Monday, August 23, 2010

రాఖీ శుభాకాంక్షలు




రేపటి రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికీ మంచి భవిష్యత్తునూ,ఆయురారోగ్యాలనూ ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను!!


Thursday, August 19, 2010

వైదేహిగారి కవిత


వృత్తిపరంగా డాక్టర్.
ప్రవృత్తి పరంగా కవయిత్రి.
స్వభావరీత్యా స్నేహశీలి.
ఒక మంచి మిత్రురాలు.

డా.వైదేహీ శశిధర్ గారితోనూ, వారి కవితలతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం...తిలక్ గళంలో ఆయన కవిత పోస్ట్ పెట్టినప్పుడు పరిచయమయ్యారు. రెండు మూడు వాక్యాలు రాసినా వాటిల్లో ఎంతో ఆత్మీయత, అభిమానం దాగిఉంటాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే మనోబలం మాటల్లో చెప్పలేనిది.


కవిత్వాన్ని విశ్లేషించేంత భాష నాకు రాదు కానీ వైదేహిగారి కవితలు చదివినప్పుడల్లా అవి నా మనసుని తాకుతాయి, వాటిల్లోని దగ్గరితనం మనసు మూలల్లో దాగున్న ఎన్నో భావాలను తట్టిలేపుతాయి.వైదేహిగారు కవితా సంకలనం "నిద్రిత నగరం" గురించి ఇక్కడ చూడవచ్చు.


కౌముది ఆగష్టు సంచిక లో ప్రచురితమైన వైదేహిగారి కవిత "మిత్రచ్ఛేదం" నాకు బాగా నచ్చింది. వారి అనుమతితో అది ఇక్కడ రాస్తున్నాను..

"మిత్రచ్ఛేదం"

పూర్తిగా ఆలపించకుండానే
అర్ధంతరంగా ఆపేసిన రాగాలు
కొన్ని పరిచయాలు.

అభిమానంతోనో అతిశయంతోనో
ఎప్పటికీ పూర్తి చేయని
జుగల్బందీలు కొన్ని స్నేహాలు.

అసహనంతోనో అపనమ్మకంతోనో
మధ్యలోనే ముగించిన రహదారి ప్రయాణాలు
మరికొన్ని పరిచయాలు.

మొత్తంగా రేకులు విడవకముందే
తన పరిమళంతో
జ్ఞాపకాలను వెలుగించే స్నేహపుష్పాలని
అహాల పోరాటం వల్లో అమాయకమైన అజ్ఞానంతోటో
కొనగోటితో చటుక్కున త్రుంచేసే
వేన వేల హస్తాలు !!

***

వైదేహిగారి కవితల్లో నాకు నచ్చిన మరో కవిత "నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య "
వైదేహిగారు రాసిన మరిన్ని కవితలు ఇక్కడ చూడవచ్చు.


అనుమతినిచ్చిన వైదేహిగారికి ధన్యవాదాలతో...
తృష్ణ.




Monday, August 16, 2010

Tum se hi...Tum se hi...


"Jab We met " సినిమలోని ఈ పాట సంగీతం , సాహిత్యం రెండూ ఆకట్టుకుంటాయి. సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

పాడినది : Mohit Chauhan
సాహిత్యం: Irshad Kamil
సంగీతం: Pritam Chakraborty


శ్రీరాముడి విజయం..!!


ఆనందమానందమాయెనే...మన శ్రీరాముడు ఇండియనైడిలు ఆయెనే....!!

***

నిన్న పొద్దున్నే ఫోనులో ముఖ్యమైన విశేషాలు అయిపోయాకా, పిచ్చాపాటి కబుర్లలోకి వచ్చాము...

"ఇవాళ ఇండియన్ ఐడిల్ చూడాలి రాత్రి" అన్నాను.
"ఇండియన్ ఐడిలా..??" తన ప్రశ్న.
"శ్రీరామ్ గురించి ఎక్కడా చదవలేదా..చూడలేదా?"
"శ్రీరామ్ ఎవరు?"
"రామ రామా..ఇదేం ప్రశ్నండీ..? once upon a time in mumbai...


మనం సోనీ చానల్ లో ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాం మొదలైనప్పటీ నుంచీ ఇద్దరు ఐడిల్స్ సెలక్షన్స్ వరకూ అన్ని ఎపిసోడ్స్ చూసేవాళ్ళం...
అర్ధరాత్రి దాకా రిజల్ట్ చెప్పరు..మధ్యలో ఏడ్స్...నాన్పుడు, టైమ్ వేస్ట్ అని మీరు విసుక్కునేవారు గుర్తులేదా?"
"ప్చ్...!"
"అవునులెండి, మీకు గుర్తుంటే ఆశ్చర్యపడాలికానీ.....అయినా శ్రీరామ్ గురించి తెలియకపోవటమేమిటండీ..." అన్నాను నిరాశగా..

అప్పుడు ఓ నవ్వు నవ్వి చెప్పారు " నేను SMS చేసాను" అని.
ఈసారి నేను ఆశ్చర్యపోయాను..

