సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, November 6, 2009

కాశీ యాత్ర

నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మేము ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్, ఋషీకేష్, మధుర(శ్రీకృష్ణుని జన్మస్థలం) మొదలైన ప్రదేశాలకు వెళ్ళాం. అప్పుడు హరిద్వార్ దగ్గర మొదటిసారి గంగా స్నానం చేసాను. ఎంత ఆనందంగా పవిత్రంగా అనిపించిందో చెప్పలేను...ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో ఆనాటి అనుభూతి నూతనంగానే ఉంది.
మళ్ళీ పది నెలల క్రితం మేము కాశీ, గయ మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాశీలో రెండవసారి గంగా స్నానం చేసాను. ఆనందం వేసింది కానీ చిన్నప్పుడు హరిద్వార్ లో ఆ మొదటిసారి పొందిన భావనే గొప్పగా తోచింది నాకు...ఎందుకనో మరి...!!

ఆ రోజు కాశీనాధునికి నా చేతులతో పాలాభిషేకం చేసాను, పువ్వులు వేసాను...విచిత్రంగా నాకు ఏమీ కోరుకోవాలనిపించలేదప్పుడు...అప్రయత్నంగా "ఆదిభిక్షువు వాడినేమి కోరేదీ.." పాట గుర్తుకొచ్చింది.
ఆ రోజు శుక్రవారం. విశాలాక్షి అమ్మవారి గుడి ఖాళీగా ఉంది మేం వెళ్ళినప్పుడు. ఎందుకో మరి మేం అడగకుండానే రండి కూర్చోండి అని కుంకుమపూజ చేయించి, కుంకుమ,గాజులూ ఇచ్చారు ఆ పూజారి. ఎంతైనా "ఇస్త్రీ "ని కదా..చాలా ఫీలయిపొయి ఆనందించేసాను.

అప్పుడు కాశీలో, గయలో తీసిన కొన్ని ఫోటోలు...

తెడ్డుపడవలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తూ ఒడ్దున కనబడిన వాటికి తీసిన ఫోటోలు ఇవి
"గంగా ఆయీ కహా సే..." అనే ఆర్.డి.బర్మన్ పాట గుర్తుకు వచ్చింది పడవలో వెళ్తూంటే...









ఇవి "గయ" లో ఒక గుడిలో తీసిన ఫొటోలు..



కార్తీకం లో మీతో కాశీ యాత్ర చేయించేసాను చూసారా... :)