సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, May 3, 2013

इस मॊड सॆ जातॆ हैं..





విడుదలౌతూనే వివాదాల్లో చిక్కుకున్న సంచలనాత్మక చిత్రం, గుల్జార్ దర్శకత్వం వహించిన “ఆంధీ(1975)”. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో గుల్జార్ రాసిన నాలుగు పాటల్లో మూడుపాటలు క్లాసిక్స్ గా సంగీతప్రియులందరిచే ఈనాటికీ పరిగణించబడతాయి. “తేరే బినా జిందగీ సే కోయీ..” నా ఆల్ టైమ్ ఫేవొరేట్. ఎన్ని వందల పాటలు నచ్చినవి ఉన్నా.. నా మనసు ఈ పాట దగ్గరే నిలబడిపోతుంది. ఆ తర్వాత “తుమ్ ఆగయే తో నూర్ ఆగయా హై..” కూడా మరువలేని సాహిత్యమే. అయితే ఈ రెండూ స్ట్రెయిట్ లిరిక్స్. “ఇస్ మోడ్ సే జాతే హై..” అనే మూడో పాట లోతైన అర్థంతో పాటూ, కథ లోని మలుపులను కూడా తనలో ఇముడ్చుకున్న పాట. వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాహిత్యాన్ని, అందమైన పదాలతో రాయటం గుల్జార్ ప్రత్యేకత. స్వరపరిచేప్పుడు ఆర్.డి.బర్మన్ గుల్జార్ ని అడిగారుట.. “ఈ నషేమన్ ఏ ఊరి పేరోయ్..?” అని.

ఈ పాటకో చిన్న నేపథ్యం ఉంది. "Aaj Bichhade Hain” అని ఒక పాత ప్రైవేట్ ఆల్బం ఉంది. గుల్జార్ రచనే. అందులో ఉత్తమ్ సింగ్ స్వరకల్పనలో భూపేందర్ సింగ్ పాడిన ఈ “నజ్మ్” ఎంతో హాయి గొలిపేలా ఉంటుంది. ఇదే నజ్మ్ ని కాస్త సాహిత్యం మార్చి “ఆంధీ” చిత్రానికి వాడుకున్నారు గుల్జార్. 

ఆ నజ్మ్ సాహిత్యం, వినడానికి లింక్మ్ ఇంకా ఈ పాట కబుర్లు "వాకిలి" పత్రికలో చదవవచ్చు:

http://vaakili.com/patrika/?p=2707