"ఏమిటి? మీరేనా? SMS ఆ? అయితే ఆ కుర్రాడు ఖచ్చితంగా గెలుస్తాడు.." అన్నాను నవ్వుతూ.
"అవును మరి, మన తెలుగుఅబ్బాయిని మనమే గెలిపించాలి " అన్నారు.

FM లకు, టివీ ప్రోగ్రాములకు SMS లు పంపటం అనేది మా ఇద్దరికీ ఇష్టం లేని పని. మామూలు SMS కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేట్ అయినా సరే SMSలు చేసేస్తూ మనకు తెలియకుండానే మొబైల్ కంపెనీలను పోషిస్తూ, వాళ్ళ లాభాలను పెంచుతున్నాం అన్నది మా అభిప్రాయం. మా అత్తగారు ఏదన్నా కార్యక్రమానికి SMS పంపమని అడిగితే, నాకయితే ఛాయిస్ ఉండదు కానీ మా వారయితే బయటకు వెళ్తున్న మనిషి ఆగిపోయి, ఆవిడ "బాబూ, నేను SMS పంపనులే.నువ్విక వెళ్ళు" అనే దాకా ఆవిడకు ఓ క్లాస్ ఇచ్చి వదులుతూ ఉంటారు. అలాంటి మనిషి ఇవాళ తెలుగువాడిని గెలిపించాలి అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు.

సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు. అలాంటిది ఒక తెలుగువాడిని గెలిపించాలి అని ఇవాళ రాష్త్రమంతా కలిగిన ఈ స్పృహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీరామ్ లోని ప్రతిభ అతడిని చివరిదాకా నడిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కార్యక్రమం గురించి తెలిసినా, తెలియకపోయినా; ప్రేక్షకుల్లో సంగీతం గురించిన అవగాహన ఎంత ఉందీ అన్న ప్రశ్న పక్కన పెడితే, తెలుగువాడిని గెలిపించాలి అనే స్పృహ వలన యావత్రాష్ట్రంలో కలిగిన ప్రకంపనల తరంగాలు అతడి విజయానికి కారణమయ్యాయి. కానీ ...ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి? అన్న ఒక్క విషయమే నాకు మింగుడు పడని ప్రశ్న. మిగిలిన కార్యక్రమాలకీ సంగీత పోటీలకూ తేడా ఉంది కదా. ఇక్కడ గెలుపును సంగీతజ్ఞులు, విద్వాంసులు నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. విద్వాంసులు, సంగీతజ్ఞులైన జడ్జీలు ఉన్నా కూడా గెలుపు జనం ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది అంటే అది నేను హర్షించలేను. ప్రాంతీయ,జాతి,మత భేదాలు లేకుండా ఎంత మంది జనం నిజమైన ప్రతిభకు ఓటు వేస్తారు? ఇలాంటి గెలుపు ను పాల్గొనేవాళ్ళు, ప్రేక్షకులు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు? అన్నది నాకు అర్ధంకాని ప్రశ్న.

ఈ మధ్యన ఏ టివీ చానల్ చూసినా ప్రతి కార్యక్రమంలో ఈ మధ్యన ఈ SMSల జోరు బాగా పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా సరే అసలు మన డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు SMSలు చెయ్యాలి? పూర్వకాలం ఈ SMSలు ఉన్నాయా? అయినా "సురభి", "TVS Saregama", సిధ్ధార్ధబాసు క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ షోలు, సీరియల్స్ మొదలైన వన్నీ ప్రాముఖ్యతను పొందలేదా? ఎందుకు మొబైల్ కంపెనీవాళ్ళ ఆదాయాల్ని సామాన్య ప్రేక్షకుడు పెంచాలి? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. నాకనిపించేదేమిటంటే జనంలో పెరగాల్సింది SMSలు చెయ్యటం వల్ల మనకన్నా మొబైల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం వాటిని పెంచి పోషిస్తున్నాము అన్న స్పృహ. కాదంటారా?

*****

ఇవాళ పొద్దున్నే తనకు ఫోన్ చేసాను...


"శ్రీరామ్ గెలిచాడు తెలుసా. అర్ధరాత్రి దాకా కూర్చుని చూసాను.."
"తెలుసు...అతనిది మన ఏరియానేట. రాత్రి చాలా హంగామా చేసారు...ఆ టపాకాయలూ, ఫైవర్క్స్ సందడికి నాకు మెలుకువ వచ్చెసింది...నిద్రలో పిల్ల జడుసుకుంది కూడా..."

Sunday, August 15, 2010

స్వాతంత్ర్యం..?!


స్వాతంత్ర్య దినోత్సవం...అంటే రోజూ కంటే పొద్దున్నే తయారయ్యి స్కూలుకు వెళ్ళటం, వచ్చిన చీఫ్ గెస్ట్ జండా ఎగురవేస్తే చూసి, పంచిన చాక్లెట్లు తీసుకుని ఇంటికి వచ్చేయటం. ఆ తరువాత కాస్త జ్ఞానం పెరిగాకా ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను, స్వాతంత్ర్యం కోసం లక్షల దేశభక్తుల త్యాగాలను తెలుసుకున్నాను...మనసులోనే జోహారులర్పించాను.

