సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, May 31, 2011

"వివేకానంద ఎక్స్ ప్రెస్"

భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటడానికి భగవంతుడు పుట్టించిన అరుదైన రత్నాలలో ఒకరు స్వామి వివేకానంద. జీవించిన అతి చిన్న జీవితకాలంలో ఆయన సాధించినది అనంతం. భారతదేశానికే కాక ప్రపంచమంతటికీ అందించిన జ్ఞాన నిధి అపారమైనది. యువతరానికి వారు అందించిన సందేశం, ఆయన టీచింగ్స్ ప్రతి కాలేజ్ వాళ్ళు ఓ కంపల్సరీ సబ్జక్ట్ గా పెట్టి పిల్లలకి బోధించగలిగితే బావుంటుంది అనిపిస్తుంది నాకు. నాకా మహానుభావుని పై అభిమానం ఎలా మొదలైందంటే, మా ఇంట్లో "శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర" పుస్తకం ఉండేది. అది చదివినప్పుడు వివేకానందుడి గురించి కొంత తెలుసుకున్నాను. ఆ తరువాత విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో రామకృష్ణామఠ్ స్టాల్లో కొన్ని పుస్తకాలు కొనేదాన్ని. వాటివల్ల కొంత తెలుసుకున్నాను.

ఆ తరువాత కాలేజ్ లో నా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లోవాళ్ళు రామకృష్ణ మఠంలో సభ్యులు. ఆంటీ రెగులర్ గా భజన్స్ కీ వాటికీ వెళ్ళేవారు. తను నాకు చాలా సంగతులు చెప్తూండేది. "Strength is life, weakness is death." అని ఉన్న ఒక పెద్ద పోస్టర్ నాకు ఇచ్చింది . నా పెళ్ళి అయేవరకు నా గదిలో ఆ పోస్టర్ ఉండేది. ఉదాసీనంగా ఉన్నప్పుడు ఆ పోస్టర్ ను చూసి ధైర్యం తెచ్చుకునేదాన్ని. "Take the responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny." అన్న వివేకానందుడి మాటలు ఒక స్టిక్కర్ రూపంలో మొన్నమొన్నటిదాకా మా గదిలో ఉండేది. ఇల్లుమారినప్పుడు అది పీకటం ఇష్టం లేక అలా ఉంచేసి వచ్చేసా.

వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రైల్వే శాఖ ప్రారంభించిన "వివేకానంద ఎక్స్ ప్రెస్" బోయిగూడా మార్గంలో మూడురోజులు ఉంచారు. ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ఈ రైలు పర్యటిస్తోంది. గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఇలానే రైలును దేశవ్యాప్తంగా తిప్పారు. రైల్వేశాఖ వారి ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. నేను నిన్న వెళ్ళి చూసి, కొన్ని ఫోటోలు తీసుకుని వచ్చాను. నిజానికి కొన్ని మేము కలకత్తా వెళ్ళినప్పుడు బేలూర్ మఠ్ లో చూసినవే. బేలూర్ మఠ్ సందర్శనం ఒక మరపురాని అనుభూతి. అక్కడ గార్డెన్ లో ఒక వింత చెట్టు ఉంది.ఇప్పుడు ఉండో లేదో మరి. చెట్టు ఆకులు దొన్నెల్లా ఉన్నాయి. కృష్ణుడికి యశోద వెన్న పెట్టేదిట ఆ ఆకుల్లో. అందుకని ఆ పేరు వచ్చిందని చెట్టు కేదో పేరు చెప్పారు అప్పుడు. మర్చిపోయా. ఆక్కడ రాలిన ఒక ఆకు తెచ్చి పుస్తకంలో ప్రెస్ చేసి దాచాం కూడా. ఇంకా నాన్న దగ్గర ఉంది అది.

నిన్న "వివేకానంద ఎక్స్ ప్రెస్"లో తీసిన ఫోటోలలో కొన్ని:
ఈ ఫోటోలో కుడివైపు చివర ఉన్నది సిస్టర్ నివేదిత :




చికాగో నుంచి వచ్చినప్పుడుట:


కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ :




వివేకానందుని చేతి గుర్తు:

belur math view:

వివేకానంద టీచింగ్స్ లో నాకు బాగా నచ్చినది:
Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.

Monday, May 30, 2011

Kung Fu Panda 2

For success in life or any other achievement all that you need is "inner peace" అన్న సూత్రాన్ని చెప్పింది " Kung Fu Panda 2 ". ఇవాళ నేను చూసిన ఈ ఏనిమేటేడ్ మూవీ నాకు తెగ నచ్చేసింది. నేను 2D మాత్రమే చూశాను. కానీ ఊళ్ళో ఆడుతున్న 3D వెర్షన్ చూస్తే ఇంకా బాగుంటుందేమో. వీలైతే మళ్ళీ చూడాలి. Summer special movie, good entertainer మొదలైన అవార్డులన్నీ ఈ సినిమాకే ఇచ్చేస్తా నేను.





సీక్వెల్ సినిమాల్లో మొదటి భాగం మాత్రమే బాగుంటుంది అనే నానుడిని ఈ సినిమా బ్రేక్ చేసేసింది. నాకుమటుకు మొదటి దాని కన్నా ఈ రెండోది ఇంకా బావుంది అనిపించింది. అసలు ప్రపంచంలో అన్నీ యేనిమేషన్సే తీయాలి అని రూలు కూడా పెట్టాలనిపించేసింది. అంత హాయిగా, ఉల్లాసంగా ఉంది సినిమా. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అమెరికాలో రిలీజైన మొదటి వారంలోనే బోలెడు లాభాలార్జించిందట ఈ సినిమా.




చిన్నప్పుడు ఊళ్ళోకి ఏ animated movie వచ్చినా నాన్న మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. అందువల్ల చిన్నప్పటి నుంచీ animations పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానితో పాటుగా "డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ " వాళ్లవి అయితే బావుంటాయని ఒక నమ్మకం కూడా ఏర్పడింది. రెండేళ్ళ క్రితం మా తమ్ముడు తెచ్చిన " Kung Fu Panda" సీడీ చూసి తెగ నచ్చేసి కాపీ కూడా చేస్కున్నాను. ఆ సినిమా గురించి బ్లాగ్ లో రాద్దాం రాద్దాం అనుకుంటూండగానే దాని సీక్వెల్ కూడా వచ్చేసింది. నిన్న "వైశాలి" చూసి వస్తుంటే దారిలో ఉన్న హాల్లో " Kung Fu Panda 2 " కనబడింది. చూసేద్దామనుకుంటే పొద్దుటే ఉందిట షో. రాత్రి లేదుట. అందుకని నిన్న చూడలేదు. మన జనాలు చూస్తారో లేదో.. వారాంతం దాకా ఉంటుందో వెళ్పోతుందో.. అని ఇవాళే చూసేసా.


అద్భుతమైన డైలాగులు ఈ సినిమాకు పెద్ద ఎసెట్స్. కొన్ని గుర్తున్నాయి..

*The only thing that matters is what you choose now.
* The Cup you choose to fill has no bottom.
*Anything is possible when you have inner peace.
* మళ్ళీ ఒకచోట villioness "Shen" హీరో "Po" తో " your stupidity is mildly amusing " అంటే Po ఏమో Shen తో "your wikidity is wildly amusing " అంటాడు. ఆ డైలాగ్ భలే ఉంది.




ఈ సినిమా లోని పాత్రలకు Jack black, angelina jolie, jackie chan మొదలైన అగ్ర తారలు గళాలనందించారు.

ఈ సినిమా దర్శకురాలు "Jennifer yuh nelson". ఈవిడ "kung Fu panda" (మొదటిది) సినిమా ప్రొడక్షన్లో కూడా కీలకపాత్ర వహించి ఒక అవార్డ్ ను కూడా పొందారు. ఇప్పుడీ రెండవ సీక్వెల్ కు పూర్తి దర్శకత్వ బాధ్యతను చేపట్టి తన సత్తా నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అసలు యేనిమేషన్ సినిమలా కాక చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. సినిమా చివరలో మూడవ భాగం కూడా తీస్తారేమో అన్న హింట్ ఇచ్చారు...!





ఈ సినిమా మాలూలు హాల్స్ లో ఇచ్చి ఉంటే ఈ వేసవిలో అందరు పిల్లలూ చూసి ఆనందించగలరు. కానీ మల్టీప్లెక్సులకే పరిమితం చేస్తే ఎందరు చూడగలరు? అన్నది ప్రశ్న. అదీగాక ఈ మధ్యన పోగో, కార్టూన్ నెట్వర్క్ మొదలైన ఛానల్స్ పుణ్యమా అని కాస్తంత ఎవేర్నెస్ వచ్చింది కానీ మన దేశంలో యేనిమేషన్స్ పట్ల ఆసక్తి తక్కువనే చెప్పాలి. ఏదేమైనా ఈ టపా చదివినవారంతా వీలైతే ఈ సినిమాను కుటుంబంతో తప్పక చూడండి. ముద్దుగా, బొద్దుగా, తెలివిగా, కాస్తంత అమాయకత్వంతో నవ్వుతెప్పించే panda హీరో "Po" ను ప్రేమించకుండా ఉండలేరు.

why 'వైశాలి' ?


why 'వైశాలి' ? ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇదే ప్రశ్న బుర్రను దొలిచేసింది...తమిళంలో "ఈరం"(అంటే 'తడి' అని అర్ధం) అని అంత మంచి పేరు పెట్టి, తెలుగులో "వైశాలి" పేరు ఎందుకు పెట్టారు ఈ సినిమాకి? అని. వేరే పేరు పెట్టి ఉంటే బావుండేది. అసలు పాత సినిమాల పేర్లు పెట్టిన కొత్త సినిమాలకీ, ఆ పేరున్న పాత సినిమాలకీ ఎటువంటి సంబంధం ఉండదు. పాత "వైశాలి" సినిమా కూడా డబ్బింగే కాబట్టి అది హిట్ అయినట్లు ఇదీ హిట్ అవుతుంది అనుకున్నారేమో. ప్రేక్షకులను ఆకర్షించటం కోసం అలా పెడతారేమో మరి.


