Friday, August 1, 2014

నవలానాయకులు - 8




కౌముది పత్రికలో ప్రచురితమౌతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "పార్వతీశం". మొక్కపాటి వారి 'బారిష్టర్ పార్వతీశం' నవల నుండి! వ్యాసం క్రింద లింక్ లో: 

http://www.koumudi.net/Monthly/2014/august/august_2014_navalaa_nayakulu.pdf

Thursday, July 31, 2014

मैं हर एक पल का शायर हूँ...





ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, ఒకే ట్యూన్ లో , రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని "టేండమ్ సాంగ్స్" అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ సాధారణంగా మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉంటుంటాయి. "కభీ కభీ"లో రెండు వర్షన్స్ ముఖేష్ పాడినవే. నిన్న 'కభీ కభీ' లో పాట పోస్ట్ చేసా కదా.. ఇవాళ దాని జంట పాటను షేర్ చేస్తున్నాను. 

నిన్నటి "మై పల్ దో పల్ కా షాయర్ హూ.." పాట గ్లూమీగా ఉంటే ఇదే సినిమాలో సాహిత్యం మార్పుతో అదే ట్యూన్ లో సినిమా చివర్లో మరో పాట వస్తుంది.. " మై హర్ ఎక్ పల్ కా షాయర్ హూ.." అని. అది హేపీ టోన్ లో ఉంటుంది.  పాట కూడా వినేయండి మరి..


చిత్రం: కభీ కభీ

 
పాడినది: ముఖేష్

సాహిత్యం: సాహిర్ లుధియాన్వీ

సంగీతం: ఖయ్యాం



lyrics: 

मैं हर एक पल का शायर हूँ
हर एक पल मेरी कहानी है
हर एक पल मेरी हस्ती है
हर एक पल मेरी जवानी है((ప))

रिश्तों का रूप बदलता है.. बुनियादे ख़तम नहीं होती
ख्वाबों की और उमँगों की मियादें ख़तम नहीं होती
एक फूल में तेरा रूप बसा.. एक फूल में मेरी जवानी है
एक चेहरा तेरी निशानी है.. एक चेहरा मेरी निशानी है ((ప))

तुझको मुझको जीवन अमृत अब इन हाथों से पीना है
इनकी धड़कन में बसना है इनकी साँसों में जीना है
तू अपनी अदाएं बक्श इन्हें में अपनी वफ़ायें देता हूँ
जो अपने लिए सोची थी कभी.. वो सारी दुआएँ देता हूँ((ప))





Wednesday, July 30, 2014

मैं पल दो पल का शायर हूँ..


कल और आयेंगे नग्मों की खिलती कलियाँ चुननेवाले
मुझ से बेहतर कहनेवाले तुम से बेहतर सुननेवाले
कल कोई मुझको याद करे क्यों कोई मुझको याद करे
मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे

పొద్దున్నే పదే పదే ఈ ప్వాక్యాలు గుర్తొస్తే పాట పెట్టుకుని విన్నా...कल कोई मुझको याद करे.. क्यों कोई मुझको याद करे.. मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे..:-) అద్భుతమైన కఠిన సత్యం కదా!! నేను...నేను..నేను.. అనుకునే పిచ్చివాడా... ఇదే జరిగేది.. ఇదే సత్యం అని ఎంత చక్కగా చెప్పారో...!!
కవి "సాహిర్" రాసిన అద్భుతమైన సాహిత్యాల్లో ఈ పాట ఒకటి...
పాట మొదట్లో వచ్చే వాక్యాలు.. ఆ పొడూగాటి చెట్లు అన్నీ అద్భుతమే నాకు..

చిత్రం: కభీ కభీ
పాడినది: ముఖేష్
 సాహిత్యం: సాహిర్ లుధియాన్వీ
సంగీతం: ఖయ్యాం

 


 సాహిత్యం:

मैं पल दो पल का शायर हूँ

पल दो पल मेरी कहानी हैं
पल दो पल मेरी हस्ती है
पल दो पल मेरी जवानी हैं((ప))

मुझ से पहले कितने शायर आये और आकर चले गए

कुछ आहे भर कर लौट गए कुछ नग्में गा कर चले गए
वो भी एक पल का किस्सा थे मैं भी एक पल का किस्सा हूँ
कल तुम से जुदा हो जाऊंगा वो आज तुम्हारा हिस्सा हूँ ((ప))

कल और आयेंगे नग्मों की खिलती कलियाँ चुननेवाले

मुझ से बेहतर कहनेवाले तुम से बेहतर सुननेवाले
कल कोई मुझको याद करे क्यों कोई मुझको याद करे
मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे((ప))


Wednesday, July 23, 2014

"బారిష్...."


 
మధ్యన Fmsలో ఎక్కువగా వస్తున్న "బారిష్...." అనే పాట చాలా బావుంది. చిత్రం పేరు 'YAARIYAN' ట. నాకు ట్యూన్, లిరిక్స్ రెండూ నచ్చాయి.

పాట: బారిష్..
పాడినది: మొహమ్మద్ ఇర్ఫాన్,
అడిషనల్ వోకల్: గజేంద్ర వర్మ
సంగీతం: మిథున్
సాహిత్యం: మిధున్




female version link:
singer: Tulsi kumar
http://youtu.be/LnbqusICm88



link for yaariyan audio songs and downloads:
http://www.songspkshare.com/yaariyan-2014-songs-pk-hindi-movie-songs-mp3-download/68/

Thursday, July 17, 2014

పాట వెంట పయనం - సినీ జానపదగీతాలు


'సారంగ' జాల వారపత్రికలో ప్రచురిరమవుతున్న "పాట వెంట పయనం" శీర్షికలో ఈసారి నేపథ్యం "జానపద గీతాలు"!
క్రింద లింక్ లో వ్యాసాన్ని, కొన్ని సినీ జానపదగీతాలను చూడవచ్చు..
 

http://wp.me/p3amQG-2QB



Friday, July 11, 2014

షిర్డీ - భీమశంకర్




 
 