ఈ మధ్యన న్యూస్ పేపరు చూస్తూంటే మాత్రం నాకు ఒకే పాట గుర్తుకు వస్తోంది...ఇవాళ పొద్దున్నుంచీ కూడా ఇదే పాట నోట్లో తిరుగుతోంది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డ్ + రాష్ట్రంలో నందీ అవార్డ్ అందుకున్న "సిందూరం(1997)" సినిమాలోని ఈ పాట రచయితగా శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నంది అవార్డ్ కూడా అందుకున్నారు.



అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

Friday, August 13, 2010

కృష్ణశాస్త్రిగారి గళం


భాషా పాండిత్యం లేని నాబోటి సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా సరళమైన కవిత్వాన్ని రాయగల నేర్పు ఒక్క కృష్ణశాస్త్రిగారికే ఉందనటం అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుని గళం వినాలనే కుతూహలం లేనిదెవరికి? 5-2-54 లో కాకినాడ లోని సరస్వతీ గానసభ వజ్రోత్సవాల(గోల్డెన్ జూబిలీ) సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చేసిన ప్రసంగంలోని కొంత భాగం ఇక్కడ పెడుతున్నాను.

ఈ సభ జరిగిన నాలుగైదేళ్ల తరువాత ఆయన స్వరం బొంగురుపోవటం, తప్పనిసరిగా ఆపరేషన్, తదనంతరం ఆ స్వరం మూగపోవటం జరిగింది. అందువల్ల చాలా మందికి ఈ అద్భుత కవి స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఆంధ్రా షెల్లీ గా ప్రఖ్యాతిగాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గళాన్ని ఈ బ్లాగ్ ద్వారా వినిపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

Thursday, August 12, 2010

"అర్ధాంగి" (1955)


ఏ రకమైన సినిమా అయినా, చూస్తున్నంత సేపూ ఎంతో ప్రశాంతతని, హాయిని ఇస్తాయి మన పాత "బ్లాక్ అండ్ వైట్" చిత్రాలు. రంగులు లేక పోయినా ఎంతో గ్రేస్ ఉంటుంది ఆ చిత్రాల్లో. ఇక పాటల సంగతి చెప్పనక్కరలేదు. వెన్నెల్లో విహారమే. కొత్త పాటలూ, బాణీలూ కూడా బావుంటాయి కానీ అప్పటి సినిమాల, వాటిల్లోని పాటల తేరే వేరు. ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా ఒక సందేశం, దర్శకులు చెప్పదలుచుకున్న నీతి ఉండేవి. ఫలానా పాత్ర ధరించటం వల్ల "ఇది నేర్చుకున్నాను..." అని కొందరు నటులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అటువంటి అలనాటి తరానికి చెందిన కొన్ని ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటే "అర్ధాంగి". పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన రాగిణివారి "అర్ధాంగి" 1955, జనవరి 26న రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర కధకు బెంగాలీ నవల "స్వయంసిధ్ధ" ఆధారం. అర్ధాంగి లోని ’పద్మావతి’ పాత్రను సావిత్రిగారి నటజీవితంలో ఒక మరపురాయిగా చెప్పుకోవచ్చు. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో చీకటిగా మారబోయిన జీవితాన్ని వెలుగుబాటలోకి ఎలా నడిపించుకోవచ్చునో తెలుపుతుంది కధలోని పద్మావతి పాత్ర.

కధలోకి వెళ్తే, జమిందారు భుజంగరావు(గుమ్మడి)కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాఘవేంద్రరావు(నాగేశ్వరరావు) చిన్నతనంలో తల్లి చనిపోతుంది. జమిందారు రెండవ భార్య రాజేశ్వరి(శాంతకుమారి).ఆమెకు తన కొడుకు నాగేందర్రావు(జగ్గయ్య) పైన మితిమీరిన వాత్సల్యం. ఆయమ్మ పెంపకంలో పెరిగిన పెద్ద కుమారుడు రఘు మతిస్థిమితం లేనివాడు కావటంతో జమిందారు ఆస్తిని పొగరుబోతు అయిన చిన్నకొడుకు నాగు కు అప్పగిస్తాడు. బాధ్యత నెత్తిన పడిన తరువాత కూడా అతడిలో మార్పు రాదు.