ఈ మధ్యనే అనుకున్నా మంచి సస్పెన్స్ సినిమా వస్తే బావుంటుంది... అని. "వైశాలి" ట్రైలర్ ను "నూరుపాళ్ళ నాన్సెన్స్" సినిమా ఇంటర్వెల్లో చూసినప్పుడు ఇదేదో చూడతగ్గ సినిమా అనుకున్నా. శుక్రవారం రివ్యూలు చదివితే బావుందని వచ్చాయి. శంకర్ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందని ధైర్యం. అనుకున్న టైమ్ కి టికెట్లు దొరకలేదు. సరే ఇక ఆదివారానికి బుక్ చేసాం. మొదటి సినిమా అయినా బాగా తీసాడు దర్శకుడు. కథా, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ అతనే. కథ ఇలాంటిది కాకపోయినా ఇలా super natural element ప్రధానాంశం గా ఉన్న హిందీ సినిమా "saaya"(జాన్ అబ్రహం) గుర్తుకొచ్చింది. నీరు, సిగ్నల్స్ ఇవ్వటం లాంటివి అందులో కూడా ఉంటాయి. కాకపొతే ఆ సినిమా "dragonfly" అనే ఆంగ్ల చిత్రానికి కాపీ. ఇక శంకర్ సినిమాలలో ఎక్కువ శాతం కథలన్నీ అన్నీ అవినీతి, ప్రేమల చుట్టూ తిరుగుతాయి. ఆ పరిధి దాటి ఈ కథ వైవిధ్యంగా ఉందే అనుకున్నా. కానీ రెండేళ్ల క్రితం తమిళంలో తీసిన సినిమాను తెలుగులో డబ్ చేయటానికి ఎందుకు ఆలస్యం చేసారో మరి.


ఈ సిన్మాలో నాకు నచ్చిన పాయింట్లు:
* చాలా సన్నివేశాల్లో "వర్షం" ఉండటం.


* రెండవది ఒక సీన్.. కూరల బండి దగ్గర ఒకావిడ మరొకావిడకి చెప్పిన ఒక విషయం ఎలా మొత్తం అన్ని ఇళ్ళకీ స్ప్రెడ్ అవుతుంది అని చూపించటానికి అన్ని అపార్ట్మెంట్లనీ వరుసగా చూపిస్తూ ఫోన్లు రింగ్ అయినట్లు చూపిస్తారు. గాసిప్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అనటానికి perfect example అనిపించింది.

* ఇంకా ఫోటోగ్రఫీ చాలా బావుంది. నీటిని ఎక్కువ చూపించటం వల్లనో ఏమో చాలా ఫ్రేమ్స్ లో బ్లూ షేడ్స్ ఎక్కువ కనబడ్డాయి. అది బావుంది.

* కథ గొప్పగా లేకపోయినా గ్రిప్పింగ్ నరేషన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.


* గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి.


ఒకటే చిన్న లోపం కనబడింది నాకు.. మనవాళ్ళకి సస్పెన్స్ క్రియేట్ చేయటం తెలుసు కానీ దాన్ని ఫాలో చేసి చివరిదాకా నిలబెట్టడం సరిగ్గా రాదు. చివరికి ఏం జరుగుతుందో మధ్యలోనే తెలిసిపోతే ఇంక సస్పెన్స్ మూవీస్ లో థ్రిల్ ఏం ఉంటుంది? అయినా కూడా ఇది చాలా చాలా బెటర్ మూవీ అనే చెప్పాలి.



నటీనటులు కూడా సరిగ్గా సరిపోయారు.తేజ సినిమా "ఒక V చిత్రం" సినిమాలో(comedy భలే ఉంటుంది.) ఈ 'ఆది' ని చూసి కొత్తవాడైనా బాగా చేసాడు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇదే అతడిని చూడటం. పాత్రలో సరిపోయాడు. నటుడిగా పరిణితి కనబడింది. ఇతని మిగిలిన సినిమాలు నేను చూడలేదు. ఇక సింధు మీనన్ "చందమామ"లోనే కాజల్ తో పాటూ భలే నచ్చేసింది. అందులో బబ్లీ రోల్. చాలా ఏక్టివ్ గా, రిఫ్రెషింగా అనిపించింది. తనను కూడా మళ్ళీ ఇందులోనే చూశాను నేను. ఇందులో సాఫ్ట్ కేరెక్టర్. ఆ పాత్రపై జాలి కలుగుతుంది. తన తప్పు లేకుండా ఇంట అన్యాయమా అని సినిమా అయిపోయాకా కూడా ఆలోచిస్తూ ఉండిపోతాం కాసేపు..! 'శరణ్య' కు పెద్దగా రోల్ ఏమీ లేదు సినిమాలో. "విలేజ్ లో వినాయకుడు" సినిమాలోనే టాలెంట్ చూపించిన ఈ కేరళ కుట్టికి కూడా కాస్తంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటే బాగుండేదేమో అనిపించింది.





సినిమాకి తమన్ చేసిన సంగీతంలో గుర్తుంచుకోదగ్గ పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం మాత్రం ఎఫెక్టివ్ గా ఉంది. ఇతని పాటల్లో మెలడీ తక్కువ హోరు ఎక్కువ ఉంటుంది. ఇతను ప్రఖ్యాత తెలుగు నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్యగారి మనవడు అని "వికీ" చెప్పింది. సినిమా మొదటి భాగంలో flash back నూ, వర్తమానాన్ని జతపరుస్తూ ఏకకాలంలో చూపించే టెక్నిక్ ను చూస్తూంటే మణీరత్నం "సఖీ" సినిమా గుర్తొచ్చింది. రెండవ భాగం మధ్యలో కొంచెం బోర్ అనిపించింది. ఇంకా బాగా హేండిల్ చేయచ్చు కానీ మొత్తమ్మీద పర్వాలేదనిపించింది. ఏదేమైనా సినిమాలకు వెరైటీ సబ్జెక్ట్స్ ను ఎంచుకోవటంలో తెలుగు సినిమా వెనకబడిందనే చెప్పాలి. అంతేకాక ఇలాంటి వెరైటీ థీమ్స్ ను ఆదరించటం తమిళ ప్రేక్షకులను చూసి నేర్చుకోవాలి అని కూడా అనిపించింది.

కొసమెరుపు:
కొద్ది కొద్దిగా పట్టిన కలత నిద్ర కాస్తా అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చిన రాంగ్ కాల్ తో ఎగిరిపోయింది. రాత్రంతా సింధు గురించి ఆలోచనలు...పట్టీ పట్టని నిద్ర తో సరిపోయింది. super natural element ఉన్నా ఎటువంటి భయం లేని ఇలాంటి క్లీన్ సినిమా చూసినా నిద్ర పట్టలేట్టకపోతే..నీ మొహానికి సస్పెన్స్ సినిమాలెందుకే? అని పొద్దున్నే నవ్వుకున్నాను !!





Saturday, May 28, 2011

ఈ పయనానికి రెండేళ్ళు...!!






బాల్యపు అమాయకత్వం, చురుకు వయసు ఆశలు,ఆశయాలు, స్మృతులు, కలలు, కోరికలు, మాటలు, పాటలు అన్నీ కలగలిస్తే ఓ మనిషి అస్తిత్వం తయారవుతుంది. అయితే వేళ్ల సందుల్లోంచి జారిపోయే ఇసుకలాగ ఏళ్ళు గడిచేకొద్దీ జీవనసమరంలో ఈ అస్తిత్వాన్ని, ఒక్కొక్క అనుభూతినీ కోల్పోతూంటాడు మనిషి. నేను నేనేనా? అని తనని తాను ప్రశ్నించుకునే సందర్భాలు బోలెడు. సంసార సాగరంలో నేను కూడా నన్ను నేను మర్చిపోయి కొట్టుకుపోతున్న తరుణంలో అనుకోకుండా మొదలెట్టిన ఈ బ్లాగ్ ప్రయాణం కోల్పోయిన నా అనుభూతులను చాలావరకూ వెతికి తెచ్చి నన్నే నాకు కొత్తగా పరిచయం చేసింది. ఇవాళ్టికి ఈ పయనానికి రెండేళ్ళు..!