హాలిడేస్ అన్నీ అయిపోయాయి.. ఎక్కడికీ వెళ్ళలేదు.. స్కూళ్ళు మొదలయిపోయాయి.. మళ్ళీ నెలాఖరు వచ్చేస్తే పరీక్షలు వచ్చేస్తాయనీ, వీకెండ్ కనీసం షిర్డీ అయినా తీసుకువెళ్ళమని అయ్యగారి చెవిలో ఇల్లుకట్టేస్కుని మరీ పోరేసాం పిల్లా, నేనూ.  షిర్డీ కి టికెట్స్ బుక్ చేసానని అయ్యగారు ఫోన్ చెయ్యగానే ముందర నెట్ ఓపెన్ చేసి ఇంతకు ముందు చూడని నియరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని వెతికాను. కాస్త దూరమైనా వెళ్లదగిన ప్రాంతంగా "భీమశంకర్" కనిపించింది. సుమారు 180-200kms దూరం షిర్డీ నుండి. 200kms లోపూ అయితే ఒకపూటలో వెళ్ళిరావచ్చు. సో, ఈసారి బాబాగారి దర్శనం అయ్యాకా భీమశంకరానికి వెళ్దామని అని గాఠ్ఠిగా చెప్పేసి, గ్రీన్ సిగ్నల్ సంపాదించేసుకున్నా. ఈ జీవితకాలంలో వీలయినన్ని పుణ్యక్షేత్రాలే కాక వీలయినన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలూ చూడాలని నాకో బలమైన కోరిక ఉంది. ఇదివరకూ శిర్డీ వెళ్ళినప్పుడే నాసిక్-త్రయంబక్, మరోసారి ఘృష్ణేశ్వర్ వెళ్ళాం. ఇప్పుడు 'భీమశంకరం' కూడా జ్యోతిర్లింగం అని చదివాకా, చిన్న ప్రయాణమైనా ఈ ట్రిప్ లో మరో జ్యీతిర్లింగం చూసే అవకాశం వదులుకోవాలనిపించలేదు. అవసరమైతే సండే కూడా ప్రయాణం ఎక్స్టెండ్ చేసుకుందాం అని కూడా అనుకున్నాం.


రెండు రోజుల క్రితమే బుక్ చేసుకోవడం వల్ల క్రితం గురువారం సాయంత్రం ప్రయాణం సమయానికి RAC లోకి మాత్రమే వచ్చాయి టికెట్లు. లక్కీగా మా ఇంటివెనక రైల్వే షేషన్లో ఇప్పుడు వెళ్లాల్సిన రైలు ఆగుతుంది. ఎక్కి కూర్చున్నాం. సైడ్ లోయర్ సీట్లు రెండూ వచ్చాయి. చాల్లేమ్మని ముగ్గురం అందిమీదే కూచున్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళు వేరే బోగీలోకి వెళ్పోతూ అప్పర్ బెర్త్ ఒకటి ఇచ్చేసారు. ఇంకేముంది.. నన్ను పైకెక్కించేసి పిల్లా, వాళ్ళ నాన్నా క్రింద దాంట్లో ఎడ్జస్ట్ అయిపోయారు. హాయిగా కాసేపు పుస్తకం చదువుకున్నా. కాస్త నిద్రపట్టే సమయానికి క్రింద ఉన్న ఫ్యామిలీ తాలూకూ రెండేళ్ల పిల్లాడు పేచీలు మొదలెట్టాడు. పిల్లాడి కూడా ఉన్న నలుగురికీ, మాకూ కూడా చుక్కలు చూపించాడు ఆ పిల్లాడు చాలాసేపు. ఇహ ఆ రాత్రి నిద్ర లేదు :(

పొద్దున్నే నాగర్సోల్ లో దిగి షేరింగ్ జీప్ లో శిర్డీ చేరాం. జనం ఎక్కువగా ఉండరనే శుక్రవారం పెట్టుకున్నాం ప్రయాణం. త్వరగా ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాం. గంట అవ్వకుండానే చాలా చక్కని దర్శనం అయింది. క్యూలో వెళ్ళేప్పుడు మందిరంలోకి వెళ్ళగానే కుడివైపు లైన్ లోనే ఉంటే బాబాగారి ముందర వైపు ఉండే హాల్లోంచి బయటకు వెళ్ళచ్చు. ఎక్కువ సేపు దర్శనం అవుతుంది. అలా బాబాగారిని చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ బయటకు వచ్చేసాం. ఇక "భీమశంకరం" గురించి కనుక్కున్నాం. పూనా, ముంబై, ఔరంగాబాద్ల నుండి బస్సులు ఉంటాయిట. విడిగా ఇక్కడ్నుంచి వెళ్ళిరావడానికి పది గంటలు పడుతుందిట. పొద్దున్నే బయల్దేరితే సాయంత్రానికి రావచ్చు. షేరింగ్ టాక్సీలు, మనుషులు కూడా దొరుకుతాయి అని చెప్పారు. కానీ మాకు మర్నాడు సాయంత్రమే రిటర్న్ ట్రైన్. టైం సరిపోదు. ఇప్పుడే వెళ్తే రాత్రికి లేట్ అయినా వచ్చేసి రూమ్ లో పడుకోవచ్చు..అనుకున్నాం. మా ఒక్కళ్ళకే అంటే టాక్సీకి బాగా ఎక్కువే పడింది కానీ ఇంత షార్ట్ ట్రిప్ లో టైం వేస్ట్ అవకూడదని ఇంక భోం చేసేసి ఒంటిగంటన్నరకి భీమశంకరం బయల్దేరిపోయాం. బయట బోలెడు ఎండ. రాత్రి రైల్లో నిద్రలేదేమో కారులో ఏసీ ఉండటంతో హాయిగా ముగ్గురం నిద్రపోయాం. మూడున్నరకి అయ్యగారి ఆఫీసు ఫోన్లకి మెలకువ వచ్చింది. నాలుగున్నర దాకా ఎండగానే ఉంది. అప్పటి నుండీ తోవ కొండపైకెక్కడం మొదలయ్యింది.




