిన్నప్పుడూ టివీలో "నూపుర్" అని హేమమాలిని డైరెక్ట్ చేసిన సీరియల్ వచ్చేది. విడువకుండా చూసేవాళ్ళం. హేమమాలిని, కబీర్ బేడీ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సీరియల్లో. ఎంతో ఇష్టంతో భరతనాట్యం నేర్చుకుని, నృత్యానికే జీవితం అంకితం చేయాలనుకునే మహిళ జీవిత కథ అది. గుల్జార్ రచించారు. కుమార్తెలతో పాటూ ఉన్న పై ఫోటోలను పొద్దున్నే యాహూ లో చూడగానే ముచ్చట వేసి ఈ టపా రాయాలనిపించింది. ఆమె తన కుమార్తెలు కూడా ఆ కళను నేర్పటం భరతనాట్యం పట్ల ఆమెకు ఉన్న ప్రేమను, అంకితభావాన్ని తెలుపుతాయి. ఆమె సంకల్పమే కాక వారు కళను నేర్చుకోవటం, అది వారికి అబ్బటం కూడా అదృష్టమే.



Wednesday, January 19, 2011

వెన్నెల్లో వాకింగ్...


భోజనమయ్యాకా పది నిమిషాలు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా...లైట్ వెయ్యకుండానే సందంతా పరుచుకున్న తెల్లని వెన్నెల రారమ్మని పిలిచింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని నడవటం మొదలెట్టాను. మెట్ల మీద కూడా వెన్నెలే. చిన్నప్పుడు నేర్చుకున్న లలితగీతం ఒకటి గుర్తుకొచ్చింది. అందులో "వెన్నెలలో వెండి మెట్ల దారురలో రావా...ఈ పుల బాటసారి మదిని వసంతమై పోవా.." అనే వాక్యం గుర్తుకొచ్చింది ఈ మెట్ల మీద పరుచుకున్న వెన్నెలను చూడగానే. ఇలాంటి వెన్నెల నిండిన మెట్లను చూసే రాసి ఉంటారు రచయిత అనుకున్నా. చలి తగ్గిపోయింది అప్పుడే. స్వెట్టర్ అవసరం అనిపించలేదు.


ఎఫ్.ఎమ్ ఛానల్స్ తిప్పుతూ నడుస్తున్నా. "వయ్యారి గోదారమ్మా..." మొదలైంది.. బాలు నవ్వుతో. ఆహా...అనుకున్నా.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపొతే కల వరం ! "
వేటూరిగారి మాట విరుపులో కూడా విరహమే.


"నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా
మువ్వగోపాలుని రాధిక
ఆకాశవీణ గీతాలలోనా
ఆలాపనై నే కరిగిపొనా..."
వేటూరి గారి కలం లోంచి ఒలికిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి. ఏం సాహిత్యం రాసారో కదా అనుకున్నా. కొన్ని పాటలు అదివరకు చాలా సార్లు విన్నవే అయినా , చాలారోజుల తరువాత మరోసారి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తాయి. పాట అయిపోయింది. వెంఠనే మరొ వేటూరి గీతం మొదలైంది. ఇది ఇంకా బాగుంటుంది..


సా...నిసరి సా..నీ....మొదలైంది. "అన్వేషణ"లో "కీరవాణి " పాట..


"ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా.."


...నీ కన్నూలా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై.."
ఏం రాసారు...తిరుగుందా ఈ సాహిత్యానికి? కొత్త సినిమాల్లో ఇలాంటి పాటలేవీ? ఈ సాహిత్యం ఒక ఎత్తైతే, వీటికి ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రెండు పాటలకీ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇన్నాళ్ళ తరువాత కూడా వింటూంటే మైమరచిపోయేలా చేయటం ఆయనకే సొంతం. అప్పటి గోల్డెన్ ఇరా లో ఆయన అందించిన బాణీలన్నీ ఇలాంటివే. అతి చెత్త మూడ్ లో ఉన్నా కూడా స్టార్టింగ్ హమ్మింగో, ట్యూనో వినగానే అప్రయత్నంగా గొంతు కలిపేస్తాం పల్లవితో..! అలాంటి ట్యూన్స్ ఇళయరాజావి.


ఆలోచనలు నడుస్తూండగానే మరో రెండు పాటలు అయిపోయాయి. పది నిమిషాలనుకున్న నడక కాస్తా అరగంట దాటింది. ఇక ఈపూటకు చాల్లెమ్మని ఇంట్లోకి వచ్చేసా. వస్తూనే నా వెన్నెల్లో వాకింగ్ నీ, ఆలోచనల్ని ఇలా టపాయించేసా...

Saturday, September 4, 2010

It's my Day ...!!



"భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి..
I have to live everyday to the fullest as there is no tomorrow.. .."

ఇది నేను క్రితం ఏడాది నా పుట్టినరోజుకు రిజొల్యుషన్ అనుకున్నాను...ఆ రోజు రాసిన పోస్ట్ లో కూడా అదే రాసాను.
చాలావరకూ ఆచరణలో కూడా పెట్టాను. అనుకోకుండా గత సంవత్సరంలో చాలా నెలలు ఎన్నో ఇబ్బందులు,సమస్యలు, షాక్ లతో గడిచిపోయింది...జీవితమ్ అయిపోయిందేమో అన్న దిగులులో కూడా పడ్డాను. బాధలకూ ఏడ్చాను, ఇబ్బందుల్లో కష్టపడ్డాను, దిక్కుతోచనప్పుడు తల్లడిల్లాను... కానీ గత ఏడాది పుట్టినరోజునాడు చేసిన ఆ రిజొల్యుషన్ నేను మర్చుపోలేదు. జీవితాన్ని ద్వేషించలేదు. మన ప్రాప్తానికీ, కర్మకూ, ఇబ్బందులకూ జీవితాన్ని తిట్టుకోవటం అవివేకమని నా అభిప్రాయం. జీవితంలో ఏర్పడే బాధలూ, సమస్యలూ ఇబ్బండికరమైనవి కానీ జీవితం కాదు. Life is beautiful. అందుకే భగవంతుడు ఇంత అందమైన అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆనందపడతాను.

చాలామంది ఇంత వయసు వచ్చేసింది ఏం పుట్టినరోజులే? అనుకుంటారు. . కానీ, అందమైన పువ్వుల్ని చూసే కళ్ళని, కమనీయమైన గానాన్ని వినే చెవులను, వెన్నలలోని చల్లదనాన్ని అనుభూతి చెందే మనసునూ ఇచ్చిన ఈ జీవితానికి, అది ఏర్పడటానికి కారణమైన ఈ రోజు నాకెంతో అపురూపం గా తోస్తుంది. మనిషిగా పుట్టాం కాబట్టే కదా ఇంత గొప్ప అనుభూతుల్నీ,ఆనందాల్నీ feel అవ్వగలుగుతున్నాం అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పుట్టినరోజంటే కూడా నాకు చాలా ఇష్టం.

మా ఇంట్లో డేట్స్ ప్రకారమే కాక తిథుల ప్రకారం కూడా కలిపి రెండు పుట్టిన రోజులు చేసేసుకుంటాం. నిజానికి ఇప్పటిదాకా మరీ ఇంత ఆరోగ్యం బలహీనపడింది ఇప్పుడే...ఇంకా ఎప్పటికి కోలుకుంటానో కూడా తెలియని స్థితి. అయినా ఈసురోమని ఉండటం నాకస్సలు నచ్చదు. అందుకే ఈరోజు కూడా బయటకు వెళ్ళకపోయినా నాకు తోఛినట్లు ఈ రోజును ఆనందంగా గడిపాను. It's my Day ..It's my birthday and i love it !!

TO ME...!!!



Wednesday, September 1, 2010

ఎమ్.ఎస్.శ్రీరాంగారి "శ్రీకృష్ణస్తుతి"


ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన "శ్రీకృష్ణస్తుతి", "కృష్ణాష్టమి" సందర్భంగా ఈ టపాలో...