రామాపురం లో వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళిన నాగు అక్కడి రైతు అయిన కోటయ్యపై దౌర్జన్యం చేస్తూండగా, మరో రైతు భూషయ్య కుమార్తె అయిన పద్మ అతడికి ఎదురుతిరిగి, అతడి అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. జరిగింది విన్న జమిందారు నాగు ను దారిలోకి తేగల వ్యక్తిగా భావించి పద్మతో అతడి వివాహం నిర్ణయిస్తాడు. కానీ అందుకు రాజేశ్వరి అంగీకరించకపోవటం తో నాగుకు బదులుగా పద్మను పెద్ద కొడుకు రఘుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

పెళ్ళిపీటల మీద భర్త నాగు కాదని, మతిస్థిమితం లేని జమిందారు పెద్దకొడుకు అని తెలుసుకున్న పద్మ నిర్ఘాంతపోతుంది. కానీ అర్ధాంగిగా తన కర్తవ్యాన్ని గుర్తించి భర్తలో మార్పు తేవటానికి ఎంతో కృషి చేస్తుంది. కానీ ఆమె సహనానికీ, పట్టుదలకూ పరీక్షగా అత్త రాజేశ్వరీ, మరిది నాగూ ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు. తన ధైర్యం, సహనం, ప్రేమానురాగాలతో పద్మ రఘును ఎలా మామూలు మనిషిని చేసింది; బాగుపడిన రఘు అధికరంలోకి రావటం సహించలేని రాజేశ్వరి, నాగూ భార్యాభర్తలను ఎటువంటి ఇబ్బందులకు గురిచేసారు; అధికార దాహంతో తప్పుదారి పట్టిన నాగును, అత్తగారు రాజేశ్వరి ఇద్దరిలోనూ తన మంచితనంతో పద్మ ఎలా మార్పును తెచ్చిందనేది మిగిలిన కధ. మొదట మతి స్థిమితం లేని భర్తగా, బాగయ్యాకా బాధ్యత గల భర్తగా, తండ్రి ఆస్తిని కాపాడే కొడుకుగా నాగేశ్వరరావు నటన మన్ననలనందుకుంది. ఇక పొగరుబోతుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగ్గయ్య, అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చాలని తాపత్రయపడే తండ్రి పాత్రలో గుమ్మడి, కొడుకుపై వల్లమాలిన ప్రేమతో అతడి పతనానికి పరోక్షంగా కారణమయ్యే తల్లి పాత్రలో శాంతకుమారి మెప్పిస్తారు.అందరినీ మించి టైటిల్ రోల్ లో భర్తను బాధించేవారి నుంచి రక్షించుకుంటూ, లాలనతో, అనురాగం తో అతడిలో మార్పు తెచ్చే సావిత్రి నటన మాత్రం అపూర్వం.

సినిమాలో సంగీతం, ఫొటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, డైలాగ్స్, దర్శకత్వమూ అన్నీ చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఆరు పాటలు, రెండు నేపథ్య గీతాలూ ఉన్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది బి.ఎన్ ఆర్(భీమవరపు నరసింహారావు). వాటిలోని "వద్దురా కన్నయ్యా" , "ఎక్కడమ్మా చంద్రుడు" పాటలు రెండూ నాకు బాగా ఇష్టమైనవి. రెండూ కూడా జిక్కీ(పి.జి.కృష్ణవేణి) పాడినవే. సన్నివేశానికి అనుగుణమైన ఆత్రేయగారి సాహిత్యం ఉదాత్తమైన భావాలను కలిగిస్తుంది. తమిళంలో ఈ చిత్రాన్ని "పెన్నిన్ పెరుమై" పేరుతో నిర్మించారు పుల్లయ్యగారు.

పాటల కోసం వెతుకుతూంటే యూట్యూబ్లో సావిత్రిగారు విజయవాడ రేడియో స్టేషన్ వారి కొసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బిట్ ఒకటి దొరికింది. ఈ ఇంటర్వ్యూ బిట్ యూ ట్యూబ్ లోకి ఎవరు పెట్టారో తెలియదు కానీ, విజయవాడ రేడియో స్టేషన్లో జరిగిన సావిత్రిగారి ఇంటర్వ్యూ తాలూకు రికార్డింగ్, డబ్బింగ్ రెండూ మా నాన్నగారు చేసారు.

ఈ సినిమాలోని పాత్ర గురించి సావిత్రిగారు చెప్పిన మాటల తరువాత ఉన్న "వద్దురా కన్నయ్యా..." పాటను కూడా ఈ లింక్ లో చూడవచ్చు. కాపీ రాగంలో స్వరపరచబడిన ఈ పాటను జిక్కీ గారు ఎంత అలవోకగా పాడేసారో అనిపిస్తుంది.


Tuesday, August 10, 2010

Runa laila's "रंजिश ही सही... "


నాకు బాగా ఇష్టమైన గజల్స్ లో ఒకటి "రంజిషీ సహీ..."

ఈ గజల్ మొదట పాపులర్ అయ్యింది ప్రముఖ గజల్ రారాజు "మెహదీ హసన్" గళంలో. అది
ఇక్కడ వినచ్చు.

నాకయితే ఈ గజల్ ను గాయని "రూనా లైలా" గళంలో వినటం బాగా ఇష్టం. "దమాదమ్ మస్త్ కలందర్.." అంటూ దేశాన్ని ఓ ఊపు ఊపిన రూనా లైలా ప్రత్యేకమైన గాత్ర శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ వాయిద్యాలు లేకుండా రూనా లైలా పాడిన ఈ గజల్ ను ఇక్కడ
వినవచ్చు.


ఆర్కెస్ట్రా తో రూనా లైలా పాడిన "రంజిషీ సహీ..."