సహ్యాద్రీ కొండల మధ్యలో.. అంటే ఏదో కొండల మధ్యలో గుడి ఉంటుందేమో అనుకున్నా కానీ మరీ పై పైకి పోతుంటే డౌటొచ్చి డ్రైవర్ని అడిగాం గుడి కొండ మీద ఉంటుందా? అని. కొండెక్కి మళ్ళీ కాస్త క్రిందకి మెట్లు దిగాలి అన్నాడతను. ఇంకా డ్రైవర్ ఏం చెప్పాడంటే, గుడి ఉన్న కొండ క్రింద ప్రదేశంలోనే బొంబాయి ఉందిట. మెట్ల దారి ఉందిట, కొందరు ట్రెక్కింగ్ కూడా చేస్తారుట.





ఈ డ్రైవర్ మరీ సైలెంట్ మనిషి. నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానమే ఇస్తున్నాడు. కానీ నెమ్మదస్తుడు. మంచివాడు. చాలా జాగ్రత్తగా, నేర్పుగా డ్రైవింగ్ చేసాడు. సరే ఇంక కొండ దారి పైపైకి పోతోంది. ఒకే కొండ కాకుండా కొన్ని కొండల సముదాయాలు అవన్నీ. సో పైకి వెళ్తూంటే క్రిందకి వెళ్పోయిన కొండలు, లోయలు, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. హటాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎండంతా పోయి మబ్బులు, చల్లగాలి, చినుకు మొదలైంది. కార్లో ఏసీ ఆపించేసి గ్లాస్ దించేసాం. చిరుజల్లు అలా విండో లోంచి మీద పడుతూ ఉంటే బావుంటుంది..:)


దారిలో గోనె గోంగళ్ళు కప్పుకుని మేకలు తోలుకెళ్ళే కాపర్లు, పొలం దున్నుకునే రైతులు కనబడ్డారు. ఆ కొండ ప్రాంతాన్నే వాలు ఎక్కువ లేని చోట్ల కాస్త కాస్త మేర చదును చేసేసి ఏవో పంటలు వేసేసారు. కొండల పైనుండి చూస్తే అక్కడక్కడ ఆకుపచ్చ తివాచీలు పరచినట్లు పచ్చని పంటలు. ఎంతో అందంగా ఉందా ప్రదేశం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా కనబడింది దారిలో.


 ఐదయ్యేసరికీ వాతావరణం ఇంకా మారిపోయింది. తెలీకుండానే బాగా ఎత్తులోకి చేరిపోయాం. ఐదున్నర అవ్వకుండానే ఏడున్నరలా ఉంది చీకటి. చుట్టూరా దట్టంగా మబ్బులు.. రోడ్డుకిరుపక్కలా అడవిలో ఉన్నట్లు పెద్ద పెద్ద చెట్లు.. ఆ చెట్ల మధ్యన లీలగా కనబడుతున్న దారి. ఓ చోట దారి పక్కగా నిలబడి గోనె గొంగళి కప్పుకున్న ఒకతను అలాంటివే ప్లాస్టిక్ కవరలు అమ్ముతున్నాడు. గాలికి గొడుగులు ఎగిరిపోతాయని అక్కడందరూ ఇవే వాడతారుట. తల మీంచి కప్పేసుకుని అడుగున రెండు కొసలు కలిపి ముందువైపుకి ముడి వేసేసుకుంటున్నారు. సరదాగా ఉన్నాయని మేమూ కొన్నాం ఆ కవర్లు.

మధ్యలో ఒక చోట మాత్రం దిగకుండా ఉండలేకపోయాం. కొండదారి కాస్త పక్కగా మళ్ళి చెట్లు అవీ ఉన్నాయి. బోలెడు మబ్బులు ఉన్నాయక్కడ. దిగి అక్కడ మబ్బుల మధ్యన నిలబడి కారబ్బాయితో రెండు ఫోటోలు తీయించుకునేంతలో వర్షం పెద్దదయిపోయింది. గబగబా కార్లో కొచ్చేసాం. ఆగేందుకు టైం కూడా లేదు. మళ్ళీ గుడి చూసాకా, పైకి వచ్చినంత దూరం వెనక్కి క్రిందకి వెళ్ళాలి చీకట్లో అనుకునేసరికీ నాకు భయం వేసింది. కానీ ఆ వాతావరణం, ఆ చల్ల గాలి, మబ్బులు అసలు ఏవేవో లోకాల్లోకి తీస్కెళ్ళిపోయాయి మమ్మల్ని. భయం మర్చిపోయా.


గుడి వద్దకు చేరేసరికీ సాయంత్రం ఐదున్నర. నాలుగ్గంటల్లో తీస్కువచ్చాడు డ్రైవర్. అక్కడకి చేరేప్పటికీ వర్షం ఇంకా పెరిగిపోయింది. నాలుగడుగులు వేస్తే మెట్లదారిలో షెల్టర్ ఉంటుందని చెప్పారు. అందుకని ఇక ఆగకుండా గుడివైపు వెళ్పోయాం. ఇందాకా సరదాకి కొన్న ఆ ప్లాస్టిక్ కవర్లే మాకు గొడుగులయ్యాయి. షెల్టర్ ఉన్న మెట్లదాకా చేరేసరికీ తల మీద కవర్ వల్ల తల తప్ప మొత్తం తడిసిపోయాం. పిల్ల చలికి వణికిపోయింది. వర్షం వల్ల ఇంకా చీకటిగా అయిపోయింది. మెట్లకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు అడవిలాగ. ఆట్టే మెట్లు లేవు కానీ తిరుపతి మెట్లదారి గుర్తుకు వచ్చింది. మనుషులు తిరుగుతున్నారు కాబట్టి భయమెయ్యలేదు. గుడి దాకా వచ్చేసరికీ కాస్త చలి, వణుకు తగ్గాయి. ఇంత పైకి దారి పెట్టి మళ్ళీ క్రిందకి గుడి ఎందుకు కట్టారో అని డౌట్ వచ్చింది. అసలీ గుడి ఎవరు కట్టారో? వర్షం వల్ల చాలా కొట్లన్నీ మూసేసారు. స్థలపురాణం పుస్తకం ఎక్కడా కనబడ్లేదు. గుడి పదమూడవ శతాబ్దం నాటిదని వికీలో రాసారు. స్థల పురాణం అక్కడ చదవవచ్చు.
 