ఈ రెండేళ్ళలో మామూలుగా అయితే ఎంతో కొంత భారంగా గడవాల్సిన సమయాలు బ్లాగ్ మూలంగా త్వరగా, కాస్తంత తేలికగా గడిచిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. ఇష్టమైన విషయాలను గురించి రాసే ప్రతి టపా మనసుని ఎంతో హాయిలో ముంచుతుంది. అదే హాయి ఒడిదొడుకుల జీవితాన్ని అలవోకగా గడిపేయటానికి శక్తినిచ్చింది. బ్లాగింగ్ ఒక వ్యసనం అంటారు అందరూ. కానీ ఇదొక "ఆటవిడుపు" అంటాను నేను. మొదట్లో ఏది రాస్తే చదువుతారు? అని ఉండేది. అప్పుడు "ఎవరన్నా చదువుతారో లేదో, వ్యాఖ్యలు రాస్తారో లేదో" అన్న ధ్యాసే ఉండేది. కాని నెమ్మదిగా "ఏది రాస్తే నాకు తృప్తి?" అనే ఆలోచన మొదలైంది. నా సంతృప్తి కోసం నేను రాసుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత "ఏది రాస్తే ఉపయోగకరం?" అనే ఆలోచన మొదలైంది. మన తర్వాత కూడా మన రాతలు నిలిచిపోయే ఈ అంతర్జాల ప్రపంచంలో ఎప్పుడెవరు చూసినా "ఇది ఉపయోగకరం అనో, బావుంది అనో, ఉత్సాహాన్ని నింపింది అనో.. అనుకోవాలి" అనిపిస్తోంది ఈ మధ్యన.


నిజం చెప్పాలంటే బ్లాగింగ్ నాకు ఇచ్చిన ఆనందం తక్కువ, నేర్పిన పాఠాలు ఎక్కువ. ఎంతో కష్టపడి ఇష్టంగా రాసిన టపాలకు స్పందన లభించనప్పుడు కోపం వచ్చేది. నావల్ల కాదని బ్లాగింగ్ మానేసి పారిపోదామనిపించేది. కానీ దేనికైనా పారిపోవటం పరిష్కారం కాదు కదా. "ఇప్పుడు వ్యాఖ్యలు రాకపోతే నష్టం ఏమిటి? ఎవ్వరూ చూడరు. పోనీ మానెయ్యమను. రాయదల్చుకున్నది రాసుకుంటూ ఫో. ఇప్పుడు కాకపోయినా ఎవరో ఒకరికి ఏదో రిఫరెన్స్ అవసరం అయితే అప్పుడు నువ్వు రాసింది పనికిరావచ్చు కదా. రాయటం అనేది తృప్తినిస్తున్నప్పుడు, మరేమీ చెయ్యలేనప్పుడు.. ఇదైనా చేసుకుంటూ పోవటమే " అని సమాధానపరుచుకున్నా. " ऎ हॊंसला कैसॆ झुकॆ..ऎ आर्जू कैसॆ रुकॆ...मंजिल मुष्किल तो क्या.. बुंद्ला साहिल तो क्या.." అని పాడుకుంటూ రాసేసుకోవటం మొదలుపెట్టా.


చాలా రోజుల తర్వాత ఈ మధ్యన నా బ్లాగ్ చూసిన అన్నయ్య అడిగాడు "ఏంటి దేనికోసం వెతుకుతున్నావో అది దొరికేసిందా?" అని. అవునని నవ్వాను. ఎవరైనా గమనించారో లేదో మరి..అదివరకూ "తృష్ణ... a woman's search for identity" అని ఉండేది. ఈ మధ్యనే "తృష్ణ ... జీవితాన్ని ప్రతిక్షణం జీవించాలని" అని మారిపోయింది. నేను బజ్ మొదలెట్టినప్పుడు బజ్ కి కేప్షన్ పెట్టి అదే బావుందని బ్లాగ్ కు కూడా పెట్టేసా. ఇప్పుడు ఇక నాకు ఏ ప్రశ్నలూ లేవు. ఏ వెతుకులాట లేదు. నిన్న లేదు. రేపు లేదు. ఇవాళ..ఈ క్షణమే శాశ్వతం. అంతే. జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం ఒక్కటే నేను ప్రతినిత్యం చేసేది. ఇది ఈమధ్య కాలంలో నేను అలవర్చుకున్న సత్యం.




చివరిగా ఒక చిన్న కోరిక... నా బ్లాగ్ చాలా మంది చదువుతామని చెప్తారు. కానీ అలా అప్పుడప్పుడు చదివేవాళ్ళు, కొంత కాలం నుంచీ చదివేవాళ్ళు కాకుండా మొదటి నుంచీ అంటే కూడలికి లంకె వేసిన దగ్గర నుంచీ నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటికీ మానకుండా చదివేవాళ్ళు ఒక్కరైనా అని నాకు సందేహం. మొదటినుంచీ కాకపోయినా కొంత కాలం నుంచీ చదువుతున్నా మొత్తం నా నాలుగు బ్లాగులు చదివేవాళ్ళు, నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటి వరకు పాతవన్నీ చదివినవాళ్ళు ఒక్కరైనా ఉన్నారేమో చెప్తారా ? అలా ఒక్కరున్నా నా అక్షరాలకు ప్రాణం ఉన్నట్లే.


ప్రశ్నలే ఉండవు


తలుపులు మూసినా తలపు ఆగదు
గాయం మానినా గురుతు చెరుగదు
అపోహ పెరిగితే అపార్ధం తరగదు
అపార్ధం బరువైతే నిజాయితీ కనబడదు


అవమానం ఎదురైతే అభిమానం మిగలదు
స్నేహమే ప్రశ్నైతే మాటలే మిగలవు
నమ్మకం లేకుంటే ఏ బంధమూ నిలవదు
మనసు మూగైనా ఏ పయనమూ ఆగదు


అన్నీ చింతలే ఐతే సాంత్వన దొరకదు
చిక్కులే లేకుంటే చిరునవ్వే చెరగదు
ప్రశ్నలకు బదులే దొరికితే ఏ కలతా కలగదు
జీవితమవగతమైతే అసలు ప్రశ్నలే ఉండవు

 

Thursday, May 26, 2011

ఘంటసాల, పి.లీల సినీ హిట్స్


ఈ మధ్యన కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఓ పక్కగా చిన్న రేక్ లో సీడిలను అమ్ముతున్నారు. అలా ఓ రోజు ఈ "ఘంటసాల, పి.లీల సినీ హిట్స్ " సీడీ చూడ్డం కొనటం జరిగింది. 'sa re ga ma' వాళ్ళ  ఈ mp3 లో చాలా వరకూ పాటలు మనకు తెలుసున్నవే. చివరలో ఓ పదొ ఎన్నో నాకు తెలివు అంటే. మీరు గుర్తుపట్టడానికి వీరిద్దరూ పాడిన ఈ సీడీ లోని కొన్ని మంచి పాటలు:


*ఈనాటి ఈ హాయి

*కలవరమాయే మదిలో

*లాహిరి లాహిరి లాహిరిలో

*ఓహో మేఘమాల

*మనిషి మారలేదు

*అన్నానా భామిని

*చూపులు కలిసిన శుభవేళ

*ఎచటి నుంచి వీచెనో

*ఊరేది పేరేది

*సుందరాంగులను


కొని దాచుకోవటానికి మంచి కాంబినేషన్స్.

నూరుపాళ్ళ నాన్సెన్స్ !


డిగ్రీలో ఉండగా ఓ శెలవురోజున ఓ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్ళివచ్చాకా, సినిమా పేరు అడిగారు నాన్న. విని నా వైపు అదో మాదిరిగా చూశారు. ఎందుకెళ్ళావు ఆ సినిమాకి? అనడిగారు. "కొత్త సినిమా కదా వెళ్దాం అంది తను.. అందుకని" అని నసిగా. "ఏదన్నా సినిమ చూస్తే అందులో ఏదో ఒక స్పెషాలిటి ఉండాలి. మంచి దర్శకుడో, మంచి కథ అనో, కామిడీ బావుందనో, మంచి విజువల్స్ ఉన్నాయనో, ఇష్టమైన హీరో లేక హీరోయిన్ ఉన్నారనో కూడా చూడచ్చు, కానీ ఏదో ఒకటి కొత్త సినిమా కదా అని అడ్డమైన సినిమాకీ వెళ్పోకూడదు.." అని క్లాసు ఇచ్చారు. ఆ తర్వాతఎప్పుడూ నాన్నకి అలా క్లాసిచ్చే అవకాశం నేను ఇవ్వలే.

కానీ నాల్రోజుల క్రితం చూసిన ఓ కొత్త సినిమా నాన్న మాటల్ని గుర్తు చేసింది. చూసిన నాల్రోజులకి కాస్తంత తేరుకుని ఇలా ఓ నాల్గు లైన్లు రాయగల్గుతున్నా !!

కొన్ని నూరుపాళ్ళ ప్రేమ సూత్రాలు:
* శనివారం (అదికూడా పన్నేండు గంటలు కొట్టేవరకే) మినహా ముప్పొద్దులా ఆబగా చికెన్ తినటమే ఓ అమ్మాయి జీవిత ధ్యేయంట.

* ఏ చెడు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వస్తోందని అంతా అనుకుంటారని సిగరెట్టు కాల్చాలిట !