ఈమని శంకర శాస్త్రిగారి మేనల్లుడైన ఎమ్.ఎస్.శ్రీరాం గారు "పెళ్ళి రోజు", "మంచి రోజు" మొదలైన తెలుగు చిత్రాలు, "అనుమానం" మొదలైన డబ్బింగ్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

ఈ కృష్ణస్తుతిని స్తుతించిన మహామహులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎన్.సీ.వీ.జగన్నాధాచార్యులు గారు, వింజమూరి లక్ష్మిగారు, వి.బి.కనకదుర్గ గారు. ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన ఈ కృష్ణస్తుతి, శివస్తుతి మొదలైనవి విజయవాడ రేడియోకేంద్రం నుండి ఎన్నోసార్లు ప్రసారమై ఎంతో ప్రజాదరణ పొందాయి.

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే "శ్రీకృష్ణస్తుతి" ...



Get this widget | Track details | eSnips Social DNA

Monday, August 16, 2010

శ్రీరాముడి విజయం..!!


ఆనందమానందమాయెనే...మన శ్రీరాముడు ఇండియనైడిలు ఆయెనే....!!

***

నిన్న పొద్దున్నే ఫోనులో ముఖ్యమైన విశేషాలు అయిపోయాకా, పిచ్చాపాటి కబుర్లలోకి వచ్చాము...

"ఇవాళ ఇండియన్ ఐడిల్ చూడాలి రాత్రి" అన్నాను.
"ఇండియన్ ఐడిలా..??" తన ప్రశ్న.
"శ్రీరామ్ గురించి ఎక్కడా చదవలేదా..చూడలేదా?"
"శ్రీరామ్ ఎవరు?"
"రామ రామా..ఇదేం ప్రశ్నండీ..? once upon a time in mumbai...


మనం సోనీ చానల్ లో ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాం మొదలైనప్పటీ నుంచీ ఇద్దరు ఐడిల్స్ సెలక్షన్స్ వరకూ అన్ని ఎపిసోడ్స్ చూసేవాళ్ళం...
అర్ధరాత్రి దాకా రిజల్ట్ చెప్పరు..మధ్యలో ఏడ్స్...నాన్పుడు, టైమ్ వేస్ట్ అని మీరు విసుక్కునేవారు గుర్తులేదా?"
"ప్చ్...!"
"అవునులెండి, మీకు గుర్తుంటే ఆశ్చర్యపడాలికానీ.....అయినా శ్రీరామ్ గురించి తెలియకపోవటమేమిటండీ..." అన్నాను నిరాశగా..

అప్పుడు ఓ నవ్వు నవ్వి చెప్పారు " నేను SMS చేసాను" అని.
ఈసారి నేను ఆశ్చర్యపోయాను..

"ఏమిటి? మీరేనా? SMS ఆ? అయితే ఆ కుర్రాడు ఖచ్చితంగా గెలుస్తాడు.." అన్నాను నవ్వుతూ.
"అవును మరి, మన తెలుగుఅబ్బాయిని మనమే గెలిపించాలి " అన్నారు.

FM లకు, టివీ ప్రోగ్రాములకు SMS లు పంపటం అనేది మా ఇద్దరికీ ఇష్టం లేని పని. మామూలు SMS కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేట్ అయినా సరే SMSలు చేసేస్తూ మనకు తెలియకుండానే మొబైల్ కంపెనీలను పోషిస్తూ, వాళ్ళ లాభాలను పెంచుతున్నాం అన్నది మా అభిప్రాయం. మా అత్తగారు ఏదన్నా కార్యక్రమానికి SMS పంపమని అడిగితే, నాకయితే ఛాయిస్ ఉండదు కానీ మా వారయితే బయటకు వెళ్తున్న మనిషి ఆగిపోయి, ఆవిడ "బాబూ, నేను SMS పంపనులే.నువ్విక వెళ్ళు" అనే దాకా ఆవిడకు ఓ క్లాస్ ఇచ్చి వదులుతూ ఉంటారు. అలాంటి మనిషి ఇవాళ తెలుగువాడిని గెలిపించాలి అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు.

సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు. అలాంటిది ఒక తెలుగువాడిని గెలిపించాలి అని ఇవాళ రాష్త్రమంతా కలిగిన ఈ స్పృహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీరామ్ లోని ప్రతిభ అతడిని చివరిదాకా నడిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కార్యక్రమం గురించి తెలిసినా, తెలియకపోయినా; ప్రేక్షకుల్లో సంగీతం గురించిన అవగాహన ఎంత ఉందీ అన్న ప్రశ్న పక్కన పెడితే, తెలుగువాడిని గెలిపించాలి అనే స్పృహ వలన యావత్రాష్ట్రంలో కలిగిన ప్రకంపనల తరంగాలు అతడి విజయానికి కారణమయ్యాయి. కానీ ...ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి? అన్న ఒక్క విషయమే నాకు మింగుడు పడని ప్రశ్న. మిగిలిన కార్యక్రమాలకీ సంగీత పోటీలకూ తేడా ఉంది కదా. ఇక్కడ గెలుపును సంగీతజ్ఞులు, విద్వాంసులు నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. విద్వాంసులు, సంగీతజ్ఞులైన జడ్జీలు ఉన్నా కూడా గెలుపు జనం ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది అంటే అది నేను హర్షించలేను. ప్రాంతీయ,జాతి,మత భేదాలు లేకుండా ఎంత మంది జనం నిజమైన ప్రతిభకు ఓటు వేస్తారు? ఇలాంటి గెలుపు ను పాల్గొనేవాళ్ళు, ప్రేక్షకులు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు? అన్నది నాకు అర్ధంకాని ప్రశ్న.

ఈ మధ్యన ఏ టివీ చానల్ చూసినా ప్రతి కార్యక్రమంలో ఈ మధ్యన ఈ SMSల జోరు బాగా పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా సరే అసలు మన డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు SMSలు చెయ్యాలి? పూర్వకాలం ఈ SMSలు ఉన్నాయా? అయినా "సురభి", "TVS Saregama", సిధ్ధార్ధబాసు క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ షోలు, సీరియల్స్ మొదలైన వన్నీ ప్రాముఖ్యతను పొందలేదా? ఎందుకు మొబైల్ కంపెనీవాళ్ళ ఆదాయాల్ని సామాన్య ప్రేక్షకుడు పెంచాలి? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. నాకనిపించేదేమిటంటే జనంలో పెరగాల్సింది SMSలు చెయ్యటం వల్ల మనకన్నా మొబైల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం వాటిని పెంచి పోషిస్తున్నాము అన్న స్పృహ. కాదంటారా?

*****

ఇవాళ పొద్దున్నే తనకు ఫోన్ చేసాను...


"శ్రీరామ్ గెలిచాడు తెలుసా. అర్ధరాత్రి దాకా కూర్చుని చూసాను.."
"తెలుసు...అతనిది మన ఏరియానేట. రాత్రి చాలా హంగామా చేసారు...ఆ టపాకాయలూ, ఫైవర్క్స్ సందడికి నాకు మెలుకువ వచ్చెసింది...నిద్రలో పిల్ల జడుసుకుంది కూడా..."

Sunday, August 15, 2010

స్వాతంత్ర్యం..?!


స్వాతంత్ర్య దినోత్సవం...అంటే రోజూ కంటే పొద్దున్నే తయారయ్యి స్కూలుకు వెళ్ళటం, వచ్చిన చీఫ్ గెస్ట్ జండా ఎగురవేస్తే చూసి, పంచిన చాక్లెట్లు తీసుకుని ఇంటికి వచ్చేయటం. ఆ తరువాత కాస్త జ్ఞానం పెరిగాకా ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను, స్వాతంత్ర్యం కోసం లక్షల దేశభక్తుల త్యాగాలను తెలుసుకున్నాను...మనసులోనే జోహారులర్పించాను.