 

ఏడెనిమిది నిమిషాల్లో క్రింద గుడి వద్దకు చేరాం. వానవల్లో ఏమో ఎక్కువ జనం లేరు. ఆర్భాటం లేని చిన్న గుడి. నల్లరాతి కట్టడం. గర్భగుడిలోకి రానిస్తున్నారు. అన్ని జ్యోతిర్లింగాలయాలలో మల్లె శివలింగం వెనుక వైపుకి పెద్ద అద్దం ఉంది. గర్భగుడి బయట ఉన్న భక్తులకు శివలింగం,అలంకారాలూ కనబడేలాగ. లోపలికి వెళ్ళి స్వయంగా పూలు,బిల్వపత్రాలు అవీ మనం పెట్టుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇదివరకూ కాశీలో, ఘృష్ణేశ్వర్ లో, త్రయంబకం లో కూడా ఇలాగే స్వయంగా శివలింగం వద్ద స్వయంగా అభిషేకం, పూజ చేసుకునే అవకాశం దొరికాయి మాకు. శ్రీశైలంలో మాత్రం కుదరలేదు. ఏ తోపుడూ హడావుడీ లేనందువల్ల కాసేపు అక్కడే గడిపి బయటకు వచ్చేసాం. గుడి కట్టిన రాతి మహిమో, గుడిలోపలి దేవుడి మహిమో తెలీదు కానీ కొన్ని గుళ్ళలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడా అలానే అనిపించింది. అన్ని గుళ్ళలో అప్పటికి వర్షం కాస్త నెమ్మళించింది. బయట నందీశ్వరుడు ఉన్న చోట పెద్ద గంట ఉంది. అది బాజీరావుపేష్వా అక్కడ పెట్టించారుట. పోర్చుగీస్ మీద తన విజయానికి గుర్తుగా ఇది + మరో నాలుగు పెద్ద గంటలు మరో నాలుగు శివాలయాల్లో పెట్టించాట్ట ఆయన. గంట మీద పదిహేడవ శతాబ్దపు సంవత్సరం కూడా రాసి ఉంది. చిన్న గుడిలా ఉండి "కమలజ" పేరుతో అమ్మవారు ఉన్నారు. పార్వతీదేవి రూపంట. గుడి వెనుక భీమా నది ప్రవహించేదిట. వర్షం వల్ల, సమయాభావం వల్ల ఇక చుట్టుపక్కల తిరిగి ఓ మారు పరిశీలించే అవకాశం లేకపోయింది. ఓ పక్కగా పొడుగాటి గోపురమున్న గుడి క్రిందన శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఇందాకా వర్షమని ఫోటోలు తియ్యడానికి లేకపోయింది. ఇప్పుడు బయటకు వస్తూంటే కాసిని తీసాను.


ఆ పెద్ద పెద్ద చెట్లు, కనుచూపుమేరలో మనిషి కనబడకుండా అలుముకున్న మబ్బులు, గాలికి కదిలే ఆకుల అలగలలు తప్ప మరే ఇతర సందడి లేని నిశ్శబ్దంలో ఎక్కువ ఎత్తులేని తేలికపాటి మెట్లు ఎక్కుతుంటే అసలు మనసు తేలికైపోయి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పడం కష్టం. సమయం ఉంటే అడవిలాగ కనబడుతున్నా ఆ చెట్లమధ్యన కాసేపు తిరగాలనిపించింది. ఎంత బాగుందో కదా..అని క్షణక్షణం అనుకుంటూనే ఉన్నాం నడుస్తున్నంత మేరా!


ఈలోపూ పక్కగా ఉన్న చిన్న కొట్లో ఆవిరిపై ఉడకపెట్టిన మొక్కజొన్నకండెలు అమ్ముతున్నారు. గబగబా కొనుక్కుని లాగించేసాం. ఆ చలిలో వెచ్చవెచ్చగా ఉన్న ఆ మొక్కజొన్న రుచి అమృతంలా తోచింది.


మరో పక్క కొట్లో అల్లం టీ పెడుతుంటే అది కొనుక్కుని తాగాం. ఆ కొట్టబ్బాయిని అడిగాను..ఈ గుడి ఎవరు కట్టారో తెలుసా? అని. ఏమో తెలీదు కానీ ఛత్రపతి శివాజీ పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారుట అన్నాడు. ఆ టీ కొట్లో శివాజీ ఏనుగు మీద ఉంటే చుట్టూరా బోలెడు మంది జనం ఉన్న పెద్ద పెయింటింగ్ ఒకటి ఉంది. ఇంకానేమో శంకరాచార్యులవారు వచ్చి ఇది జ్యోతిర్లింగ క్షేత్రమని నిర్ధారణ చేసాకా ఎక్కువ జనం దర్శనానికి రావడం మొదలయ్యిందని అతను చెప్పాడు.
 

కారుదాకా నడుస్తున్నామా చూట్టూరా మంచు కాదు మబ్బులే. అసలు రోడ్డు కనబడట్లే. మబ్బుల్లో నడుస్తున్నామని భలే సంబరపడిపోయాం. వర్షాలు మొదలయిన ఆరునెలల పాటు అక్కడ వాతావరణం రోజూ ఇలానే ఉంటుందని ఇందాకా టీ కొట్టబ్బాయి చెప్పాడు. ఎప్పుడూ ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉండగలిగే వీళ్ళెంత అదృష్టవంతులో అనిపించింది. అంత అందమైన ప్రకృతిని వదలలేక వదలలేక వదిలి..
మళ్ళీ భవసాగరాలలో ఈదడానికి మనసుని రీఛార్జ్ అయ్యిందని తృప్తి పడుతూ.. కారెక్కాం. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి నాలుగ్గంటలు ఎలా.. అనుకుంటుంటే డ్రైవర్ హాట్ బ్లోయర్ ఆన్ చేసాడు. వెచ్చటి గాలి తగిలే సరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. పిల్ల కూడా కాస్త కుదుటపడింది. మనసులోనే అతగాడ్ని పదికాలాలు చల్లగా ఉండు నాయినా అని దీవించేసాను. తిరుగుదారిలో మళ్ళీ కొండ దిగే సమయానికి మళ్ళీ మునుపున్న వాతావరణం వెలుతురు వచ్చేసాయి. ఆ మబ్బులు, మసకచీకటి అన్నీ మాయమైపోయాయి. ఎత్తు దిగిపోయాం కదా! కానీ ఏదో కొత్త ప్రపంచంలోంచి బయటకు వచ్చినట్లయి.. అదంతా కలా నిజమా? అని ఆశ్చర్యం వేసింది. దారిలో ఎందుకైనా మంచిదని పిల్లకి పేరాసెట్మాల్ సిరప్ కొన్నాం. ఇందాకా వచ్చేప్పుడు ఏసీ చల్లదనానికి ఎలా నిద్రపోయామో అలా ఇప్పుడు వెచ్చదనానికి మళ్ళీ అలానే నిద్రపోయాం. ఆరున్నరకి బయల్దేరి సరిగ్గా నాలుగ్గంటల్లో శిర్డీ వచ్చేసాం. పగలు పూట వెళ్తే అక్కడ కాసేపు గడిపి బాగా ఎంజాయ్ చేయచ్చనిపించింది నాకు.