* ఏం చెయ్యాలో తెలీని అయోమయంలో ఉంటే అబ్బాయిలు బార్లో మందు తాగటమే సరయిన మందట !

* బాగా చదివేవాడి కాన్సన్ట్రేషన్ చెడగొట్టాలి అంటే ప్రేమ నాటకం ఆడాలిట.

* వయసొచ్చిన ఆడపిల్ల వరసైన వారితో ఎన్ని గెంతులేసినా చిన్నపిల్లలు కదా అని వదిలేయాలిట.

* సదరు చిన్నపిల్లలైన వయసొచ్చిన ఆడపిల్లలు అస్తవ్యస్తంగా ఇంటి హాల్లో నిద్రోతారుట.

* ముట్టుకుంటేనే ఏదో అయిపోవటమంటేనే అసలైన,నిజమైన ప్రేమట !

* ఇరవైఏళ్ళపిల్లలకు అర్ధం కాని విషయాలు పదేళ్ళు దాటని చిన్న పిల్లలకు అర్ధమైపోతాయిట.

* కాసిని రోజులు తిండి,నిద్ర మానేసి కష్టపడిపోతే (సినిమాలో మాత్రమే) సక్సెస్ వరించేస్తుందిట.

* అర్నెలల్లో మనిషిని గుర్తు పట్టడమే కష్టమైపోతుంటే, ఏళ్ళు గడిచినా మనుషుల రూపాల్లో (ఆహార్యాల్లో) మార్పు ఉండదుట.


ఈ సినిమ చూడటమే ఒక బుధ్ధిలేని పని.
టపా రాయటం మరో వ్యర్ధమైన పని.
ఇంతకన్నా ఎక్కువ రాయటం అనవసరమైన పని .
మీరిది చదవటం ఉపయోగం లేని పని.


నాల్రోజుల క్రితం 100 % నాన్సెన్స్ అనే సినిమా చూసి మూర్ఛబోయి...వెంఠనే నెక్స్ట్ షో కి పక్క హాల్లోని 'మిస్ పర్ఫెక్ట్ ' సినిమా రెండోసారి చూసి సేదతీరాం !!


Wednesday, May 25, 2011

Socha na tha(2005)



నాలుగైదేళ్ళ క్రితం ఒక లోకల్ టివీ చానల్ లో ఈ సినిమా చూసాను. నాకు చాలా నచ్చింది. ఈ మధ్యన ఒక షాప్ లో సిడీ దొరికింది. సినిమా పేరు " सॊचा ना था" అంటే "అనుకోలేదు" అని అర్ధం. సరైన టైటిల్, మంచి కథ, అంతకన్నా మించి పాత్రలను మలిచిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా డైరెక్టర్ 'ఇంతియాజ్ అలీ' . ఇది ఇతని మొదటి చిత్రం. ఎలా ఆడిందో తెలీదు కానీ దీని తర్వాత తీసిన "Jab we met" అఖండ విజయాన్ని, ఈ డైరెక్టర్ కి ఎంతో పేరునీ తెచ్చిపెట్టింది.

కథ లోకి వస్తే, వీరేన్(అభయ్ డియోల్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన స్వతంత్ర్య భావాలు గల కుర్రాడు. అతనికి ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తారు పెద్దలు. అదితి (ఆయేషా టాకియా)ని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళిన వీరేన్ తనకు ఎరేంజ్డ్ మేరేజెస్ నచ్చవని, తానొకమ్మాయిని మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానని అదితికి చెప్తాడు. మొదటి పరిచయంతోనే వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది. చిరకాల మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటున్నా వాళ్ళిద్దరినీ చూసి పెళ్ళి కుదిరిపోయినట్లే అని సంతోషిస్తుంది అదితి ఆంటి(రతీ అగ్నిహోత్రి). అదితి సలహా మేరకు ఇంటికి వెళ్ళాకా అమ్మాయి నచ్చలేదని చెప్తాడు వీరేన్. ఈ సంగతి ఆ రెండు కుటుంబాల మధ్యన జగడానికి దారి తీస్తుంది.

(నాకు చాలా ఇష్టమైన పెళ్ళి చూపుల సీన్. .)


వీరేన్ ప్రేమించిన అమ్మాయిని ఒప్పించటానికి అదితి అతనికి చాలా సాయం చేస్తుంది. వీరిద్దరినీ బయట చూసిన అదితి బంధువులు పెద్ద గొడవ చేస్తారు. దాంతో రెండు కుటుంబాల మధ్యన రాజుకున్న జగడం వైరంగా మారుతుంది. క్రిష్టియన్ అయిన వీరేన్ ప్రేమికురాలిని ఒప్పుకోవటానికి వీరేన్ తండ్రి(సురేష్ ఓబ్రాయ్) ఒప్పుకోడు. కుటుంబాన్ని, తండ్రి ని ఒప్పించటానికి వీరేన్ వదిన(అయేషా ఝుల్కా) సహాయాన్ని అడుగుతాడు. వీరేన్ కుటుంబం పెళ్ళికి ఒప్పుకుని పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్నయించుకునే సమయానికి తాను అదితిని ప్రేమిస్తున్నానని అర్ధం అవుతుంది వీరేన్ కు. తన ప్రేమికురాలికి ఆ సంగతి చెప్పి పెళ్ళి చెడగొట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు వీరేన్.





సమస్యలతో సతమతమౌతూ పారిపోవాలనే ఉద్దేశంతో అదితి దగ్గరకు వెళ్తాడు వీరేన్. తనకు పెంచి పెద్దచేసిన ఆంటీ, అంకుల్ ఋణం తీర్చుకోవాలనీ, వాళ్ళు చూసిన సంబంధాన్నే ఒప్పుకున్నాననీ, తనను మర్చిపొమ్మని చెప్తుంది అదితి. వీరేన్ ను అతని కుటుంబం ఆదుకుంటుందా? అదితి పెళ్ళి జరిగిపోతుందా? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అన్నది మిగిలిన కథ. మొదటి సినిమా అయినా అభయ్ డియోల్ కనబరిచిన నటన ఆకట్టుకుంటుంది. పాత్ర వ్యక్తిత్వంలోని అయోమయం , ఆ తర్వాత వచ్చిన పరిపక్వత బాగా చూపెట్టగలిగాడు అతను. నాకు బాగా నచ్చింది అతని పాత్ర. గ్లామర్ రోల్స్ కే పరిమితమనుకున్న ఆయేషా టాకియాను నటనకు ఆస్కారం ఉన్న పరిపక్వమైన పాత్రలో చూస్తాం మనం. ప్రతిభ ఉన్నా మళ్ళీ "డోర్" సినిమాలో తప్ప ఇటువంటి మంచి పాత్రలు మరేమీ రాకపోవటం అయేషా దురదృష్టం అనే చెప్పాలి.

ఈ సినిమాలో పాటలు హిట్ కాకపోయినా సందర్భోచితంగా బావుంటాయి. పాటల సాహిత్యం కూడా చాలా బావుటుంది. "కుచ్ న మిలే తో నా సహీ", "మేరా తుమ్హారా", "ఏ యారా రబ్" పాటలు నాకు ఇష్టం. నిశ్చితార్ధాలు అయ్యాకా ప్రేమ అనే అంశం మీద తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి కాబట్టి కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఆరేళ్ల క్రితం తీసిన సినిమాగా చూస్తే ఇది కొత్త కథే. డ్రామా తో పాటూ హాస్యం కూడా సమపాళ్ళలో ఉన్న ఈ సినిమా సినీ ప్రేమికులెవరికైనా నచ్చేస్తుందని నా అభిప్రాయం.



అభయ్ డియోల్ కు ఇది మొదటి చిత్రం కాబట్టి అతని బంధువైన(మేనమామనుకుంటా) ధర్మేంద్ర ఈ చిత్ర నిర్మాత అయ్యారు. ఇదే కథను తెలుగులో కూడా తీసినట్లున్నారు. పేరు గుర్తులేదు కానీ ఓ రోజు ఏదో ఛానల్ లో చూసాను. కానీ హిందీ సినిమా చూసాకా తెలుగుది నచ్చలేదు. పెద్దగా ఆడినట్లు కూడా లేదా తెలుగు సినిమా.