ఈ మధ్యన న్యూస్ పేపరు చూస్తూంటే మాత్రం నాకు ఒకే పాట గుర్తుకు వస్తోంది...ఇవాళ పొద్దున్నుంచీ కూడా ఇదే పాట నోట్లో తిరుగుతోంది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డ్ + రాష్ట్రంలో నందీ అవార్డ్ అందుకున్న "సిందూరం(1997)" సినిమాలోని ఈ పాట రచయితగా శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నంది అవార్డ్ కూడా అందుకున్నారు.



అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

Friday, June 4, 2010

పుట్టినరోజు "బాలు" ని rare photos..!!

తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.

1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.


బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :










ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :

అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.


Wednesday, May 26, 2010

"డబుల్ సెంచరీ "


"రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళు రాయనన్నావు...మళ్ళీ ఎందుకు రాస్తున్నావు?" అడిగాడు గత పది రోజులుగా నేను రాస్తున్న టపాలు చూసిన మా అన్నయ్య(తను నా బ్లాగ్ రెగులర్ రీడర్). కొన్నాళ్ళుగా నత్త నడక నడుస్తున్న నా బ్లాగ్ను ఒకరోజు చూసుకుంటూంటే, 187 వ టపా నంబరు చూసాను...మేనెల చివరకు బ్లాగ్ తెరిచి ఒక సంవత్సరం అవుతుంది...ఈ లోపూ 200 టపాలన్నా పూర్తి చేస్తే...ఏదో కాస్త "తుత్తి"గా ఉంటుందనిపించింది....కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైనదో తర్వాత కానీ తెలియలేదు.

బ్లాగ్ మొదలెట్టిన దగ్గరనుంచీ నెలకి 20,25 తక్కువ కాకుండా టపాలు రాసిన నాకు ఈ చివరి 10,15 రాయటం ఎంత కష్టమైందో... అది నాకే తెలుసు ! కంప్యూటర్ లేక కొన్నాళ్ళు, ఓపిక లేక కొన్నాళ్ళూ జాప్యం జరుగుతూ వచ్చింది. ...సంవత్సరం లోపూ 200టపాలు పూర్తి అవ్వాలని రూలేం లేదు...రాస్తే ఏ అవార్డులూ రావు. రాయకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఏ ఛాలెంజ్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. అన్నీ వీలుగా ఉన్నప్పుడు టపాలు రాయటం గొప్పేమీ కాదు...పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇలా రాయగలగటం నా మనసుకైతే సంతృప్తినే ఇచ్చింది. నిన్నటి టపాతో డబుల్ సెంచరీ పూర్తయ్యింది. రాయాలనుకున్నవి రాసాను.

బ్లాగుల గురించి ఏమీ తెలియకుండా సంవత్సరం క్రితం మే28న "తృష్ణ..." మొదలెట్టాను.ఈ సంవత్సర కాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులూ, పాఠాలూ...!! మరో పది రోజులకు కూడలిలో నా బ్లాగును లంకె వేయగలిగాను. మరో నెలకు "విజిటర్స్ కౌంటర్" పెట్టడం తెలిసింది. "తృష్ణ వెంట" నడుచుకుంటూ వెళ్ళాను... ఇవాళ్టికి 47,500 పై చిలుకు అతిధులు బ్లాగు చూశారు, ఎవరన్నా ఫాలో అవుతారా? అనుకున్న నా బ్లాగుకు 45 మంది నాతో నడిచేవాళ్ళు చేరారు. సుమారు 760 పైగా వ్యాఖ్యలు సంపాదించగలిగాను. వ్యాఖ్యలు రాయకపోయినా కొత్తగా టపా రాస్తే, రెగులర్గా చదివే 150 పై చిలుకు అతిధులను సంపాదించుకోగలిగాను. ఈ లెఖ్ఖలూ, పద్దులూ ఎందుకు? నా తృప్తి కోసమే. ఏ పేపర్లోనూ పడకపోయినా, ఏ బ్లాగర్ చేతా పొగడబడకపోయినా నాలాంటి సాధారణ గృహిణికి ఒక సంవత్సరం లో ఈ మాత్రం అభిమానాన్ని సంపాదించుకోవటం ఆనందం కలిగించే విషయమే.

నాకు తెలిసిన, అనుభూతికి అందిన ఎన్నో విషయాలను మరికొందరితో పంచుకోవాలని, ఇంకా ఇంకా రాయాలని ఉన్నవి... ఎన్నో ఉన్నాయి...కానీ ఇక తొందర లేదు కాబట్టి అవి మెల్లగా ఎప్పుడో....! ఎందుకంటే బ్లాగ్ వల్ల నేనెంత ఆనందాన్ని,తృప్తినీ పొందానో, అంతే సమానమైన బాధనూ, వేదననూ కూడా పొందాను. ఎందుకు బ్లాగ్ తెరిచాను? ఈ బ్లాగ్ వల్ల కదా ఇంత దు:ఖ్ఖాన్ని అనుభవిస్తున్నాను... అని బ్లాగ్ మూసేయాలని చాలాసార్లు ప్రాయత్నించాను. విరామం కూడా ప్రకటించాను. కానీ ఎప్పుడూ పదిరోజులకన్నా బ్లాగ్కు దూరంగా ఉండలేకపోయాను. ఎప్పటికప్పుడు ఏదో శక్తి నాకు అనుకున్నది రాసే అవకాశాన్ని ఇస్తూనే ఉంది. బహుశా నాలో అంతర్లీనంగా అనుభవాలనూ, సంగతులనూ పంచుకోవాలని ఉన్న తపన దానికి కారణం అయి ఉండవచ్చు. అందుకనే నేను రాసేవి ఉపయోగకరమైనవి, ఎవరినైనా ఎన్టర్టైన్ చేసేవీ అయితే మళ్ళీ మళ్ళీ రాసే అవకాశాన్ని భగవంతుడు తప్పకుండా నాకు ఇస్తాడనే నా నమ్మకం. అందుకే ఈసారి విరామాన్నీ, శెలవునీ ప్రకటించట్లేదు...:)

ఇంతకాలం ప్రత్యక్ష్యంగా వ్యాఖ్యలతో, పరోక్షంగా మౌనంతో నా బ్లాగ్ చదివి నన్ను ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు...!!జీవితంలో ఏనాడూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ నెనెవరినీ ఇబ్బంది పెట్టి ఎరుగను. ఒకవేళ పొరపాటుగా ఎవరికైనా ఎప్పుడైనా వ్యాఖ్యల వల్ల కానీ, టపా వల్ల కానీ ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించగలరు.


ఈ టపాను ప్రముఖ ఆంగ్లకవి "Robert frost " masterpiece అయిన "Stopping By Woods on a Snowy Evening" లోని వాక్యాలతో పూర్తి చేస్తున్నాను...
"..But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep. "


Tuesday, May 18, 2010

ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం




ఇవాళ ఆదిశంకరాచార్యులవారి జయంతి సందర్భంగా నాకు ఇష్టమైన ఈ నిర్వాణ షట్కం వినటానికి + సాహిత్యం:





ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం :

మనో బుద్ధ్యహంకారచిత్తాణి నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 1

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః
న వాక్పాణిపాదం న చోపస్థపాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 2

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం 3

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం 4

న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూపః శివోహం శివోహం 5

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగతం నైవ ముక్తిర్నమేయః
చిదానంద రూపః శివోహం శివోహం 6

ఈ స్తోత్రం అర్ధం ఇక్కడ చూడవచ్చు.


(సంస్కృతం కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే సరిచేసినా సరే...)

Sunday, May 9, 2010

dedicating saagarika's "maa" to all mothers...

అందరు అమ్మలకు...Happy mother's Day ..!!