శనివారం పొద్దున్నే మళ్ళీ ఓసారి బాబాగారి దర్శనం చేసుకున్నాం. మేం బయటకు వచ్చేసమయానికి రష్ పెరిగిపోయింది. వీకెండ్ రష్! కొత్తగా మొదలెట్టినట్లున్నారు దర్శనాల క్యూలో లడ్డూ ప్రసాదం పంచుతున్నారు సంస్థానం వాళ్ళు. ఫ్రెష్ గా బాగున్నాయి లడ్డూస్! ఇంక భోం చేసి, కాస్తంత షాపింగ్ చేసేసి, రూంకొచ్చి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ రైలెక్కడానికి బయల్దేరిపోయాం. టికెట్ల పొజిషన్ చూస్తే మళ్ళీ RAC ! అబ్బా ఇరుక్కుని వెళ్లలేం.. థార్డ్ ఏసి లో దొరుకుతాయేమో చూడమన్నా అయ్యగారిని. స్లీపర్ క్లాస్ కన్ఫర్మ్ అవ్వడం కష్టం కానీ థార్డ్ ఏసి లో ఉన్నాయని మూడు సీట్లు ఇచ్చేసారు టిసిగారు. నెట్లో చూస్తే అన్నీ క్లాసులూ ఫుల్.. ఇప్పుడెలా దొరికాయి.. అనే సందేహాలన్నీ పక్కనెట్టేసి.. ఆహా బాబాగారి దయ అనుకుంటూ చల్లగా ఏసీలో పడుకుని రిలాక్స్ అయిపోయాం. చిన్నప్పుడు ఎన్ని వందలసార్లు రైళ్ళలో తిరిగాము.. ఇప్పుడేమిటో అంత బాధ! ఏమైనా ఓపికలుండగానే తిరగాలనుకున్న నాలుగు ఉళ్ళూ తిరిగెయ్యాలి. తర్వాతర్వాత వెళ్లడం కుదిరినా ముక్కుతూ ములుగుతూ ఏం తిరుగుతాం.. అనిపించింది. ఇదివరకూ ఓసారి నేనన్నమాటలే నాకు గుర్తుకొచ్చాయి.. సుఖం ఎలా ఉంటుందో తెలీనప్పుడు ఎన్ని కష్టాలైనా పడగలం. ఒక్కసారి సుఖాలకి అలవాటుపడ్డాకా.. మళ్ళీ కష్టపడాలంటే మహా బాధగా ఉంటుంది!

 


Tuesday, July 1, 2014

నవలానాయకులు - 7


కౌముది మాస పత్రికలో ప్రచురితమౌతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సాంబయ్య" పరిచయం క్రింద లింక్ లో: 
http://www.koumudi.net/Monthly/2014/july/july_2014_navalaa_nayakulu.pdf



Friday, June 27, 2014

కొత్త పుస్తకాలు: 4. శ్రీకాంతశర్మ సాహిత్యం



ఈ నాలుగవ పుస్తకం నేను కొనలేదు. నాన్నగారికి మిత్రులు శర్మగారు బహుకరిస్తే నే తస్కరించుకు తెచ్చుకున్నా :)
నాన్నగారి మిత్రులు, కవి, రచయిత, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమగ్ర సాహిత్యం వస్తుందని తెలిసినప్పటి నుండీ ఆత్రంగా ఎదురుచూసాము. 'సృజన', 'సమాలోచన' పేర్లతో రెండు భాగాలు ప్రచురింపబడిన ఈ సమగ్ర సాహిత్యాన్ని నవోదయావారు ప్రచురించారు. రెండు సంపుటాలూ కలిపి వెల 2,500/- శర్మగారు తన సప్తతి (డెభ్భైయ్యవ జన్మదినం) సందర్భంగా మే నెల 29న ఈ పుస్తకాలను మార్కెట్లో విడుదల చేసారు. ఆయనకు ఆర్భాటాలు నచ్చని కారణంగా సభా సమావేశాలు పెట్టి విడుదల చెయ్యలేదు. మొదటి భాగం 'సృజన'లో శర్మ గారి కవిత్వ, లలితగీతాల సంపుటిలు, యక్షగానాలు, కథలూ, నవలలు, నాటకాలు, నాటికలు(ఇరుగు-పొరుగు) ఉన్నాయి. రెండవ భాగం 'సమాలోచన'లో సాహిత్యదీపాలు, అలనాటి నాటికలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, మనలో మనమాట, ఇంద్రధనుస్సు, పరిపరి పరిచయాలూ ఉన్నాయి.



ఇందులోని రచనలన్నీ వివిధ పత్రికలలో, సాహిత్య సదస్సులలో, రంగస్థలంపై, రేడియోలో వెలుగు చూసాయి. ఈ మొత్తం ఇరవై పుస్తకాలలో పధ్నాలుగు పుస్తకాలు ఇదివరలో విడివిడిగా వెలువడ్డాయి. కవిత్వంలో అనుభూతిగీతాలూ, శిలామురళి, ఏకాంతకోకిల, ఆలాపన; ఇంకా రెండవ సంపుటిలో సాహిత్య దీపాలు, ఆలోచన, పరిపరిపరిచయాలూ ఇదివరకూ నాన్నగారి వద్ద చదివాను నేను. మిగిలినవి నేను కూడా ఇంకా చదవవలసి ఉంది. ఆసక్తిగల సాహితీమిత్రుల కోసం ముందు పుస్తకం విడుదల గురించి ఈ కొద్దిపాటి వివరాలతో టపా రాస్తున్నాను. 