Today's breakfast







రెగులర్ టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తుంటాను నేను. ఇవాళ ఏం చేసానంటే:

*mixed veg. కార్న్ soup
*wheat flakes (నాకు)
*corn flakes with chocos(శ్రీవారికి)
*mixed sprouts salad

నాకున్న కొద్దిపాటి పాకజ్ఞానంతో ఒక కొత్త రకం salad రెండు రకాలుగా చేసాను. వివరాలు "ఇక్కడ". ఈ రెండు రకాలు సలాడ్స్ నిన్న రాత్రి, ఇవాళ పొద్దున్న తిన్నాకా మేం కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)

Monday, May 23, 2011

Alfalfa sprouts



మొన్న పొద్దున్న నాకు చాల ఇష్టమైన buffet breakfast కి వెళ్ళాం. అక్కడ మెనూ లో వేలంత పొడుగు మొక్కలు పెరిగిన ఐదారు రకాల sprouts పెట్టాడు. నేను పెసలు, మెంతులు, వేరుశనగ, శనగలు, గోధుమల sprouts చేస్తుంటాను. కానీ హోటల్లో వాడు ఒకట్రెండు కొత్త రకాలు పెట్టాడు. అవేమిటా అని నెట్లో వెతుకుతుంటే ఒక sprouts related లింక్ దొరికింది. అందులోపదిపన్నెండు రకాల sprouts, వాటిల్లోని మంచి గుణాల వివరాలు ఉన్నాయి. ఆ లింక్ ఇదిగో:
http://www.indiamart.com/sproutaminssuper/seed-sprouts.html



ఆ తరువాత నిన్న ఒక షాపింగ్ మాల్ లో అనుకోకుండా మొన్న పొద్దున్న buffet లో పెట్టిన ఒక రకం sprouts కనబడ్డాయి. వెంఠనే కొనేసా. వాటి పేరే "Alfalfa sprouts". నెట్లో వివరాలు వెతికితే అసలివేమిటి? వీటివల్ల ఉపయోగాలేమిటి? ఎలా మొక్క మొలిపించటం తదితర వివరాలు దొరికాయి. క్లుప్తంగా వీటి గురింఛి చెప్పాలంటే:

* శరీరంలో రోగనిరోఢక శక్తిని పెంచుతాయి ఇవి.
* ఎముకలను గట్టిపరిచే గుణాన్ని కలిగి, ఎముకలు త్వరగా పెరగటానికీ ఉపయోగపడతాయి.
* బ్రెస్ట్ ట్యూమర్స్ పెరగకుండా చెయ్యగల సక్తి వీటికి ఉంది.
* శరీరంపై వయసు ప్రభావాన్ని పడనివ్వవుట.. అంటే ముసలిరూపాన్ని త్వరగా దగ్గరకు రానివ్వవన్నమాట.
* బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తాయిట .

ఈ Alfalfa sprouts లోని మరిన్ని పోషక విలువలు, ఉపయోగాలు గురించి ఇక్కడ ఉన్నాయి:
http://webcache.googleusercontent.com/search?q=cache:At7H-IVEVWkJ:www.juicing-for-health.com/alfalfa-sprouts-nutrition.html+alfalfa+sprouts&cd=7&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


sprouting ఎలా చెయ్యాలో బొమ్మలతో సహా ఇక్కడ వివరంగా రాసాడు:
http://webcache.googleusercontent.com/search?q=cache:5bxIBnoRk8wJ:www.backyardnature.net/simple/alf-spr.htm+alfalfa+sprouts&cd=9&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


ఇక ఈ Alfalfa గింజలు ఎక్కడ దొరుకుతాయో ప్రయత్నాలు మొదలెట్టాలి !!

Friday, May 20, 2011

కాకరపాదే !!


బుజ్జి బుజ్జిగా తలలెత్తిన కాకరపాదు తాలుకూ "బుజ్జి మొక్కలు" ఫోటోలు పెడితే రావికొండలరావుగారి "ఆనప్పాదా? బీరపాదా" జోక్ లాగ ఇవి కాకరపాదు మొక్కలేమిటి? అని సందేహం వచ్చింది కదా మిత్రులకు...అందుకని ఇదిగో అసలు ఆకులు వచ్చాయి. ఇందాకా తీసాను ఫోటోలు. జాగ్రత్తగా గమనిస్తే కాకరపాదుకే ఉండే స్ప్రింగ్ లాంటి సన్నని తీగెలు కూడా కనిపిస్తాయి. ఆ స్ప్రింగ్ లాంటి తీగెలను దేనికి చుడితే దానిపైకి(కర్ర్ర, తాడు etc) పాదు పాకుతుంది.





హమ్మయ్యా ! నమ్మారా ! ఇక హాయిగా బుజ్జి బుజ్జి కాకరకాయల గురించి కలలు కంటా !
గింజ గట్టిపడని లేత కాకరకాయలు కాయ పడంగా వండుకుని తింటే... ఆహా...!!


Thursday, May 19, 2011

నిన్నే నెరనమ్మినానురా


తాళం: రూపకం

పల్లవి: నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా

అను పల్లవి:
అన్ని కల్లలనుచు ఆడిపాడి వేడి
పన్నగశయన నా చిన్నతనమునాడే
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా

వేదశాస్త్ర పురాణ విద్యలచే భేద
వాదములు తీరక భ్రమయు వారల జూచి
నిన్నే నెర నమ్మినానురా
ఓ రామా రామయ్యా

భోగములకొరకు భువిలో రాజసమ్మున..
యాగాదులొనరించి అలయువారల జూచి
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా

ఈ జన్మమున నిన్ను రాజీ చేసుకోలేక
రాజిల్లరని త్యాగరాజ రాజ రాఘవా
నిన్నే నెరనమ్మినానురా
ఓ రామా రామయ్యా

ఈ క్రింద లింక్ లో ఎస్.జానకి, శ్రీబాలమురళీ కృష్ణ, శ్రీ ఏసుదాస్ ముగ్గురూ వేరు వేరు రాగాల్లో పాడిన ఈ కీర్తనను వినవచ్చు:
http://www.musicindiaonline.com/genre/8-Classical/#/search/clips/global!q=ninne+nera+namminanura+o+rama/classical/carnatic/tyagaraja+kriti







Tuesday, May 17, 2011

"మబ్బులో ఏముంది..."


నిన్న రాత్రి ఏదో ఛానల్లో ఈ పాట కనిపించింది. వింటూంటే ఎంత హాయిగా అనిపించిందో...

"లక్షాధికారి" సినిమాలోని ఈ పాట భలే బావుంటుంది కదా. ఈ సినిమా కూడా చిన్నప్పుడు చూసిన గుర్తు. సస్పెన్స్ అది బానే ఉంటుంది. "ఇల్లరికం" "జమిందారు" మొదలైన సినిమాలకు సంగీతం చేసిన టి.చలపతి రావు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇంకా "దాచాలంటే దాగదులే" పాట కూడా బావుంటుంది ఈ సినిమాలో.
.
మరి మబ్బులో ఏముందో...ఓసారి మీరూ చూసేయండి.

చిత్రం: లక్షాధికారి
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
పాడినది: ఘంటసాల, సుశీల

http://www.youtube.com/watch?v=bkZofd_IFZg

ఇదేం సినిమానో తెలుసా?


"ఓ హలా ! ఎక్కడున్నావు...?"

"ఒసే ఏమే ఏమిటే, ఈ మెరపకాయలు తినండే !"

ఈ డైలాగులు ఏ సినిమా లోవో గుర్తున్నాయా?
ఇంకా క్లూ కావాలా?

ఓ రాజకుమారుడు ఉంటాడు.
ఆ రాజకుమారుడికి ఓ పెద్ద కల..నలుగురు దేవతా స్త్రీలతో ఎంజాయ్ చేస్తున్నట్లు..!
ఒక్కరు కాదు నలుగురా? అయినా ఇదేం కల నాయనా? అని రాజుగారు నోరు వెళ్లబెడతాడు. కోపగిస్తాడు. కల నెరవేర్చుకుని రమ్మని యువరాజుని రాజ్యంలోంచి పంపించివేస్తాడు.

కట్ చేస్తే:

యువరాజు తన కలని ఎలా సాకారం చేసుకుని ఆ నలుగురు దేవత స్త్రీలనూ సొంతం చేసుకున్నాడన్నది మిగిలిన కత !

చిన్నప్పుడూ హాల్లో ఈ సినిమా చూసినప్పుడు మరీ చిన్న వయస్సవటం వల్ల ఏ ప్రశ్నలు ఉత్పన్నమవలేదు. ఇప్పుడు సినీజ్ఞానం బాగా పెరిగిపోవటం వలన అనేకానేక ప్రశ్నలు...

* హీరోకి మరీ ఇంత విపరీతమైన "కల" ఏంటో? రాజుగారి ప్రశ్నే నాకునూ....మరీ నలుగురా?

* ఇద్దరు హీరోన్లుంటే ఇప్పటి సినిమాల్లో అసూయలూ, కారాలు,మిరియాలు గట్రాలు బోలెడు. ఈ నలుగురికీ సఖ్యత ఎలా ఉంటుందబ్బా?

* ఈ హీరోయినేంతబ్బా ఇంత లావుగా ఉంది? ఇప్పటి "బక్క హీరోయిన్ల"ను చూసి నా చూపు మరీ చిక్కిపొయినట్లుంది..!

* ..... డ్యూయెట్లు పాడుతూంటే కాస్త నవ్వు వచ్చినమాట నిజమేననాలేమో?

కానీ ఈ సినిమాలో ఓ పాట నాకు చాలా ఇష్టం. సూపర్ మ్యూజిక్, నలుగురు అమ్మాయిలు...బ్లాక్ వైట్ అయినా సూపర్ సాంగ్ !!

పాట చెప్పేస్తే సినిమా పేరు తెలిసిపోతుందే?!