ఇప్పుడు "Sagarika daCosta” గా మారిన ఒకప్పటి "Sagarika Mukherjee" ప్రఖ్యాత గాయకుడు , జీ టివి లోని 'టీవీఎస్ స,రి,గ,మ పా' కార్యక్రమం హోస్ట్ "Shaan" (Shantanu Mukherjee) అక్క . వారిద్దరూ కలిసి చేసిన 2,3 పాప్ ఆల్బమ్స్ నేను డిగ్రీ చదివే రోజులో వచ్చాయి. Martin daCosta ను పెళ్ళి చేసుకున్నాకా అతనితో పాటూ ఆమె కూడా restaurateur గా మారారు. నా డిగ్రీ రోజుల్లో Saagarika చేసిన "మా" ఆల్బమ్ చాలా పేరుగడించింది. నాకు చాలా చాలా ఇష్టమైన ఈ పాటను ఇవాళ "మదర్స్ డే" సందర్భంగా అందరు అమ్మలకూ....dedicate చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికీ "అమ్మ" అనగానే ఇదే భావన ఉంటుందని నా నమ్మకం. ఎవరి అమ్మ వారికి గొప్ప కదా మరి..!!



నేను అదివరకూ మా అమ్మ గురించి రాసిన 'అమ్మే నా బెస్ట్ ఫ్రెండ్' post "ఇక్కడ" చూడచ్చు..

ఈ పాటకు ప్రఖ్యాత సినీ గేయ రచయిత, గజల్ రచయితా "Nida Fazli" హృద్యమైన సాహిత్యాన్ని అందించారు. పాట విడియోనూ, సాహిత్యాన్నీ క్రింద చూడండి...

lyrics: Nida Fazli
singer: saagarika mukherjee


धूप में छाया जैसी
प्यास में नदिया जैसी
तन में जीवन जैसी
मनं में दर्पण जैसी
हाथ दुआवों वाले
रोशन करे उजाले
फूल पे जैसे शबनम
सांस में जैसे सरगम
प्रेम की मूरत
दया की सूरत
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??

जहां में अँधेरा छाए
वो दीपक बन जाए
जब भी कभी रात जगाये
वो सपना बन जाए
अन्दर नीर बहाए
बाहर से मुस्काये
काया वो पावन सी
मधुरा ब्रिन्दावन जैसी
जिसके दर्शन में हो भगवन
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??

Tuesday, April 13, 2010

"Businessworld" Magazine cover story


19th Apr.2010 dated "BusinessWorld" magazine లో KG BASIN మీద రాసిన cover story నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఈ విషయం మీద ఆసక్తి ఉన్నవారెవరైనా చదువుతారని
ఈ-లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను.

http://www.businessworld.in/bw/Magazine

ఈ మధ్యన కొంచెం రెస్టింగ్ స్టేజ్ లో ఉండబట్టి పుస్తకాలూ,పేపర్లూ ఎక్కువ చదివే సమయం దొరుకుతోంది.ఆసక్తి ఉండీ చూడనివారు ఉంటే చదువుకొగలరని ఇలా ఈ-లింకులూ గట్రా బ్లాగ్లో పెడుతున్నాను. ..:)

Saturday, April 3, 2010

Fields Medal, the math Nobel, comes to India

మొన్నటి "Times of India" న్యూస్ పేపర్లోని ఒక వ్యక్తిని గురించిన ఈ వార్త నన్ను చాలా ఆకట్టుకుంది. The news about a Reclusive Russian genius "Grigory Perelman".Though we don't know the reasons for his recluse and refusing big prizes, the thing that fascinated me is the man's simplicity and his disinterest towards an amount of $1 million...! ఆసక్తికరమైన Fields Medal గురించి Mr.Perelman గురించి క్రింద చదవండి..

**********************************************************************

Fields Medal, the math Nobel, comes to India
New Delhi:
For the first time ever, the Fields Medal — popularly known as the Nobel Prize for mathematics — will be announced from Indian soil. India has won the bid over Canada to host the prestigious International Congress of Mathematicians 2010, the inaugural function of which will see announcement of the medal’s latest winner, most probably by President Pratibha Patil. The Congress, which was first held way back in 1897, will take place in Hyderabad from August 19-27.


The Fields Medal is awarded to the world’s best mathematicians at the Congress, held once every four years. But unlike the Nobel, winners of the Medal can’t be over 40 years of age. This is one reason why many great mathematicians have missed it, having done their best work or having had their work recognised too late in life.
Founded at the behest of Canadian mathematician John Charles Fields, the medal was first awarded in 1936 to Finnish mathematician Lars Ahlfors and American mathematician Jesse Douglas, and has been periodically awarded since 1950. No Indian has ever won it.

Hyderabad will also see the installing of a new prize — the Chern Prize — named after S S Chern, a towering figure in geometry in the 20th century.
Interestingly, there will be another first this year for the Congress — a unique International Congress of Women Mathematicians — two days before the ICM. Of the 400 women who have already registered for the Congress, around 150 are from India.
The conference will have another attraction — it will see 40 mathematicians play chess against world champion Vishwanathan Anand. Dr M S Raghunathan from the Tata Institute of Fundamental Research’s school of mathematics said, “This is the third time that the Congress is taking place in Asia, after Kyoto in 1990 and Beijing in 2002. We had bid for it way back in 2004 and we finally won it. The Congress will see 200 invited talks. The last time, it was held in Spain. We expect about 400 people to attend it.”


********************************************************

No to $1 mn?Reclusive Russian genius who refuses awards may attend the meet in Hyderabad
St. Petersburg/New Delhi: Who doesn’t want to be a millionaire? Maybe a 43-year-old unemployed bachelor who lives with his elderly mother in Russia and who won $1 million for solving a problem that has stumped mathematicians for a century. Grigory Perelman can’t decide if he wants the money.
“He said he would need to think about it,” said James Carlson, who telephoned Perelman with the news he had won the Millennium Prize awarded by the Clay Mathematics Institute of Cambridge, Massachusetts. Carlson said he wasn’t too surprised by the apparent lack of interest from Perelman, a reclusive genius who has a history of refusing big prizes.

What’s exciting officials in India is a possibility of the Congress being attended by Perelman, one of the world’s most reclusive yet brilliant maths wizards. Dr Raghunathan told TOI that efforts were on to get Perelman to Hyderabad.
Perelman became the first person ever to decline the Fields Medal four years ago. But he is now under fresh pressure to receive another highly prestigious award for solving one of the century’s most complex mathematical problems — the Poincare Conjecture. Perelman, 43, has cut himself off from the outside world and lives with his elderly mother in a tiny flat in St Petersburg. It was on March 18, 2010, that the Clay Mathematics Institute announced it had awarded Perelman the $1 million Millennium Prize. Dr Raghunathan said, “I have written to Clay Institute asking for Perelman’s address in order to reach him and invite him.” Perelman was honoured for proving the Poincare Conjecture, a theorem about the characterisation of the three dimensional sphere. Originally conjectured by Henri Poincare, the claim concerns a space that locally looks like ordinary three-dimensional space but is connected, finite in size, and lacks any boundary. That was one of seven problems the Clay Institute identified in 2000 as being worthy of a $1 million Millennium Prize. It’s the first problem on the list to be solved. Technically, the award is a done deal. “He has been awarded the prize. That’s the decision of the committee,” Carlson said. “He may or may not accept the money.” TNN & AGENCIES

Tuesday, March 16, 2010

అందరికీ శుభాకాంక్షలు...



ఉగాది అంటే మన నూతన సంవత్సరం...
ఈ రోజున ప్రతి తెలుగు ఇంటా వెల్లివిరుస్తుంది ఉత్సాహం...
ఆ ఉత్సాహం కావాలి నవోదయానికి స్వాగతం...
అది తేవాలి ప్రతి మనసుకూ చిరునవ్వుల శుభోదయం...!!


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

Thursday, December 31, 2009

సింహావలోకనం...