సాహిత్యం: Ahmed Faraz

रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिए आ ।

पहले से मरासिम न सही फिर भी कभी तो
रस्म-ओ-रह-ए-दुनिया ही निभाने के लिए आ ।

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से ख़फ़ा है तो ज़माने के लिए आ ।

कुछ तो मेरे पिन्दार-ए-मुहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिए आ ।

एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ ।

अब तक दिल-ए-ख़ुश’फ़हम को तुझ से हैं उम्मीदें
ये आख़िरी शम्में भी बुझाने के लिए आ ।


భరణిగారి "ఆటగదరా శివా !!"



బెడ్ రెస్ట్ లో ఉండటం వల్ల ఇతరత్రా ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా, ఒక ఉపయోగం ఉంది. ప్రశాంతంగా ఆటంకం లేకుండా పుస్తకాలు చదువుకోగలగటం. (దానివల్ల కళ్ళకు కూడా కొన్నాళ్ళు ఇబ్బంది కలిగింది.అది వేరే సంగతి..:)) ఇటీవలి అలా చదివిన వాటిల్లో ఒకటి తనికెళ్ళ భరణిగారి "ఆటగదరా శివా !!"

భరణిగారు రాసిన "నాలోన శివుడు కలడు" పాటల గురించి రాసినప్పుడు, ఆయన "ఆటగదరా శివా !!" (1999) అన్న శివతత్వాలు కూడా రాసారని తెలిసింది. అనుకోకుండా అది నాన్నగారి పుస్తకాల్లో ఈమధ్య దొరికింది. ఎంతో సరళమైన భాషలో, అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఉన్న శివతత్వాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఆట్ట మీది "బాపూగారి బొమ్మ", అట్ట వెనుక "వేటూరిగారి మాట(స్వదస్తూరీలో)" రెండూ ఎంతో ఆకట్టుకుంటాయి.

పుస్తకంలో నాకు బాగా నచ్చిన తత్వాలు కొన్ని ...

ఆటగదరా నీకు
మూడు కన్నులవాడ
ఆటగద
మాపైన సీతకన్ను.

***
ఆటగద బతుకంత
కాలకూటముగ్రక్కు
శుధ్ధి జేతువు గదా
తులసినీళ్ళు.

***
ఆటగదరా నీకు
అన్నపూర్ణప్రియా
ఆకలికి భిక్షాట
నాట నీకు.

***
ఆటగద అందాని
కజ్ఞాన మిచ్చేవు
జ్ఞాని కొసగేవు
వికృతరూపము.

***
ఆటగద మనవాడు
ఆటగద పైవాడు
అందరిని కలిపేది
వల్లకాడు.

***
ఆటగద సొంతాలు
ఆటగద పంతాలు
ఆటగద అంతాలు
ఆట నీకు.
***

ఆసక్తిగలవారు july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన
తనికెళ్ళ భరణిగారి interview ఇక్కడ చూడచ్చు.

Wednesday, June 23, 2010

టినేజ్ ఆర్ట్ - 2

"టీనేజ్ ఆర్ట్ - 1 " అని , creative works అనే లేబుల్ లో కొన్ని ఆర్ట్ వర్క్స్ అదివరకు నేను ఇంటర్లో,డిగ్రీలో ఉన్నప్పుడు వేసిన బొమ్మలు కొన్ని పెట్టాను. అప్పట్లో చేసిన మరికొన్ని ఆర్ట్ వర్క్స్, వేసిన బొమ్మలు ఇంకొన్ని ...


పాట్ పైంటింగ్...దాంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా నేను తయారు చేసినవే.



అప్పట్లో "ఉత్తరాలు" బాగా రాసుకునేవాళ్ళం కాబట్టి, ఉత్తరాలు పెట్టుకునేందుకు గోడకు పెట్టుకునేలాక్రాస్ స్టిచ్ తో చేసింది .. ఉత్తరాలు పెట్టుకుందుకు వెనకాల క్లాత్ తో మూడు అరలు కుట్టాను..





కార్డ్ బోర్డ్ మీద చాక్ పౌడర్ తో ప్రయోగం..
sheet laminated 'Alpana designs' on colour chart:




కొన్ని పెన్సిల్ స్కెచెస్ ...




అసంపూర్ణ చిత్రం....అప్పట్లో ఎంత ప్రయత్నించినా మొహం వెయ్యలేక వదిలేసాను..


ఈమె ఎవరు? (guess who..?)








Tuesday, June 22, 2010

ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...

చాలా రోజుల తరువాత బొమ్మలపైకి మనసు వెళ్ళింది...
ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...
హేండ్ మేడ్ షీట్ మీద ఒకటి పోస్టర్ కలర్స్ తో..




రెండవది క్రయాన్స్ తో...




ఒక మంచి గణేశుని భక్తి గీతం కూడా వినేయండి మరి....ఈ ట్యూన్ నాకు బాగా నచ్చుతుంది.

Sunday, June 20, 2010

Tagore గొంతులో ఆయన కవితలు, పాట...