Monday, May 16, 2011

శ్రీశైలం ప్రయాణం, ఫోటోలు


చిన్నప్పుడు అమ్మ పూజ చేస్తూ సంకల్పం చెప్పేప్పుడు "భరత వర్షే, భరత ఖండే.....దక్షిణా దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే..." అంటూ చెప్పేప్పటి నుండీ శ్రీశైలం అంటే ఓ గొప్ప ప్రదేశం అని భావన. అన్ని పూజలకూ, వ్రతాలకూ ముందర చెప్పుకునే సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు పేరు చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. బోలెడు పుణ్య క్షేత్రాలుండగా శ్రీశైలాన్నే ఎందుకు సంకల్పంలో చెప్పుకుంటామని నాకు సందేహం ఉండేది. భూమండలానికి శ్రీశైలక్షేత్రం నాభీప్రాంతం అని పురాణాలు చెబుతాయని అందువల్ల సంకల్పంలో ఆ విధంగా చెప్పుకుంటాం అనీ అక్కడ నేను కొన్న "శ్రీశైల చరిత్ర"(స్థలపురాణం)లో రాసాడు. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు ఆ స్థల పురాణం పై ఆయా ప్రదేశాల్లో ఏవైనా పుస్తకాలు దొరికితే కొనటం నాకు ఇష్టమైన ఆసక్తుల్లో ఒకటి.

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీశైల శిఖర దర్శనమే ఎంతో పుణ్యాన్ని మనదరికి చేరుస్తుందని అంటారు. ఇక శ్రీశైల మల్లికార్జునుని దర్శన భాగ్యం చేసుకుంటే మహా పుణ్యం లభిస్తుందట. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను వీలయినన్నింటిని దర్శించుకోవాలని నాకు చాలా కోరిక. రెండేళ్ళ నుండీ శ్రీశైలం వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయాణం వాయిదా పడుతూనే వచ్చింది. ఇంకా శివుడి ఆజ్ఞ రాలేదేమో అనుకుంటూఉన్నాం మేము. మొన్న శుక్రవారం అప్పటికప్పుడు అనుకుని శ్రీశైలం బయల్దేరాం. వర్షాకాలం, చలికాలం దాటిపోయాయి ఇక ఈ ఎండల్లో కుదిరిందేమిటో అనుకున్నా. ఎండల్లో పాపని ఇబ్బంది పెట్టకూడదని పాపను అమ్మదగ్గర దించి బయల్దేరాం. రిజర్వేషన్ లేకపోయినా ఏదో ఒక బస్సు దొరుకుతుందని నమ్మకం. పెళ్ళయిన కొత్తల్లో తిరుపతి అలానే వెళ్ళాం. నెల ముందు చేసిన రిజర్వేషన్ కన్ఫార్మ్ అవ్వలేదు. అయినా రైలెక్కేసాం బొంబాయి నుంచి. వెంకన్నబాబు దయతో అంత పెద్ద ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ ప్రయాణం.

అలానే ఈ ప్రయాణం కూడా ఆశ్చర్యంగా జరిగింది. బస్టాండ్ లో చూస్తే ఏ బస్సులోనూ సీటూ లేదు. శెలవులని జనం ఎక్కువ ఉన్నారుట. మాకోసమే అన్నట్లు(ఇలాగని మాతో ఉన్నవాళ్లందరూ అనుకున్నారు) స్పెషల్ బస్సొకటి అప్పటికప్పుడు వేస్తున్నారని తెలిసింది. మరో గంటలో బస్సులో ఉన్నాం. తిరుగు ప్రయాణానికి కూడా ఇలానే టికెట్టు దొరుకుతుందిలే అన్నారు శ్రీవారు. పొద్దున్నే నల్లమల అడవిదారిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. కదులుతున్న బస్సులోంచే బోలెడు ఫోటోలు తీసేసా. వాతావరణం కూడా చల్లగా ఉంది. దిగాకా పొద్దున్నే దర్శనానికి బయల్దేరాం. మూడు గంటలు పట్టచ్చు రద్దీ ఉంది అన్నారు బయట కనుక్కుంటే. దర్శనానికి వెళ్తుంటే శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు ఉన్న ఒక మంచి పటం దొరికితే కొన్నాం ఇంట్లో దేవుడిమందిరంలో పెట్టుకోవటానికని. ఎప్పుడో మొక్కుకున్నానని, అమ్మవారికి రాయించమని అమ్మ ఇచ్చిన పట్టుచీర, ఈ పటము తీసుకుని క్యూలో నించున్నాం. అరగంటలో దర్శనం అయ్యింది. మామూలుగా శివలింగాన్నిముట్టుకుని అభిషేకం చేస్కోనిస్తారుట ఇక్కడ. కాశీలోనూ అలానే చేసుకున్నాం మేము. కానీ జనం ఉన్నప్పుడు కాస్త దూరం నుంచే పంపేస్తారుట. లోపలికి వెళ్ళలేకపోయినా మేం కొన్న పటం దేవుడి దగ్గర పెట్టివ్వమని అడిగాము. శివలింగాన్ని తాకించి, అభిషేకం చేసిన నీరు చల్లి, పూజ చేసిన బిల్వ పత్రాలు కూడా వేసి పటం మా చేతికిచ్చారు పూజారిగారు. సంతోషదర్శనం అయ్యింది.

అక్కడ్నుంచి అమ్మవారి దర్శనానికి దారి. అక్కడ కూడా అరగంటే పట్టింది. అక్కడ కూడా ఈ పటాన్ని ఇచ్చాము. పూజారిగారు చక్కగా పూజా కుంకుమ ,పువ్వులు పటం పైన వేసి ఇచ్చారు. అమ్మ ఇచ్చిన పట్టుచీర ఇస్తే, మమ్మల్ని ఆగమని అమ్మవారి దగ్గర అది పెట్టి, హారతి ఇచ్చారు. శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి దర్శనమే ఆనందదాయకంగా ఉండగా ఈ కుంకుమ, హారతులు మాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చాయి. కాశీ విశాలాక్షి గుడిలో కూడా ఇలానే అనుకోకుండా నాకు కుంకుమ, గాజులు కూడా ఇచ్చారు పూజారిగారు. చిన్న విషయాలైనప్పటికీ ఇలాంటివి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అలా ఓ గంటలో దర్శనం అయిపోయింది. గుడి బయటకు వచ్చేప్పుడు దర్శనం క్యూ చాలా పెరిగిపోయి ఉండటాన్ని గమనించాం. పూజరి చెప్పినట్లుగా పట్టుచీరను ఆఫీసులో అందించాము. రసీదు ఇచ్చి ఏరోజు అమ్మవారికి కడతారో చెప్పారు వాళ్ళు.

గుడి లోపల అనుమతిలేదు కానీ బయట కాసిని ఫోటోలు తీసుకున్నా. చాలా చోట్ల రాళ్ళపై చెక్కిన ఏవేవో శాసనాలు ఉన్నాయి. వాటిపై ఉన్న భాష అర్ధం అయితే ఎన్ని చారిత్రక విషయాలు తెలుస్తాయో కదా అనిపించింది. గుడి చుట్టు తిరగటం వల్ల ఎండలో కాళ్ళు సుభ్భరంగా కాలిపోయాయి. అంతలా ఎప్పుడూ పాదాలు కాలలేదు నాకు. ఆ ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఒక చిన్న పిల్లాడికి గాంధీ వేషం వేసి, వెండి రంగు పూసి గుడి గేట్లో నిలబెట్టారు. చాలా దు:ఖం వచ్చింది వాడిని చూస్తే. ఓ ఐస్క్రీం కొని వాడిని ఓ చోట కూచోపెట్టి తినిపించాను. అంతకంటే ఏమీ చెయ్యలేక ! ఇక క్యూ మైన్టైనెన్స్ మాత్రం మాకు చాలా అసంతృప్తిని కలిగించింది. ఒకరి వెనుక ఒకరిని కాక, ఉన్న సన్నటి దారిలోనే జనాల్ని వదిలేస్తున్నారు. జనాలక్కూడా తొందరే. ఆ తోపులాటలు చికాకు తెప్పించాయి. సరైన పధ్ధతిలో క్యూ కట్టించవచ్చు కదా అధికారులు అనిపించింది. మరి తిరుపతి మాటేమిటీ అనకండి. అది మరీ ఘోరం. ఏదో ఒక పూజకి టికెట్టు కొంటే తప్ప మామూలుగా దర్శనానికి వెళ్ళలేం.