చిన్నప్పటి నుండీ ఎరిగున్న నాన్నగారి స్నేహితులుగా కాకుండా, ఒక కవిగా నాకు శర్మ గారంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక విజ్ఞాన ఖని ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూంటే ఓ పక్కగా కూచుని వాళ్ళ సాహిత్యపుకబుర్లన్నీ వినడం భలే సరదాగా ఉండేది నాకు. ఇలా శర్మగారు అని రాయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంతశర్మ మావయ్యగారు అని పిలిచేవాళ్ళం ఆయనను. అలానే బావుంటుంది పిలవడం ఇప్పటికీ. మావయ్యగారు పాట రాస్తే సగం పదాలకు అర్థాలు అడిగి తెలుసుకునేవాళ్ళం మేం పిల్లలం. ఇప్పుడు తెలిసినంత కొద్దిపాటి తెలుగు కూడా చిన్నప్పుడు తెలీదు కదా. కొన్ని పాటల్లోని తోతెంచనా, దరిసి, ననలు తొడగవా, తమి పిలుపు మొదలైన పదాలు ఇంకా గుర్తున్నాయి.. అవి తెలుగువా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరంవారి పాండిత్యం, తెలుగు భాషాపరిజ్ఞానము ఇప్పటి తరాలకు సగమన్నా వచ్చేనా అని దిగులు కలుగుతూ ఉంటుంది నాకు. రచనా వ్యాసంగాల కోసం కాదు కానీ గ్రంధస్తమై ఉన్న తెలుగు సాహిత్యాన్ని చదవుకోవడానికన్నా మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది. 


ఎప్పుడో రచనాకాలం దాటిన కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొన్ని సమగ్ర సాహిత్యాల్లా కాకుండా, వర్తమానంలో తన సాహిత్యసంపుటిల్లో ఏ ఏ రచనలు కలపాలో, వేటిని తీసివెయ్యాలో మొదలైనవన్నీ శర్మగారు స్వయంగా చూసుకుని అచ్చుకు ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగించింది. "వెనుతిరిగి చూసుకుంటే.." అనే ముందుమాటలో శర్మ గారు చెప్పిన ఈ చివరి మాటలు నాకు బాగా నచ్చాయి..
"నా వ్యక్తిగత విశ్వాసాలు - నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకుని ఏర్పరుచుకున్నవి. ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకీ, చర్యలకీ, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే - ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యం. అందుచేత - సాహిత్య పఠనం, రచన, వ్యాసంగాలలోకి మనసు పెట్టేవాళ్ళు తమ మనస్సులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవలసి రావచ్చు; కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనస్సులోకి వెలుతురు తాకే అవకాశం ముఖ్యం - దానిని మూసి పెట్టకూడదు.
ఈ సందర్భాలలో, ఈ సంపుటాలలోని నా రచనలు ఏ మాత్రమైనా మీకు ఉపకరిస్తే, యాభైయ్యేళ్ళ నా సాహితీ వ్యాసంగం చరితార్థమైందని భావిస్తాను
."



 

ఈ సంపుటాలలోని వ్యాసాలూ, కథలు, నవలలు చదివాకా మరెప్పుడైనా వివరంగా మళ్ళీ రాస్తాను.
మొదటి సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:




 రెండవ  సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:


Wednesday, June 25, 2014

కొత్తపుస్తకాలు: ౩. స్వరలహరి


మన తెలుగు సినీ సంగీతదర్శకుల గురించి ఒక రచయిత లేదా ఓ అభిమాని వ్యాసమో పుస్తకమో రాస్తే ఒకలా ఉంటుంది. అదే ఆయా సంగీతదర్శకులతో కలిసి పనిచేసి, స్నేహం కలిగిన ఓ గాయకుడు రాస్తే విభిన్నంగా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ప్రయత్నమే ఈ పుస్తకం. సినీ సంగీతాకాశంలో తన స్వరాలతో ఓ అందమైన ఇంద్రధనస్సుని సృష్టించుకున్న స్వర్గీయ శ్రీ పి.బి.శ్రీనివాస్ రచన ఈ "స్వరలహరి". నేపథ్యగాయకుడు కాక మునుపు శ్రీ పి.బి.శ్రీనివాస్ పత్రికారంగంలో వివిధ కలంపేర్లతో రచనలు చేసేవారుట. భాష మీద పట్టు, చదివించే గుణం, మధ్య మధ్య వాడిన ఛలోక్తులు ఆయన ఎంత మంచి రచయితో తెలియజేస్తాయి. పి.బి తన వ్యాసాలలో చేసిన తమాషా ప్రయోగాలు తిరుపతి లడ్డూలోని జీడిపప్పులా, కలకండ పలుకుల్లా పాథకుల్ని ఆకట్టుకుంటాయి అని సంపాదకులు డా.కొంపల్లె రవిచంద్రన్ అంటారు.