"Doctor Zhivago" సినిమాలో ఒక సీన్లో Zhivago(Omar Sharif) రాత్రి పూట కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. అతను కాగితం మీద పెన్ తో రాస్తున్న చప్పుడు తప్ప మనకు ఇంకేమీ వినిపించనంత నిశ్శబ్దం..!! అలాంటి నిశ్శబ్దం లో ఏదన్నా రాయాలనే తపన ఇంకా ఇంకా ఎక్కువౌతూ ఉంటుంది. ఈ పౌర్ణమి పూటా ప్రస్తుతం నేను చేస్తున్నదీ అదే...కాకపోతే పెన్ చప్పుడు బదులు కీప్యాడ్ టకటకలు...!!

రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" (Bird's eye view) అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. నేను కూడా అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. బ్లాగుల గురించి విశ్లేషించే సాహసం నేను చేయదలుచుకోలేదు. ఈ సంవత్సరంలో నాకు నచ్చిన కొన్ని టపాల గురించి మాత్రం రాయాలని...నేను బ్లాగు తెరిచి ఏడు నెలలు...నాకు దొరికిన సమయంలో, నాకు తెలిసిన బ్లాగుల్లో, నేను చదివినవాటిల్లో కొన్నింటిని ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. ఇంతకన్న బాగున్న టపాలు నేను "మిస్" అయి ఉండవచ్చు...కానీ ముందు చెప్పినట్లు ఇవి "బెస్ట్" అని నేననను కానీ నేను చదివినవాటిల్లో నాకు నచ్చినవి అంతే.

నెలలవారీగా ఒకోటీ చెప్పుకు వస్తాను...

ముందుగా పాతవైనా 2008 డిసెంబర్ లో ప్రచురితమైన 3 టపాలను ప్రస్తావించలేకుండా ఉండలేకపోతున్నాను.
"నేను-లక్ష్మి" బ్లాగ్ లో 2008 decలో ప్రచురితమైన "
పిట్టకధ - కొత్త సంవత్సరం"
మనసుకు హత్తుకునే మాటలు, ఉన్నతమైన భావలు, ఆచరింపదగిన మంచి సూత్రాలూ, జీవిత సత్యాలూ ఈ బ్లాగర్ టపాల్లోని ప్రత్యేకతలు.

ఇక "పలకాబలపం" లో 2008 dec టపా "
బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?"
ఈ టపాలో బ్లాగర్లు ఎందుకు బ్లాగుతారో తనదైన శైలిలో చక్కగా వివరిస్తారు అరిపిరాల సత్యప్రసాద్ గారు.
కోతి కొమ్మచ్చి తెచ్చి చదివించి...అంటూ "పుస్తకం.net" లో రాసినా, "నవతరంగం"లో సినిమా కబుర్లు రాసినా చివరి వాక్యం దాకా మనతో చదివించేలా ఉంటాయి ఈ బ్లాగర్ టపాలు. ఈ బ్లాగ్ కు నేను రెగులర్ రీడర్ను కాకపోయినా "అన్నం ఒక్క మెతుకు చూస్తే చాలు.." అన్నట్లుంటాయి ఈయన టపాలు.


"
నా తెలుగు సినీ దర్శకులు"అంటూ dec 2008 లో ఉమా శంకర్ గారు రాసిన టపా నాకు భలే నచ్చేసింది. మురళిగారి బ్లాగ్ల పరిచయం తో నాకు పరిచయమైన ఈయన బ్లాగు నేను తరచూ చూసే బ్లాగుల్లో ఒకటి. ఈయన కొత్తగా మొదలుపెట్టిన బ్లాగ్లో అయినా తరచూ టపాలు రాసి మరిన్ని మంచి టపాలు అందిస్తే బాగుంటుందని ఆశ.

ఇక 2009 టపాల్లోకి వచ్చేస్తే భైరవభట్ల కామేశ్వరరావు గారి "తెలుగు పద్యం" బ్లాగ్లో may '09లో ప్రచురించబడిన "
జుగల్బందీ" గజల్స్ పట్ల, తెలుగు కవిత్వం పట్ల ఆయనకున్న మక్కువను తెలుపుతుంది. కృష్ణశాస్త్రి కవిత చదువుతూ జగ్జీత్ సింగ్ గజల్ వింటూ ఆయన పొందిన భావుకత్వానికి అక్షరరూపం ఈ టపా. ఇందులో ఆయన రాసిన జగ్జీత్ సింగ్ గజల్ లోని సాహిత్యం చిన్నప్పుడు ఒక పుస్తకంలో "కవిత" రూపంలో చదివి బాగుందని నేను రాసుకుని దాచుకున్నా. తరువాత టి.విలో ఒక లైవ్ కాన్సర్ట్ లో జగ్జీత్ సింగ్ పాడుతూండగా రికార్డ్ చెసుకోవటం జరిగింది. ఆ కవిత నాకు చాలా ఇష్టం.


నాకు ఇటివలే పరిచయమైన నిషిగంధ గారి "మానసవీణ"లో may '09లోని "
మనోనేత్రం" కవిత నన్నెంతో ఆకట్టుకుంది. చాలా లేటుగానైనా ఇంత మంచి కవిత్వాన్ని ఆస్వాదించే అవకాశం దొరికినందుకు సంబరపడుతూ ఉంటాను.

కూడలిలో అడుగుపెట్టిన మొదటి రోజు నాకు పరిచయమైన వ్యాఖ్యాతల్లో ఒకరు "సిరిసిరిమువ్వ"గారు. నా ప్రతి టపాకూ వ్యాఖ్య రాయకపోయినా ఈవిడ నా బ్లాగ్ రెగులర్ రీడర్ అని నాకు నమ్మకం. june '09లో తన బ్లాగ్లో రాసిన "
నా ఉపవాస దీక్ష" టపా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.

july '09 లో ప్రచురితమైన "నా స్పందన" బ్లాగర్ లలిత గారి "
కెవ్వ్...వ్వ్...వ్...కేక(గుండెని గుల్ల చేసే సెంటిమెంట్)" టపా గురించి నే చెప్పేకన్నా మీరు చదివి కెవ్వ్...కేక...అనాలంతే..!!


క్వాంటిటీ కన్నా క్వాలిటి ముఖ్యమని ఆవిడ 82 టపాలకు వచ్చిన 2670 వ్యాఖ్యలే తెలుపుతాయి. ఏ విషయన్నైనా సూటిగా, నిర్భయంగా రాయగల ధైర్యం ఉన్న బ్లాగర్ సుజాతగారు. ఇంకా పాడాలా? అని ప్రశ్నించినా, ఆటోగ్రాఫ్ల గురించి ప్రస్తావించి మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళినా, ఓటర్ల తీరుపై విచారం వ్యక్తం చేసినా....ఈవిడే రాయాల్సిందే అని మనకు అనిపిస్తుంది. july '09 లోని "
చందమామల్లాంటి బ్లాగులు" నాకు బాగా నచ్చిన టపా.


జ్యోతిగారు నడుపుతున్న బ్లాగులు, చేస్తున్న కార్యక్రమాలూ చూసి ఈవిడకు ఎన్ని చేతులున్నాయో, 24 గంటలు ఎలా సరిపోతాయి లాంటి ప్రశ్నలు రాక మానవు . ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన "జ్యోతి" బ్లాగ్లోని ఈ Sep ’09 వ్యాసం "
ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు... " నన్నెంతగానో ఆకట్టుకుంది.


ఇక "కొత్తపాళీ" గారి బ్లాగ్ గురించి నేను చెప్పేదేముంది...ఆ బ్లాగ్లో వ్యాఖ్య రాయాలంటే మాటలు వెతుక్కోవాలి, బోలెడు విషయ పరిజ్ఞానం కావాలి. "బ్లాగుల పరిధి ఇప్పుడున్న దానికంటే ఒక వందరెట్లయినా విస్తరించాలి. దైనిక ప్రాతిపదికన జాల విహరణ (browsing the net on a daily basis) చేసే తెలుగు వారి సంఖ్యలో కనీసం 10 శాతం బ్లాగు పాఠకులు కావాలని నా కోరిక " అంటూ ఆయన రాసిన Sep ’09 లోని"
బ్లాగులూ-బ్లాగర్లూ" టపా బ్లాగుల అభివృధ్ధిని గురించిన ఆయన తపనను తెలుపుతుంది.