విశ్వకవి రవీంద్రుని(1861–1941) గురించి ప్రత్యేకించిన పరిచయం అవసరం లేనేలేదు. దాదాపు అన్నిసాహితీ విభాగాల్లోనూ అందవేసిన చెయ్యి ఆయనది. ఒక సంపూర్ణ కళాకారుడాయన. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా, చిత్రకారునిగా ఎన్నో అవతారాలెత్తారు. కానీ అన్నింటిలోకీ ముఖ్యంగా ఆయన ఒక కవిగానే మనకు ఎక్కువ కనిపిస్తారు. ఏభైకు పైగా ఉన్న గేయ సంపుటిలు, అందులోని రెండువేలకు పైచిలుకు గేయాలు, 1913లో ఆయన సాహిత్యానికి అందిన "నోబుల్ పురస్కారం" అందుకు నిదర్శనం.



ఇక లిటిరేచర్ స్టూడెంట్ గా డిగ్రీలోనూ, పిజీలోనూ కూడా ఆయన రచనలు కొన్నయినా చదివే అవకాశం లభించటం, దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా కలకత్తా ప్రయాణంలో "శాంతినికేతన్" ను చూడటం నా అదృష్టంగా భావిస్తాను నేను. ప్రయాణంలో కలకత్తాలో మాకు HMVవాళ్ళ రవీంద్రుని సొంత వాయిస్ తో రికార్డ్ చేయబడిన ఆయన కవితలూ,పాటలూ ఉన్న కేసెట్ ఒకటి దొరికింది. అందులో ని ఒక పాటనూ, ఒక రెసిటేషన్ నూ ఇక్కడ పెడుతున్నాను.


(young Tagore)


Tagore's recitations and one song in his own voice:



ఆయన పర్సనాలిటీని, ఫోటోలను చూసి ఆయన గొంతుక చాలా గంభీరంగా ఉంటుండని అనుకునేదాన్ని... కానీ విన్నాకా ఓహో ఇదా ఆయన గొంతుక అనిపించింది. పైగా ఇది ఆయనకు కాస్త వయసు పైబడిన తరువాత చేసిన రికార్డింగా నాకు తోచింది. రవీంద్రుడు స్వయంగా రాసి, స్వరపరిచి "రవీంద్ర సంగీతం"గా ప్రఖ్యాత గాంచిన కొన్ని గీతాల గురించి నా తరువాతి టపాలో....

కొన్ని "శాంతినికేతన్" ఫొటోలు...





Saturday, June 19, 2010

"పుస్తకం"లో నా రెండవ పరిచయం - "మా నాన్నగారు"



"pustakam.net" లో క్రితం ఏడు ప్రచురితమైన నా మొదటి పరిచయం వాడ్రేవు వీరలక్ష్మిగారిఆకులో ఆకునై...

ఇప్పుడు మళ్ళీ రెండవ పరిచయం -- ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు " గురించి. కీర్తిశేషులైన 62 మంది సాహితీప్రముఖుల జీవన విధానాల గురించి వారి వారి కుమారులు,కుమార్తెలు రాసిన వివరాల సంకలనం ఇది. వివరాల కోసం మరి ఓ లుక్ వేసేయండి...

చాలా మంచి పుస్తకం. ప్రతి సాహిత్య అభిమాని ఇంటా ఉండవలసిన పుస్తకం.

Friday, June 18, 2010

ఒక పాత కవిత...

ఏవో పుస్తకాలు సర్దుతూంటే ఎప్పుడో '97లో రాసిన కవిత ఒకటి కనిపించింది...చాలా రోజుల్నుంచి ఇది ఎందులో, ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా..!


పట్టుచీరల రెపరెపలు, ఘాటు సెంట్ల గుబాళింపులు...
మొహమాటపు చిరునవ్వులూ, ప్రెస్టేజీ షోఅప్ లూ...
మనిషినే శాసిస్తున్న కరన్సీ నోట్లు, బ్యాంక్ బేలన్సులు...

ఇవి ఏవీ దాచలేవు - మనిషి మనసు తహతహలూ
అవి - ఎగసిపడే అంతులేని ఆశాకెరటాలు

ఇవి ఏవీ దాచలేవు - పిడికెడు గుండె సవ్వడులు
అవి - గొంతు చీల్చుకు పైగెగసే అనురాగసౌధాలు

ఇవి ఏవీ దాచలేవు - మూగకళ్ళ కన్నీటి వ్యధలు
అవి - మోముపై కదలాడే మనోభావతరంగాలు

కానీ ఇవి అన్నీ...
వెలికి రానీయవు మనిషిలోని మమతను
అజ్ఞాతమైపోయిన మానవత్వపు వెలుగును !!

Tuesday, June 15, 2010

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే..

మూడేళ్ళ పాప పాడిన ఈ కృష్ణ భక్తిగీతం మా అమ్మాయితో పాటు నాకూ ఎంతో ఇష్టం. రెండేళ్ళ క్రితం ఎవరిదగ్గారో కాపి చేసుకుని మొబైల్లో మా వారు ఈ పాట తెచ్చారు. అప్పటి నుంచీ రాత్రిళ్ళు అన్ని జోలపాటలతో పాటూ మా పాప తప్పక వినే పాట ఇది.