1963-1964 ప్రాంతంలో జ్యోతి మాస పత్రికలోధారావాహికగా వెలువరించిన ఈ వ్యాసాలను గ్రంధరూపంలోకి తెచ్చింది "కళాతపస్వి క్రియేషన్స్". అన్ని విశాలాంధ్ర బుక్ హౌసుల్లోనూ లభ్యమౌవుతున్న ఈ పుస్తకం వెల కేవలం నూటఏభై రూపాయలు. ఆయన స్వర్గస్థులవ్వకముందరే పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నారుట కానీ సాధ్యమవలేదుట. ఈ ప్రయత్నం ప్రధమ వర్ధంతి లోపునన్నా పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేసారు ప్రచురణకర్తలు. వ్యాసాల మధ్యన ప్రచురించిన ఎన్నో అరుదైన, అపురూపమైన ఫోటోలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ పుస్తకంలో పి.బి. ఒక పదకొండు మంది సంగీత దర్శకుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుల వివరాలూ, పాటల ,సినిమాల వివరాలే  కాక వ్యతిగతంగా వారెలా తనకు పరిచయమో, వారితో జరిగిన కొన్ని సంఘటనలు, వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఘటనల ఉదాహరణలు, వారి అలవాట్లను గురించి ఎంతో చక్కగా వివరిస్తారు పి.బి ఈ వ్యాసాల్లో. ఈ వివరాలే ఈ పుస్తకానికో ప్రత్యేకతను తెచ్చాయి. వ్యాసం పూతయిన తరువాత ప్రతి సంగీత దర్శకుడి తాలూకూ చిన్న బయోడేటా కూడా ఒక పేజీలో అందించడం బాగుంది.

నేను ఎక్కువ వివరాలు రాయను కానీ ఒక్కో దర్శకుడి గురించి పి.బి. చెప్పిన ఒకటి రెండు విశేషాలు రాస్తాను.


హాయిగా పాడుదునా? (సాలూరి రాజేశ్వరరావు)
సాలూరివారు మంచి క్రియాత్మక హాస్యప్రదర్శనాప్రియులు(ప్రాక్టికల్ జోకర్) కూడానట. ఒకసారీ ఏవో రిహార్సల్స్ అయ్యాకా ఒక ఆంగ్ల చిత్రానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్నారుట అందరూ. రాజేశ్వరరావుగారి కారు సర్వీసింగ్ కి వెళ్ళిందిట. నేను పికప్ చేసుకుంటాను ముమ్మల్నని పి.బి అడిగితే, మీకెందుకు శ్రమ, చిన్న పనిచూసుకుని నేనే ఆటో రిక్షా మీద థియేటర్ వద్దకు వచ్చేస్తానని చెప్పారుట. పి.బి., అసిస్టెంట్స్ థియేటర్ వద్ద చాలా సేపు నించుని నుంచుని అలసిపోయి సాలూరివారు లేకుండా సినిమా చూడాలనిపించక వెనక్కివెళ్పోతుంటే అప్పుడు వచ్చారుట. సినిమా అయ్యాకా చెప్పారుట.. మీతో ఆటో రిక్షాలో వస్తానన్నాను కదా. ఆటో కోసం టాక్సీ వేసుకుని  ఊరంతా వెతికి ఈ ఆటో దొరికి వచ్చేసరికీ ఇంత లేటయ్యింది. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను లేకపోతే రాకపోదును అన్నారుట.


వేణు -గానలోలుడు
మాష్టర్ వేణు గా పిలవబడే మద్దూరి వేణుగోపాల్ కు హార్మోనియం,పియానో, సితార్,గిటార్,దిల్రుబా,మేండొలీన్, ఎకార్డియన్, ఫ్లూట్,సెల్లో,ఉడొఫోన్,జలతరంగిణి,హేమండ్ ఆర్గన్ మొదలైన పదిపదిహేను వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉండేదిట. ఎవరైనా ముఖ్య వాయిద్యగాళ్ళు రికార్డింగ్కి రాలేకపోతే తానే ఆ స్థానాన్ని భర్తీ చేసేసేవారుట. నౌషాద్ కు వీరాభిమానిట. నౌషాద్ సంగీతం ముందర ఎవరి సంగీతం రక్తి కట్టదని ఆయనకొక నిశ్చితాభిప్రాయం ఉండేదిట.


 సుసర్ల దక్షిణామూర్తి:
లతా మంగేష్కర్ చేత ప్రప్రధమంగా తెలుగు సింహళ భాషలలో పాడించిన ఘనత సుసర్లవారిది. భానుమతికి భానుమతి చేతే "అందంలో పందెమేస్తా" అని పాడించారు.  "చల్లని రాజా ఓ చందమామ", "జననీ శివకామినీ" మొదలైన హిట్స్ ఇచ్చారు. చక్కని పాటలెన్నో పాడి ప్లేబాక్ సింగర్ గా కూడా పేరు గడించారు.


పాటల టంకశాల ఘంటసాల
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని  పధ్ధెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చారుట ఘంటసాల. తర్వాత ఒక నాటక కంపెనీని నడుపుతూ  నష్టాల్లో ఉండగా సముద్రాల రాఘవాచారిగారు వీరి గొంతు బాగుందని మద్రాసు రామ్మన్నారుట. నాటక కంపెనీ మూసేసి ఇరవై రూపాయిలతో మద్రాసు చేరుకున్నారుట ఘంటసాల.


సప్తస్వరాల ఉయ్యాల
తెలుగువారు ఎక్కువగా పాడుకునే సినిమా పాటల్లో ఎక్కువభాగం పెండ్యాల నాగేశ్వరరావు గారివేనట. జగదేకవీరునికథ లో శివశంకరీ పాటకు నాయకుని గానానికి శిల కరిగిపోవలసి ఉంది.మీరెలా కరిగిస్తారోమరి అన్నారుట దర్శకులు కె.వి.రెడ్డిగారు. అహర్నిశలూ శ్రమించి ఆ పాటకు  బాణీ రూపొందించారుట ఆయన.


ఇంకా ఈ పుస్తకంలో...
* స్వరపరాయణ ఆదినారాయణ రావు గారు,
* రసికజన మనోభిరామ అశ్వత్థామ(సుప్రసిధ్ధ వైణికురాలు గాయిత్రి వీరి కుమార్తె),
* స్వరాల రాజు టి.వి.రాజు(పూతి పేరు తోటకూఅ వెంకటరాజు),
* జంట స్వరాలు(ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి),
* స్వరసప్తాచలపతి తాతినేని చలపతి,
*జనం నోట తనపాట పలికించిన చిలక కె.వి.మహాదేవన్ (పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్)
మొదలైన సంగీతకారుల గూర్చిన కబుర్లు ఉన్నాయి.

ఇలా ఇందరు మహానుభావుల గురించిన ఎన్నో కబుర్లు ఉన్న ఈ పుస్తకం మరి దాచుకోవలసిన తాయిలమే కదా!