"స్వర్ణముఖి" బ్లాగర్ చైతన్య వయసులో చిన్నవాడైనా అతనికున్న విషయ పరిజ్ఞానం నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది. "
శరద్చంద్రికోత్సవం"అంటూ oct 2009 లో ఈ ఉత్సవాన్ని గురించి వివరిస్తూ, అతను చూసిన సంగీతసామ్రాట్టుల కచేరిల గురించి రాసిన టపా సంగీతప్రేమికురాలైన నాకు బాగా నచ్చేసింది. చిన్న తేడా వచ్చినప్పుడు నేను అలిగితే, సహనం వహించి నన్ను అర్ధం చేసుకున్న మనిషి..బ్లాగ్లోకం నాకు అందించగా నాకు పరిచయమై నన్ను అప్యాయంగా "అక్కా" అని పిలిచే ఓ మంచి "తమ్ముడు" ఇతను.


వంద టపాల తరువాత నేను విరామం ప్రకటించినప్పుడు నా కోసం "
కవిత" రాసి నా మనసు దోచుకున్న "మనస్వి" జయగారు. Oct '09లో "బుర్రలేని పిల్ల" అని .అనాధ బాలిక గురించి ఆవిడ రాసిన ఒక నిజ జీవిత సంఘటన ఆవిడలోని ఉత్తమ సంస్కారానికీ, మూర్తీభవించిన మానవత్వానికీ ప్రతీక.

ఇక "నాన్న" భాస్కర్ గారి గురించి నే చెప్పేదేముంది...రకరకాల బ్లాగులు నడపడంలో , వంటలలో, సాంకేతిక నైపుణ్యంలో, తెలివితేటల్లో ఆయనకాయనే సాటి. బ్లాగ్లోకానికి నాన్నగారైనా....అలవాట్లు, కొన్ని పోలికలను బట్టి నాకు మా అన్నయ్యను తలపించే అన్నగారు నాకు.
Oct '09లో "
గడిచిపోయిన నిన్నటికీ రాబొయే రేపటికీ మధ్యనున్న నిశ్శబ్దం" అంటూ "బిగ్ బీ" గారి ప్రసంగానికి అనువాదాన్ని రాసిన ఈ టపా నాకిష్టం.


" నాతో నేను నా గురించి" అంటూ వేణూ శ్రీకాంత్ గారు రాసే చిన్ననాటికబుర్లు చదివి బాల్యంలోకి వెళ్ళని బ్లాగర్ ఉండరు. "ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా?" అంటూ నాన్నగారితో షికార్లు, "అంతా మన మంచికే" అంటూ చిన్నతనంలో నేను చదివిన "ట్వింకిల్" కధ...మెలోడియస్ పాటల్ని, ఎన్నో స్మృతులు రాసి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూంటారీయన.
Oct '09లో "
ఐస్ ఐస్ పుల్లైస్.. " అంటు బ్లాగర్లందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళారు. మొదట్లో అక్కడక్కడ ఈయన వ్యాఖ్యలను చదివి నా బ్లాగ్లోకి తొంగి చూడరెందుకో అనుకునేదాన్ని. హఠాత్తుగా ఒకరోజు ఆయన తరచూ చూసే బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగ్ పేరుని చూసి ఆశ్చర్యపోయాను.



"బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" సారధి "గీతాచార్య" ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ తమ్ముడికి కూడా వంద చెతులేమన్నా ఉన్నాయేమో అని నా అనుమానం. Oct '09లో "మరువం" లో ప్రచురితమైన "
అయిబు పాడిన అమ్మ పాట" కధ ఎందరో బ్లాగ్మిత్రుల మన్ననలు పొందింది.


ఇహ బ్లాగర్ల అభిమాన ఆడపడుచు "పరిమళం" గారి బ్లాగ్లో Nov '09లో ప్రచురితమైన "
దివ్యగుణములు" టపా మానవునికి కావాల్సిన పదహారు దివ్యగుణముల గురించి తెలుపుతుంది.


నా "బంగారు పాపాయి" టపా ద్వారా నాకు పరిచయమైన మాలా కుమార్ గారి బ్లాగులన్నీ మధురస్మృతుల సమాహారాలు. Nov '09లో "సాహితి" లో ప్రచురితమైన "
ఊర్వశి" టపా "ముదితల్ నేర్వగలేని విద్య గలదే ముద్దార నేర్పించినన్..." అన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.


చాలామందిలాగే నేను ఈ బ్లాగ్ అభిమానిని. రోజూ దినపత్రికను చూడకపోతే తోచనట్లే, రోజూ బ్లాగ్లోక విహారం మొదలెట్టగానే కొత్త టపా ఉన్నా లేకున్నా, ఓ సారీ "నెమలికన్ను"లోకి తొంగి చూడనిదే బ్లాగులు చూసినట్లే అనిపించదు. జ్ఞాపకాలను నెమరువేసుకోవటంలో ఈయన తరువాతే ఎవరైనా అనిపించి మురిపిస్తాయీయన టపాలు. Nov '09లో ప్రచురించిన "
పోలి స్వర్గం" నాకెంతో నచ్చిన టపా.
చెప్పాపెట్టకుండా అప్పుడప్పుడు మాయమైపోతూ, ఏమయ్యారో అనుకునేలోపూ మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్ష్యమైపోయే ఈయన "సార్ధకనామధేయులే" అనిపిస్తూ ఉంటుంది నాకు.



మన కవితారాణి ఉషగారి కవితాగానాల "మరువపువనం" నుంచి ఎంత వెతికినా ఒక్కదాన్నీ విడదీయలేకపోయాను. అందుకే Dec '09 లో ప్రచురితమైన, నాకు బాగా నచ్చిన "విశ్వామిత్ర" సీరియల్లోని "
చివరి భాగాన్ని" నచ్చిన టపాగా అందిస్తున్నాను.


నా "ఉత్తరాలు" టపా ద్వారా నాకు పరిచయమైన భావనగారి "కృష్ణపక్షం" సున్నితమైన భావోద్వేగాల లేఖాసమూహం.
Dec '09 లో ప్రచురితమైన "
ఒంటరి గూడు" టపా నన్నెంతగానో ఆకట్టుకుంది. రెండు విభిన్న దృక్పధాల మధ్యనున్న సంఘర్షణను, రెండు మనసుల వాదనలనూ వారి వారి దృష్టికోణాల నుంచి చూపించి, మనస్తత్వ విశ్లేషకురాలా? అనిపించేలా రచనలు చేసే భావనగారి "కృష్ణపక్షం" రెగులర్ రీడర్ని నేను .

"లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్" అన్నట్లు ఇటీవలకాలంలో మొదలై ప్రతి టపాతో మనతో "ఆహా" అనిపిస్తున్న బ్లాగ్ "నా గోల".
ఈ బ్లాగ్లో Dec '09 లో ప్రచురితమైన "
నీకు నువ్వు తెలుసా?"
కవిత అద్భుతం. చదివితే మీకే తెలుస్తుంది.

ఇవండీ నాకు నచ్చిన , నాకు తెలిసిన కొన్ని మంచి టపాలు. మీక్కూడా నా "సింహావలోకనం" నచ్చిందనే భావిస్తాను.
ఈ 2009 సంవత్సరానికిక శెలవు మరి....

ఇన్నాళ్ళూ వ్యాఖ్యల రూపంలో నాకు ప్రోత్సాహానిచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ నా వ్యాఖ్యలతో కానీ, టపాలతో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని మనవి...

"బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.."

Monday, November 23, 2009

నా స్వామి పుట్టినరోజు

ఇవాళ నా స్వామి పుట్టినరోజు సందర్భంగా నాలుగు మాటలు....

"Be aware that your Kindness
maybe treated as your weakness
but still be Kind.

Be aware that your help to others
may go unheeded and unnoticed
but still be Helpful.