సాహిత్యం:

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా((జయ))
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా ((జయ))

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే
తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
రామసోదరా కృష్ణా దీనవత్సలా ((జయ))

కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే
కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో((జయ))

భక్తదాసనా కృష్ణా హరసునీసదా
కాదునింతినా కృష్ణా సలహెయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా((జయ))


(సాహిత్యంలో ఏవన్నా మార్పులు ఉంటే ఎవరన్నా తెలుపగలరు.)

Monday, June 14, 2010

మావిడి రంగులు...colours of life !


కలర్స్ ఆఫ్ లైఫ్...అంటే ఇదే అనిపించేలా ఎంత బాగున్నాయో చూడండి ఈ మావిడి కొమ్మలు..!!
ఒకే చెట్టు ఆకులకు ఇన్ని రంగులు మనకి మళ్ళీ చెట్లలో నాకు చాలా ఇష్టమైన "రావి చెట్టు"లో కనిపిస్తాయి. ఒకే చెట్టుకు ఎన్నో రంగుల ఆకులు. రీడిఫ్ మైల్ లో ఎక్కడో ఈ ఫోటో కనిపించింది...వెంఠనే బ్లాగులో దూర్చేసా...:)

Friday, June 4, 2010

పుట్టినరోజు "బాలు" ని rare photos..!!

తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.

1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.


బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :










ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :

అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.


Musical feast







ఈ బ్లాగ్ రిజిస్టర్ చేసి రెండురోజులైంది. ఇప్పుడు మొదటి టపా రాస్తున్నాను. కూడలికి లంకె ఎప్పుడు వేస్తానో..?!



సాటిలైట్ చానల్స్ హడావుడి లేకుండా రేడియో ఏకఛత్రాధిపత్యం వహించిన 1970s & '80s రోజుల్లో.... "సంగీతప్రియ శ్రోతలకు మీ రామం నమస్కారం.." అంటూ " 4,5 సంవత్సరాల పాటు "రేడియో రామం " గా అప్పటి ప్రముఖ అనౌన్సర్ల లో ఒకరైన మా నాన్నగారు రేడియో లో ప్రొడ్యూస్ చేసిన ఒక సంగీత ధారావాహిక కార్యక్రమం పేరే" సంగీత ప్రియ ". అదే పేరును ఈ బ్లాగుకు పెట్టదలిచాను. ఈ బ్లాగులో అన్నీ సంగీతానికి సంబంధించిన కబుర్లే ఉంటాయి. నాకిష్టమైన పాటలతో పాటు శాస్త్రీయ, లలిత, సినిమా సంగీతానికి సంబంధించినవి; రకరకాల వాద్య సంగీతాలను గురించీ; ప్రముఖ సంగీతకారులూ, సినీ కళాకారుల సంబంధిత టపాలూ ఉంటాయి.



"తృష్ణ" బ్లాగ్లో అదివరకు నేను రాసిన సంగీతపరమైన కబుర్ల కోసం ఆ బ్లాగ్ లోకి తొంగి చూడాల్సిందే...ఎందుకంటే అవి కంటే ఇక్కడ లింక్స్ ఇవ్వలేనన్ని ఎక్కువ కాబట్టి..!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&



ఆమధ్యన ఒక 16CD gift pack చూశాను ఒకరింట్లో. "Sur Saaz aur Taal" అని ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారుల వోకల్ సీడీలు + సితార్, సంతూర్, తబ్లా మొదలైన వాద్య సంగీతాలతో నిండిన ఆల్బమ్స్ అవి. అద్భుతమైన కంబినేషన్. ఖరీదు కూడా కొంచెం ఎక్కువే కానీ విడిగా రెండు,మూడు చప్పున కూడా పేక్స్ ఉన్నాయిట. ఆ సీడీస్ తాలూకు ఫోటోస్ క్రింద చూడండి.















Wednesday, May 26, 2010

"డబుల్ సెంచరీ "


"రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళు రాయనన్నావు...మళ్ళీ ఎందుకు రాస్తున్నావు?" అడిగాడు గత పది రోజులుగా నేను రాస్తున్న టపాలు చూసిన మా అన్నయ్య(తను నా బ్లాగ్ రెగులర్ రీడర్). కొన్నాళ్ళుగా నత్త నడక నడుస్తున్న నా బ్లాగ్ను ఒకరోజు చూసుకుంటూంటే, 187 వ టపా నంబరు చూసాను...మేనెల చివరకు బ్లాగ్ తెరిచి ఒక సంవత్సరం అవుతుంది...ఈ లోపూ 200 టపాలన్నా పూర్తి చేస్తే...ఏదో కాస్త "తుత్తి"గా ఉంటుందనిపించింది....కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైనదో తర్వాత కానీ తెలియలేదు.