Monday, June 23, 2014

కొత్త పుస్తకాలు :2. నివేదన


 రెండవ పుస్తకం కూడా చిన్నదే..
"నివేదన" పేరుతో వెలువడిన ఈ పుస్తకంలో "కొరొ జాగొరితొ"(where the mind is without fear..) అనే రవీంద్రుని కవితకు తెలుగులో లభ్యమయిన ఒక వంద అనువాదాలు ఉన్నాయి. నోబుల్ పురస్కారాన్ని అందుకున్న "గీతాంజలి" కావ్యమాలలోనిదీ గేయం. ఇదివరకూ కొన్ని అనువాదాలతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని మరిన్ని లభ్యమైన అనువాదాలు కలిపి పునర్ముద్రణ చేసారు. గీతాంజలి తెలుగులోకి అనువాదమై శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకరూపాన్ని నివాళిగా అందించారు "సంస్కృతి" సంస్థ వారు. వెల వంద రూపాయిలు.




క్లాస్ గుర్తులేదు కానీ ఈ కవిత చిన్నప్పుడు ఇంగ్లీష్ పొయిట్రీ టెక్స్ట్ లో ఉండేది. తర్వాత రేడియోలో రజని గారి పాట వినడమే. గత వంద సంవత్సరాలలో దాదాపు ఒక వందమంది రచయితలు ఈ కవితకు తమ తమ అనువాదాన్ని అందించారుట.  ఒక్క కవితకు ఇందరు అనువాదాన్ని అందించడం అనేది ప్రపంచ సాహిత్యంలోనే చాలా అరుదైన విషయం కదా. ఈ పుస్తకంలో మన బ్లాగ్మిత్రులు అనురాధ గారి అనువాదం కూడా చోటు చేసుకోవడం మరో విశేషం.


నివేదన లోని అనువాదకులు కొందరి పేర్లు: చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, తిరుమల రామచంద్ర, ఆచంట జానకీరామ్, బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, శంకరంబాడి సుందరాచారి, కొంగర జగ్గయ్య, మో, ఓల్గా, గుర్రం జాషువా, రావూరి భరద్వాజ, వాడ్రేవు చినవీరభద్రుడు మదలైనవారు. అసలిలా ఒకేచోట ఇందరి అనువాదాలు చేర్చాలన్న ఆలోచన బి.ఎస్.ఆర్.కృష్ణ గారికి వచ్చిందిట. ఈ పుస్తకం గురించిన ప్రకటన చదివినప్పుడు ఒకే కవితకు వందమంది ఏం రాస్తారు?ఎలా రాస్తారు? అనుకున్నా కానీ ఒకే కవితకి ఇందరి అనువాదాలూ, ఇందరి అభిప్రాయాలూ, పదాల పొందిక, వారి వారి వొకాబులరీ ఇవన్నీ చదువుతుంటే కూడా భలే సరదాగా ఉంది. వీటిల్లో ఒక్కటి కూడా ఇదివరకూ తెలియవు కానీ రజని గారు ఈ గేయాన్ని తెలుగులోకి అనువదించి స్వరపరిచి, గానం చేసిన అనువాదమొక్కటే నాకు చిన్నప్పటి నుండీ తెలుసు. ప్రస్తుతం మా PCకి ఆయొచ్చి నిద్దరోతున్నందున ఆ గానాన్ని ఈ టపాలో వినిపించలేకపోతున్నాను :( సాహిత్యం మాత్రం రాస్తాను..

రజని గారి తెలుగు అనువాదం :

చిత్తమెచట భయశూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమో
గృహప్రాంగణ తలములు ప్రాచీరమ్ముల
దివారాత్ర మృత్తికా రేణువుల
క్షుద్ర ఖందములు కావో!

వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరిసి వెలువడునో
కర్మధార యెట అజస్ర సహస్ర స్రోతమ్మై
చరితార్థంబై, అనివారిత స్రోతమ్మై
దేశదేశముల దెసదెస లంటునో
తుచ్ఛాచారపు మరుప్ర్రాంతమ్ముల
వివేక స్రోతస్విని యొటనింకదొ 
శతవిధాల పౌరుషయత్నమెచ్చట
నిత్యము నీ ఇచ్ఛావిధి నెగడునో

అట్టి స్వర్గతలి భారతభూస్థలి
నిజహస్తమ్మున నిర్దయాహతిని
జాగరితను గావింపవో పితా!
సర్వకర్మ సుఖదు:ఖ విధాతా!

ఇంత క్లిష్టమైన పదాలు ఎలా వాడారో.. అనీ, రజని గారి  తెలుగు భాషా పరిజ్ఞానం ఎంత గొప్పదో అనీ ఆశ్చర్యం వేసేది చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడల్లా. పుస్తకంలో  అనువాదం క్రింద అయన పరిచయంలో ఈ గేయానికి స్వరాలను అందించిన స్వరకర్తగా కూడా పరిచయం చేసి ఉంటే బాగుండేది. 


రజనిగారు - రవీంద్రసంగీతం:

"టాగూర్ రత్న" అవార్డ్ గ్రహీత, వాగ్గేయకారులు శ్రీ రజనీకాంతరావు గారు కొన్ని రవీంద్రగీతాలకు స్వరాలను అందించారు. రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కొందరు ఆకాశవాణి కళాకారులను కలకత్తా పంపి నొటేషన్స్ తెప్పించి , హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఈ గేయాలను గురించిన సిరీస్ నా 'సంగీతప్రియ' బ్లాగ్లో ఒక్కొక్కటే రాస్తున్నాను.



ఇంతే కాక ఈ గీతం పట్ల చాలా ప్రేమతో నాన్నగారు దీనికో ప్రత్యేకమైన ఫాంట్ వెతికి, టాగూర్ చిత్రంతో కలిపి ప్రింటవుట్ తీయించి ఫ్రేమ్ చేయించుకుని తన గదిలో పెట్టుకున్నారు కొన్నేళ్ల క్రితమే. క్రింద ఫోటో అదే..




***      ***     ***

మూడవది భలే పుస్తకం.. అది సినీసంగీతానికి సంబంధించినది. దాని గురించి రేపు రాస్తానేం..