Be aware that your faith in God and Love for Humanity
manybe taken as Orthodoxy and foolishness
but still have faith in God.

Be aware that Good you do today
will be forgotten tomorrow
but still be Good.

Be aware that honesty and frankness
make you Vulnerable
but still be Frank.

Be aware that virtues and values of life
may mean little for people
but still be Virtuous."

--- Sri Satya Sai Baba.


చాలా ఏళ్ళ క్రితం ఒక పెద్ద చార్ట్ మీద స్వామి చెప్పిన ఈ కొటేషన్ రాసుకున్నాను. అక్షరాలను దిద్దిన రంగు వెలసిపోయినా ఇంకా ఇవాల్టికీ ఆ చార్ట్ నా తలుపుకు అంటించే ఉంది. రాసుకోవటమే కాదు ఇంకా పాటిస్తూనే ఉన్నాను.....అలా చేయటం వల్ల ఎన్ని బాధలు,కష్టాలు ఎదురైనా సరే. స్నేహాన్ని,మంచితనాన్ని, నిజాయితీని, నిష్కపటమైన భావ ప్రకటనని, భగవంతునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఇది నాకు నా స్వామి ప్రసాదించిన జీవనపాఠం.

స్వామి గురించిన నా నమ్మకం నిన్నదో, మొన్నదో కాదు.....ఇంట్లో మా తాతగారి కాలం నుంచీ ఉన్నది. కాకపోతే ఊహ, ఆలోచన ఏర్పడ్డాకా నా అంతట నేను చేసిన కొంత సాధన వల్ల కలిగిన అవగాహన కొంత...నా దృష్టిలో నేను స్వామి పాదాల చెంత చోటు కోసం పరితపించే చిన్ని గడ్డిపువ్వును మాత్రమే ...!!

ఇహలోక బంధాలన్నీ ఇహంలోనేనని....చిట్టచివరికి నేను చేరాల్సిన గమ్యం మరోకటుందని...అది చేరటానికి సాగించాల్సిన పయనం బోలెడని...ఆ మార్గం నాకు చూపే మార్గదర్శి నా స్వామి అని నేనెవరికి చెప్పాలి...??! కొందరి దృష్టిలో నా నమ్మకం గుడ్డిదే కావచ్చు. కానీ రాయిని సైతం భగవంతునిగా కొలిచే మన "పుణ్య భూమి"లో మనిషి గుర్తించాల్సింది మనం పూజిస్తున్నది దేనినని కాదు...అందులో ముఖ్యమైనది మనకు ఉండే " పూర్తి నమ్మకం" అని నా అభిప్రాయం.

అయితే అన్నివేళలా తోడుగా నాకు స్వామి ఉన్నారన్న సత్యాన్ని నేను ప్రాపంచిక బాధల్లో పడి మరచి, కలత చెందిన ప్రతిసారీ ఏదో రూపంలో వచ్చి "నేనున్నను" అని నా స్వామి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సంఘటన నాకు మొన్న జరిగింది...అనుకోకుండా మా ఇంటికి వచ్చిన బంధువొకరు "స్వామి డివోటీ" అవ్వటం...మేము బోలెడు స్వామి కబుర్లు చెప్పుకోవటం...నన్ను నేను తేలిక పరచుకోవటానికి, నేను మరుస్తున్న నా అసలైన ఆధ్యాత్మిక పయనాన్ని గుర్తుచేయటానికి ఎంతో ఉపయోగపడ్డాయి.

ఈ విషయంలో చర్చలూ, వాదనలు చేయదలుచుకోలేదు...అందుకే కామెంట్స్ మోడ్ తీసేసాను.
ఇవాళ కేవలం నా స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని...అంతే..!!




Monday, November 16, 2009

నాలోన శివుడు కలడు..."

(Siva temple in coimbatore)
ఈ చివరి కార్తిక సొమవారం పరమ శివుణ్ణి ఇలా స్మరిస్తూ...
******

'పూర్తిగా తెలిసే వరకూ ఏ వ్యక్తి మీదా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు’ అన్నది నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో ఒకటి. ఒక మనిషిని మనం మొదట ఏ దృష్టితో చూస్తామో అదే అభిప్రాయం మనకి ఆ మనిషి గురించి ఇంకా బాగా తెలిసేవరకూ ఉండిపోతుంది. మెల్లగా, పూర్తిగా ఆ వ్యక్తి తెలిసాకా, మనకు గతంలో కలిగిన అభిప్రాయానికీ, కొత్తగా ఏర్పడిన అభిప్రాయానికీ ఎంత తేడా ఉందో తెలిసాకా ఆశ్చర్యం వేస్తుంది. అలా నాకు గతంలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఒక వ్యక్తంటే అమితమైన అభిమానం ఏర్పడిపోయింది. అది "తనికెళ్ళ భరణి" గారు. ఆయనను సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో చూసి చూసి చిన్నప్పుడు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు..

"హాసం" మాస పత్రిక మొదలైయ్యాకా దాంట్లో ఆయన రాసిన వ్యాసాలు చదివాకా నాకు ఆయనంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంత మంచి రచయిత ఉన్నాడా ఈ వ్యక్తిలో అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మిగతా రచనలు కుడా కొన్ని చదివాను. తర్వాత ఆయన ఒక డైలాగ్ రైటర్,నాటక రచయిత,కధా రచయిత అని కూడా తెలుసుకున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను...ఆయన గొప్ప శివ భక్తుడని. ఆయన స్వయంగా రచించి, స్వరపరిచి, పాడిన "నాలోన శివుడు కలడు" అనే ఆల్బమ్ విన్నాకా. ఇది నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాల ఆల్బమ్. మొత్తం ఐదు పాటలూ శివ తత్వాన్నీ, భరణి గారికున్న శివ భక్తినీ తెలుపుతాయి. అన్ని పాటలకూ ముందుమాట సామవేదం షణ్ముఖశర్మగారు చెప్తారు. అందులో నాకు బాగా నచ్చే మూడు పాటలు ఇక్కడ వినటానికి...మొదటి పాట మొత్తం సాహిత్యం కూడా....
--------------



నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి మూటగట్టేయగలడు(౩)

************

2) "హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా
విడి విడిగా వెతికాను ఒకచోటే కలిసారా..
అమ్మేమో విల్లంటా అయ్యేమో అమ్మంటా
గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంటా.."



************

3)"నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికీ
నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి.." పాటలో

"బుసకొట్టే పాములేరా మీ కోరికలు
అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు"

"కడకు వల్లకాడేగద మీ నివాసమూ
కపాలమే గదా కడకు మీ విలాసమూ.."
వాక్యాలు జీవన తత్వాన్ని ఎంతో సులభంగా తెలియపరుస్తాయి.





*************

4)"ఈ జన్మకింతేరా మల్లనా
ఇంకో జన్మ నాకీయి మల్లనా..""
పాటలో "జానకి"గారి గళంలో పలికే ఆర్ధ్రతను విన్నాకా కళ్లలోకి నీరు ఉబికి వస్తుంది...

5)"ఓ శివా నా శివా బజ్జోరా మా శివా
ముడు కన్నులు మూసి బజ్జోర మా శివా..."
పాటలో "సుశీల" గారి జోల వింటూంటే మనకూ నిద్దుర వచ్చేస్తుంది...

భక్తిగితాలపై ఆసక్తి ఉన్న ప్రతివారు కొనుక్కోవలసిన కేసెట్ ఇది. ఇప్పుడు సి.డి కూడా వచ్చిందేమో తెలీదు మరి.
*********************************************************

ఇక రేపు తెల్లవారు ఝాములో పెట్టే "పోలి స్వర్గం" దీపాలతో ఈ కార్తీకానికి "హర హర మహాదేవ.."

Saturday, November 14, 2009

ఒక మంచి పిల్లల పాట....