బ్లాగ్ మొదలెట్టిన దగ్గరనుంచీ నెలకి 20,25 తక్కువ కాకుండా టపాలు రాసిన నాకు ఈ చివరి 10,15 రాయటం ఎంత కష్టమైందో... అది నాకే తెలుసు ! కంప్యూటర్ లేక కొన్నాళ్ళు, ఓపిక లేక కొన్నాళ్ళూ జాప్యం జరుగుతూ వచ్చింది. ...సంవత్సరం లోపూ 200టపాలు పూర్తి అవ్వాలని రూలేం లేదు...రాస్తే ఏ అవార్డులూ రావు. రాయకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఏ ఛాలెంజ్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. అన్నీ వీలుగా ఉన్నప్పుడు టపాలు రాయటం గొప్పేమీ కాదు...పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇలా రాయగలగటం నా మనసుకైతే సంతృప్తినే ఇచ్చింది. నిన్నటి టపాతో డబుల్ సెంచరీ పూర్తయ్యింది. రాయాలనుకున్నవి రాసాను.

బ్లాగుల గురించి ఏమీ తెలియకుండా సంవత్సరం క్రితం మే28న "తృష్ణ..." మొదలెట్టాను.ఈ సంవత్సర కాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులూ, పాఠాలూ...!! మరో పది రోజులకు కూడలిలో నా బ్లాగును లంకె వేయగలిగాను. మరో నెలకు "విజిటర్స్ కౌంటర్" పెట్టడం తెలిసింది. "తృష్ణ వెంట" నడుచుకుంటూ వెళ్ళాను... ఇవాళ్టికి 47,500 పై చిలుకు అతిధులు బ్లాగు చూశారు, ఎవరన్నా ఫాలో అవుతారా? అనుకున్న నా బ్లాగుకు 45 మంది నాతో నడిచేవాళ్ళు చేరారు. సుమారు 760 పైగా వ్యాఖ్యలు సంపాదించగలిగాను. వ్యాఖ్యలు రాయకపోయినా కొత్తగా టపా రాస్తే, రెగులర్గా చదివే 150 పై చిలుకు అతిధులను సంపాదించుకోగలిగాను. ఈ లెఖ్ఖలూ, పద్దులూ ఎందుకు? నా తృప్తి కోసమే. ఏ పేపర్లోనూ పడకపోయినా, ఏ బ్లాగర్ చేతా పొగడబడకపోయినా నాలాంటి సాధారణ గృహిణికి ఒక సంవత్సరం లో ఈ మాత్రం అభిమానాన్ని సంపాదించుకోవటం ఆనందం కలిగించే విషయమే.

నాకు తెలిసిన, అనుభూతికి అందిన ఎన్నో విషయాలను మరికొందరితో పంచుకోవాలని, ఇంకా ఇంకా రాయాలని ఉన్నవి... ఎన్నో ఉన్నాయి...కానీ ఇక తొందర లేదు కాబట్టి అవి మెల్లగా ఎప్పుడో....! ఎందుకంటే బ్లాగ్ వల్ల నేనెంత ఆనందాన్ని,తృప్తినీ పొందానో, అంతే సమానమైన బాధనూ, వేదననూ కూడా పొందాను. ఎందుకు బ్లాగ్ తెరిచాను? ఈ బ్లాగ్ వల్ల కదా ఇంత దు:ఖ్ఖాన్ని అనుభవిస్తున్నాను... అని బ్లాగ్ మూసేయాలని చాలాసార్లు ప్రాయత్నించాను. విరామం కూడా ప్రకటించాను. కానీ ఎప్పుడూ పదిరోజులకన్నా బ్లాగ్కు దూరంగా ఉండలేకపోయాను. ఎప్పటికప్పుడు ఏదో శక్తి నాకు అనుకున్నది రాసే అవకాశాన్ని ఇస్తూనే ఉంది. బహుశా నాలో అంతర్లీనంగా అనుభవాలనూ, సంగతులనూ పంచుకోవాలని ఉన్న తపన దానికి కారణం అయి ఉండవచ్చు. అందుకనే నేను రాసేవి ఉపయోగకరమైనవి, ఎవరినైనా ఎన్టర్టైన్ చేసేవీ అయితే మళ్ళీ మళ్ళీ రాసే అవకాశాన్ని భగవంతుడు తప్పకుండా నాకు ఇస్తాడనే నా నమ్మకం. అందుకే ఈసారి విరామాన్నీ, శెలవునీ ప్రకటించట్లేదు...:)

ఇంతకాలం ప్రత్యక్ష్యంగా వ్యాఖ్యలతో, పరోక్షంగా మౌనంతో నా బ్లాగ్ చదివి నన్ను ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు...!!జీవితంలో ఏనాడూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ నెనెవరినీ ఇబ్బంది పెట్టి ఎరుగను. ఒకవేళ పొరపాటుగా ఎవరికైనా ఎప్పుడైనా వ్యాఖ్యల వల్ల కానీ, టపా వల్ల కానీ ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించగలరు.


ఈ టపాను ప్రముఖ ఆంగ్లకవి "Robert frost " masterpiece అయిన "Stopping By Woods on a Snowy Evening" లోని వాక్యాలతో పూర్తి చేస్తున్నాను...
"..But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep. "