ఎందుకు పెట్టారో కానీ ఇక్కడ కులాలవారీగా సత్రాలు, ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి.(ఎక్కడా ఇన్ని రకాల కులసత్రాలు చూడలేదు నేను) ఏదేమైనా వారు అందించే సదుపాయాలకు గానూ ఆయా సత్రాల నిర్వాహకులను మెచ్చుకోవాల్సిందే. భోజనం చేసి చుట్టుపక్కల ప్రదేశాలు చూద్దామని ఆశగా బయల్దేరాం. అసలు నాకు అడవి ప్రదేశాలు చూడాలని చాలా ఆసక్తి. స్థల పురాణంలో కొన్ని ప్రాంతాల గురించి చదివి ఎప్పుడెప్పుడని చాలా ఉత్సాహపడుతూ ఓ జీప్ మాట్లాడుకుంటూంటే రాత్రి బస్సుకు టికేట్లు లేవన్నాడు ఒకాయన. "రాత్రేమిటి రేపు రాత్రికి కూడా లేవుట" అన్నారు ఇంకొకరు. ఇక బలవంతాన సైట్ సీయింగ్ ప్రోగ్రాం కాన్సిల్ చేసేస్కుని బస్టాండ్ చేరాం ఆదుర్దాగా. నాలుగింటి బస్సులో టికెట్లు ఉన్నాయి. ఎల్లుండి పొద్దున్న దాకా ఇక లేవు టికెట్లు అన్నారు కౌంటర్లో. రాకరాకవచ్చి అప్పుడే వెళ్పోవటమా అని నేను ఏడుపుమొహం వేసాను. "రెండేళ్ళ నుంచీ రావాలనుకుంటే రాగలిగామా? ఇప్పుడు దర్శనం బాగా అయ్యింది కదా? రెండురోజులు ఉండిపోవటం అవ్వదు. పనులున్నాయి. పాపను తీసుకుని చల్లబడ్డాకా మళ్ళీ ఉండేలా వద్దాం" అని శ్రీవారు సముదాయించారు. ఏమనుకున్నా తప్పేది లేదని రూం ఖాళీ చేసి ఇక బయల్దేరి పోయాం.

ఎండంతా మన పరమే అని భయపడుతుంటే అప్పటికప్పుడు మబ్బుపట్టి వాతావరణం చల్లగా మారిపోయింది. కాస్త చినుకు కూడా పడింది. వర్షాకాలంలో వెళ్తున్నట్లే అనిపించింది. చీకటి పడేదాకా మళ్ళీ బస్సులోంచి ఫోటోలు తీస్తూ, మధ్య మధ్య తెచ్చుకున్న పుస్తకం చదివేస్తూ తిరుగుప్రయాణం ఎంజాయ్ చేసేసా. శ్రీశైలం డామ్ ఏరియా, పాతాళగంగ(కృష్ణానదే) మాత్రం భలే ఉంది. ఆ ఫోటోలు బాగా వచ్చాయి. ఏమీ చూడడానికి వీలవ్వకపోయినా ఇలా బస్సులోంచి ఫోటోలయినా బాగా తీసుకోగలిగినందుకు సంతోషం కలిగింది. రెండు రోజులు ప్లాన్ చేసుకుని ఉండిరావాల్సిన ప్రయాణం ఇది.

ఊరు చేరుతూంటే "दानॆ दानॆ पॆ लिखा है खानॆवालॆ का नाम", "ఏది ఎప్పుడు ఎలా జారగాలో అలానే జరుగుతుంది", "ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది" మొదలైన కొటేషన్స్ అన్నీ గుర్తుకొచ్చాయి.

**** ***** ****

Srisailam trip photos'>ఫోటోల లింక్:




బుజ్జి మొక్కలు



ఒకేలా ఉన్నా కొంచెం తేడా ఉంది రెండు ఫోటోలకి...
ఇంతకీ ఈ మొక్కలేమిటో చాలామందికి తెలిసిపోతుంది.
పండిపోయిన కాకరకాయ గింజలు కాస్తంత ఎండబెట్టి మట్టిలో వేస్తే వచ్చిన బుజ్జి మొక్కలు.
కాబోయే కాకర పాదులు !



Sunday, May 15, 2011

'ఊరగాయ వైరాగ్యం' (ఈసారి ఫోటోతో)





(బ్లాగర్ ప్రాబ్లం వల్ల ఈ టపా మొన్న పెట్టిన కాసేపుకి డిలీట్ అయిపోయింది. ఆ కాసేపులో వచ్చిన నాలుగు వ్యాఖ్యలు కూడా డిలీట్ అయిపీఓయాయి. అందుకని ఈసారి ఫోటోతో పెడుతున్నాను...:))





పట్టుమని పది మావిడికాయలతో ఈసారి ఆరు రకాలు:

వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
మాగాయ
తురుము మాగాయ !!
(ఇది 12thన రాసినది..:))

పొద్దున్నుంచీ బయటకు వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చీ, వెళ్ళి వచ్చీ...
డాబాపై ముక్కలు పెట్టి..మళ్ళీ తీసుకువచ్చి..
కారం, ఉప్పు , ఆవ కొలుచుకుని
పెసరపొడి జల్లించి
మెంతులు, ఆవాలు వేయించి.. చల్లర్చి
ఇంగువ నూనె కాచి
ఒక్కొక్కటీ కలిపి...
అన్నీ మూతలు పెట్టి
గోడకి జారలబడి
ఎందుకో ఈ ఊరగాయలు పెట్టడం?
దండిగా తింటే పడేనా?
అసలివన్నీ అరోగ్యానికి ఏం మంచి చేస్తాయని?
పక్షానికో నేలకో ఓసారి నాలిక్కి రాసుకోటానికి
ఇన్ని తంటాలు అవసరమా?

కూర్చున్న చోట్నుంచి లేచాకా ఫోన్ దగ్గరకు పరుగు
అమ్మకి, అన్నయ్యకీ డప్పు కొట్టడానికి
'ఉరేయ్ నేనూరగాయలు పెట్టేసానోచ్' !!
'సాంపిల్ ఎప్పుడు తెస్తావు' అని వాడు..
'నన్నడిగితే పెట్టివ్వనా? ఎందుకన్ని తంటాలు పడటం?' అని అమ్మ...
అంటూంటే
'మరి నా సరదా తీరేదెలా?' అని నేను.
'అమ్మా, మెంతికాయ ఎలా చెయ్యాలో చెప్పవే
మళ్ళీ ఏడు చేస్తాను...'!

...దీన్ని 'ఊరగాయ వైరాగ్యం' అంటారు !!

__________________________________

జయగారు, మీరు శ్రమ తీసుకుని మళ్ళీ వ్యాఖ్య రాసినా ఇలా రెండవసారి టపా పెట్టటం వల్ల అది కూడా పోయింది...ఏమీ అనుకోవద్దండీ..! ఒకటో రెండో కాక, ఇన్నిరకాలు పెట్టడం ఇదే మొదటిసారి నాకూనూ. అన్నీరకాలు కూడా బాగా కుదిరాయి. టేస్ట్ చేసినవాళ్ళందరూ బాగుందనే అన్నారు !!


Monday, May 9, 2011

Tagore జయంతి ఉత్సవాల కబుర్లు

My love for Tagore is ardent. Reasons are many...may be because of his literary works i have studied in my literature books or because of his 'learnedness' or may be because of his bigger image my lecturers have shown or may be because of the one and only "Geetanjali"...and the reasons get multiplied..!! ఈ ప్రేమతోనే 'సంగీతప్రియ' బ్లాగ్ లో టాగూర్ స్వయంగా పాడిన ఆయన కవితలు, పాటలతో ఒక టపా పెట్టాను.
(http://samgeetapriyaa.blogspot.com/2010/06/tagore.html )


విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 150వ జయంతి ఉత్సవాలను(may 7th) పురస్కరించుకుని "సంస్కృతి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐదు బోగీల ఒక ప్రదర్శన రైలును ఊరూరా చాలా ఊళ్ళలో తిప్పారు. ఆ రైలులో ఆయన జీవిత విశేషాలు, ప్రముఖులతో ఫోటోలు, పైంటింగ్స్, రచనలు..బోలెడు ప్రదర్సనకు ఉంచారు. సికిందరాబాద్ లో ఆ రైలు ఉంచినప్పుడు వెళ్ళి బోలెడు ఫోటోలు తృప్తిగా తీసుకున్నాను. అప్పుడూ టపా రాసాను.(http://trishnaventa.blogspot.com/2010/09/tagores-rare-photos-from.html )


మొన్న ఆయన 150వ జయంతి ఉత్సవాలను ఢిల్లీ, కలకత్తా మొదలైన చోట్ల చాలా ఆర్భాటంగా జరిపారు. ఢిల్లీ లో ప్రధాని, సోనియా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో టాగూర్ రచనల ఆధారంగా విడుదలైన ఆరు సినిమాల డివీడిల పేక్ ను విడుదల చేసారు.

రవీంద్రుని రచనలపై వచ్చిన మిగిలిన సినిమాలు వాటి కబుర్లు, కొత్తగా విడుదలైన డివీడి లోని సినిమాల వివరాలు అన్నీ క్రింద ఉన్న లింక్ లో ఆసక్తిగలవారు చదువుకోవచ్చు.
http://www.nfdcindia.com/tagorestoriesonfilm/gclid=COza1si42qgCFQd66wodmRIgHA


ఈ శోధనలో మరో సంగతి తెలిసింది. టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగా ప్రముఖ బెంగాలి దర్శకుడు Rituparno ghosh తీసిన సినిమా 41వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో ప్రదర్శింపబడింది. అది చూసిన ప్రఖ్యాత హిందీచిత్ర దర్శకుడు Subhash ghai ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేయటానికి అనుమతి పొండారుట. పేరొందిన సుకవి "గుల్జార్"కు సినిమా యొక్క అనువాద బాధ్యతలను అప్పగించారుట. "కష్మకష్" పేరుతో విడుదలవబోతున్న ఆ సినిమాకు గుల్జార్ హిందీలో రాసిన పాటలను చూసి సుభాష్ ఘై మైమరచిపోయాడుట. అంతటి సమ్మోహనాశక్తి మరి గుల్జార్ గారి సిరాలో తప్పకుండా ఉంది. "రైన్ కోట్", "చోఖేర్ బాలి" సినిమాలు చూసాకా ఈ డైరెక్టర్ కి ఫాన్ అయిపోయాను నేను. ఎనిమిది ఫిల్మ్ ఫేర్లు, మరికొన్ని అంతర్జాతియ అవార్డులు తెచ్చుకున్న ఘనత Rituparno ghoshది. మరిక ఆ సినిమా కోసం ఎదురు చూడటమే ప్రస్తుతం నేను చెయ్యగలిగినది.