>(నా బ్లాగ్ రెగులర్ రిడర్స్ కోసం: కొద్దిపాటి అస్వస్థత తరువాత ఇవాళ మళ్ళీ బ్లాగ్లోకం లోకి....ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయినా మిత్రులను మిస్సవుతున్న కారణంగా...ఈ రాక...)



బాలల దినోత్సవం సందర్భంగా ఇవాళ నాకు సాహిత్యపరంగా,సంగీతపరంగా నాకు చాలా చాలా నచ్చే ఈ పిల్లల పాట ...సినీ సంగీత దర్శకులు ఎం.బి.శ్రీనివాసన్ గారు రేడియో కోసం ఈ పాటకు సంగీతాన్ని అందించారు. మంచి అర్ధంతో కూడిన ఈ అందమైన పాట ఇంకా ప్రాచుర్యం పొందాలని నా ఆశ...

రచన:దాశరధి
సంగీతం:ఎం.బి.శ్రీనివాసన్
పాడినది:వాణీజయరాం బృందం.



పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా...పిల్లల్లారా

మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడూ
ఉన్నడూ....పొంచున్నాడూ
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడూ
ఉన్నాడూ..అతడున్నాడూ
భారతమాతకు ముద్దుల బిడ్డలు మీరేలే
మీరేలే...మీరేలే..
అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే...
ప్రేమేలే.. ((పిల్లల్లారా))

ఉత్తరాన గల మంచుకొండకు దక్షిణాన గల సముద్రానికీ
ఐకమత్యమూ సాధించే అందమైన ఓ బాలల్లారా
ఆశాజ్యోతులు మీరేలే...((ఉత్తరాన))
కులాల మతాల గుద్దులాటలు
మరిపించేది మీరేలే...మరిపించేది మీరేలే
భాషావేష బేధాలన్ని పారద్రోలేది మీరేలే
రూపుమాపేది మీరేలే ((పిల్లల్లారా))

భారతదేశం ఒకటే ఇల్లు భారతమాతకు మీరే కళ్ళు
మీరే కళ్ళు...
జాతిపతాకం పైకెగరేసి జాతిగౌరవం కాపాడండి
జాతిగౌరవం కాపాడండి(2)
బడిలో బయట అంతా కలిసి భారతీయిలై మెలగండీ
భారతీయిలై మెలగండీ(2)
కన్యకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండీ(2)
వీడని బంధం వేయండీ....((పిల్లలారా...))

Monday, November 2, 2009

బ్లాగ్వనంలో వనభోజనాలు...వంటకాలతో నేను రెడీ...

ఈ కార్తీక పౌర్ణమి రోజున భోజనాలకి ఈ మావిడి చెట్టు క్రింద కూర్చుందామా..?
జ్యోతి గారి ఆహ్వానంతో వనభోజనాలకు వంటకాలతో రెడీ... (కానీ ఇవాళ నేను ఉపవాసం..ఇవేమీ తినటానికి లేదు..)

నేను 2,3 రకాల వంటకాలను రాస్తున్నాను..


ముందుగా ఒక టిఫిన్ --
పావ్ భాజీ :(కావాల్సినవి)
ఒక నలుగురికైతే 10,12 పావ్ లు తెచ్చుకోవాలి.(బేకరీల్లో దొరుకుతాయి)
100gms నెయ్యి
2,3 చెంచాల నూనె.
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, కూరలో పిండటానికి 2,3నిమ్మ చెక్కలు

కూర కొసం:
* ముందురోజు ఒక మీడియం గ్లాసుడు బఠాణీలు నానబెట్టుకుని ఉంచుకోవాలి.
* నానిన బఠాణీల తో పాటుగా చిన్న కాలీ ఫ్లవర్,ఒక పెద్ద బంగాళాదుంప,2 కేరెట్లు, ఇష్టం ఉంటే కొద్దిగా క్యాబేజీ తరిగినది...ఇవన్నీ కలిపి బాగా ఉడకపెట్టాలి. కుక్కర్ లో అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి.
* దింపాకా మొత్తం బాగా మేష్ చెయ్యాలి.(అంటే చిదిమెయాలి)
* 2 తొమాటోలు, 2 ఉల్లిపాయలు బాగా ముద్దగా గ్రైండ్ చేసి బాగా వేగనివ్వాలి.
* తరువాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్దిగా వేగాకా,బాగా మేష్ చెసి పెటుకున్న కూర ముక్కల ముద్దని దాంట్లో వేసి, ఒక 3 చెంచాల 'పావ్ భాజి మసాలా పౌడర్" వెయ్యాలి.
ఈ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్లలోను దొరుకుతుంది. చివరగా ఒక చెంచా నెయ్యి వెయ్యాలి.
* తరువాత , పెనం పెట్టి పావ్ లని నెయ్యితో కాని బటర్తో కానీ మాడకుండా కాల్చాలి...బ్రెడ్ కాల్చుకున్నట్లే.

సర్వ్ చేసేప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండి..ఇవ్వాలి..

పైన ఫొటోలో లాగన్న మాట..:)

**********
ఇప్పుడు భోజనంలోకి ఒక చపాతీ కూర, కొత్తరకం దోసావకాయ.
పచ్చి బొప్పాయి కూర: (చూడటానికి క్యాబేజి కూరలా ఉన్న దీనిని అన్నంలోకి కూడా తినచ్చు.)
కావల్సినవి:

ఒక మీడియం సైజు బొప్పాయి తురుము.
1/2 కొబ్బరి చెక్క తురిముకోవాలి.

పొపుకి : ఆవాలు,మినప్పప్పు,సెనగ పప్పు, 2 పచ్చి మిర్చి, జిలకర్ర,కర్వేపాకు, కావాలంతే ఒక ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు.


1)బొప్పాసి తొక్కు తీసేసి, తురిమేసి,కొద్దిగా నీరులో తగినంత ఉప్పువేసి ఒక్క పొంగు వచ్చేదాకా ఉడకబెట్టాలి.ముద్దగా అవ్వకుండా కొద్దిగా ఉడికినట్లు అనిపించగానే దింపేసుకోవాలి.

2)నీరు మిగిలి ఉంటే వడబోసేయాలి పుర్తిగా.

3)మూకుడులో పోపు వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని, 2 నిమిషాలయ్యాకా ఉడికిన బొప్పాయి తురుము వేసి 3,4 నిమిషాలలో ఆపేసుకోవాలి.

ఇది చపాతీలలోకి చాలా బాగుంటుంది.
మావారు పూర్తిగా ఖాళీ చేసే ఏకైక కూర ఇది.కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను.


కొత్తరకం దోసావకాయ:

దోసావకాయ అంటే చాలామందికి ఎర్ర మిర్చి కారంతో చేసుకునేదే తెలుసు. పెళ్ళిళ్ళలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అదికాక పచ్చి మిర్చితో చేసుకునేది మరొకటి ఉంది.

కావాల్సినవి:
ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.

మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.
అన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.
దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెత్లో దొరుకుతుంది. లెకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె,తగినంత ఉప్పు వెసి బాగా కలపాలి.

ఈ ముద్దలోకి తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.


"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.
ఇది నాకు చాలా ఇష్టమైన పదార్ధం.


**********
ఇవాళ స్పెషల్ వంటలు అన్నారు కాబట్టి నెయ్యి,నునె గట్రా బాగా వాడే పదార్ధాలు రాయటం అయ్యింది.
మిగిలిన రొజులు కట్టడిగా తిన్నా, నెలకి ఒక్కసారి తినచ్చు ఇలాగ...:) :)

నిన్న ఇవన్నీ చేసి మా అమ్మగారింట్లో అందరికీ పెట్టాను...బ్లాగ్ కోసం నేను చేసిన పదార్ధాలకి ఫొటోలు తీస్తూంటే
....ఓసినీ..ఇదేమిటి ఇవన్నీ మా కోసం కాదా చేసింది....నీ బ్లాగ్ కోసమా అని మా తమ్ముడు హాచ్చర్యపడి..కించిత్ అలక వహించాడు..!!