ఇంకో సంగతి ఏంటంటే టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగానే మన తెలుగులో టి.రామారావు గారు "చరణదాసి"(1956) సినిమా తీసారు. ఎన్.టి.ఆర్, ఏ.ఏన్.ఆర్, సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు మొదలైన హేమాహేమీలు నటించారీ సినిమాలో.అసలు కథకూ ఈ సినిమాకూ కొద్దిపాటి మార్పులున్నట్లున్నాయి. ఇంకో విశేషం ఏమంటే ఈ సినిమాకు మాటలు, రీరికార్డింగ్ విశ్వనాథ్ గారు చేసారు. ఓ ఆన్లైన్ లింక్ దొరికింది. చాలా కాలం క్రితం ఓసారి టీవీలో చూసాను. మళ్ళీ చూడాలి. మీరూ చూసేయండి. ఆ లింక్ ఇదిగో:

http://webcache.googleusercontent.com/search?q=cache:uHL3ls0O37AJ:www.bharatmovies.com/telugu/watch/Charana-Daasi-movie-online.htm+charana+daasi&cd=2&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in



Saturday, May 7, 2011

వి.ఐ.పి లు


సమాజంలో లాగే పనిమనుషుల్లో కూడా మార్పులు వచ్చేసాయి. నమ్మకం, విశ్వాసం అనేవి ఏ కోశానా కనబడట్లేదు ఇప్పటి వాళ్ళలో. నువ్వు కాకపోతే ఇంకోరు అన్న ధీమా వాళ్లది. వాళ్లపై ఆధారపడిన బ్రతుకులు మనవి. ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్ళలో పని మనిషి రాకపోతే ఉండే పాట్లు చెప్పనలవి కాదు. మాకేం పనుమనుషులున్నారనీ ? మేం చేసుకోవట్లేదా? అని వాదిస్తుంది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు. కానీ అలవాటైన ఒక చట్రం నుండి బయటపడటం సులభంకాదు. ఇద్దరమే ఉన్నప్పుడు నేనూ కొన్నేళ్ళు అన్ని పనులూ నేనే చేసుకున్నాను. కానీ పెద్ద కుటుంబంలో ఉన్నప్పుడు అన్నీ చెయటానికి పనిమనిషి సాయం తప్పనిసరి. మన అవసర౦ చూసుకుని వాళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. నైజం మారిపోయింది. కొన్నేళ్ళుగా నాకు తెలిసిన కొందరు పనివాళ్లను గురించి ...వాళ్ళలో వచ్చిన మార్పుల గురించీ...

ఏభై ఏళ్ళ పాటు ఒకటే ఇల్లు నమ్ముకున్న "సముద్రం" :
"సముద్రం" అమ్మా వాళ్ల ఇంట్లో ఏభై ఏళ్ళు పని చేసింది. పేరు భలేగా ఉంది కదా. ఆ ఇంట్లో ఉన్న పురిటి గదికి నర్సు కూడా సముద్రమే. పదిహేనో ఎన్నో పురుళ్ళయితే ఎనిమిది మంది సంతానం మిగిలారు. అందర్నీ సాకి పెద్దచెయటంలో అమ్మమ్మకు ఎంతో సాయంగా ఉండేదిట సముద్రం. తాతయ్యగారింట్లో ఎప్పుడూ బంధుసమూహం కళకళ్ళాడుతూ ఉండేది. అదికాక ఆయన లాయరవటం వల్ల వచ్చేపోయే క్లైంట్లు, కొందరు పొరుగూరు నుంచి వచ్చి భోజనం చేసేవాళ్ళతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేదిట. అందరి పనులూ తనే చూసుకునేదట ఎప్పుడూ నవ్వుతూ ఉండే సముద్రం. పొద్దుటే వచ్చేసి రాత్రికి ఇంటికి వెళ్ళేదట. తాతగారి పదహారు మంది మనవలనూ ఆమె ఆటలాడించింది. ఓపిక నశించి పని చేయలేకపోయేవరకూ వచ్చేదట. సముద్రం గురించి అమ్మ ఎప్పుడూ బోలెడు కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం సముద్రమంటే.

ముఫ్ఫై ఏళ్ళు ఒకే ఇంట్లో పని చేసిన లక్ష్మి:
లక్ష్మిది సణుగుడు స్వభావం. మొగుడు తాగుబోతు. దాదాపు రెండ్రోజులకోసారన్నా తాగొచ్చి చితకబాదుతూంటాడు పెళ్ళాన్ని. ఆర్నెల్లకో మతం మార్చేస్తు ఉంటాడు. ఇంటిల్లిపాది పేర్లనూ కూడా ఆ మతానికి అనుగుణంగా మార్చేస్తూ ఉంటాడు. ఇల్లు గడవటానికి పదిళ్ళలో పాచి పని మొదలెట్టింది లక్ష్మి. కానీ ఏ ఇంట్లోనూ మానకుండా పని చేయటం లక్ష్మికి అలవాటు. చేసే ఇల్లు తన ఇల్లనుకుని పని చేస్తుంది. కాకినాడలో మా మావయ్య ఇంట్లో పని చేసేది. ముఫ్ఫై ఏళ్ల పాటూ అలా చేసింది. ఇల్లు అమ్మేస్తూంటే తన ఇల్లు అమ్మేస్తున్నట్లే బాధపడింది. ఊరు విడిచి వెళ్పోతూంటే తనను మర్చిపోవద్దని కన్నీళ్ళు పెట్టుకుంది .

పదిహేనేళ్ళపాటు పని చేసిన "సరస్వతి" :
విజయవాడలో సూర్యారావుపేటలో మేం ఉన్నన్నాళ్ళు మా ఇంట్లో పని చేసింది. మా ఇంట్లో చేరే సరికే ఏభైఏళ్ళు ఉంటాయి. ఏ రోజూ మానేది కాదు. కుదరకపోతే కూతురుని పంపేది. నాకు పన్నేండేళ్ళు వచ్చేవరకూ తనే. పని అవసరం ఉన్నప్పుడు వాళ్ళింటిదాకా వెళ్ళి సరస్వతిని పిలుచుకు వచ్చేదాన్ని కూడా. ఇంటివాళ్ళు ఆ ఇల్లు అమ్మేసినప్పుడూ అక్కడ ఉంటున్న ఆరువాటాలవాళ్ళం ఇల్లు ఖాళీ చేసాం. వేరే ఏరియాకు వెళ్పోతున్నప్పుడు అంత దూరం నడిచి రాలేనమ్మా అంది పాపం. అప్పటికే చేయలేకపోతోందని అమ్మ కూడా వద్దంది.

పదేళ్ళూ చేసిన "ఐలమ్మ" :
ఐలమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. "ఐలమ్మ" ఓల్డ్ గా ఉండని నేను తనకి "ఐలూ" అని పేరు పెట్టాను. అలానే పిలిచేదాన్ని. మా ఇంట్లో చేరినప్పుడూ తన వయసు పదిహేనేళ్ళు. నేను కాలేజీలో చదివేదాన్ని. ఐలమ్మ తరువాత వాళ్లమ్మకు ఐదుగురు సంతానం. చివరి ఇద్దరినీ తప్ప మిగిలినందర్నీ పనిలో పెట్టేసింది డబ్బుల కోసం అని. ఐలూ ని చదివించమని నేను దెబ్బలాడితే ఖర్చు తప్ప ఏంముందమ్మా? పని చేస్తే మరో నాలుగొందలు వస్తాయి..అనేది. ఎన్నిసార్లు ఐలూని చదివిద్దామని చూసినా దానికి ఏబిసీడీలు వచ్చేవే కాదు. విసుగొచ్చి మానేసాను. ఏది ఇచ్చినా తమ్ముళ్ళ కోసం, చెల్లెలి కోసం ఇంటికి పట్టుకెళ్ళేది, తినేది కాదు. దానికి పెళ్ళి చేస్తే పదిళ్ళ పని పోతుందని వాళ్ళమ్మ చాలా కాలం పెళ్ళి చేయలేదు. ఊరు మారాకా కూడా ఎవరైనా వెళ్తూంటే బట్టలు పంపేదాన్ని. ఇంకా గుర్తున్నానా పాపగారికి అనేదట. ఈ మధ్యన నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళిన రోజున తన పెళ్ళి అని విని చాలా ఆనందించాను.

**** **** ****
ఇక ఇక్కడ్నుంచీ విశ్వాసంగా పని చేయటం అనే మాట మర్చిపొయిన పనివాళ్ళనే చూసాను. మా అత్తగారింట్లో అయితే రెండ్నేల్లకో పనిమనిషిని మారటం చూశాను. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మాకు కుదిరిన పనమ్మాయి ఆహార్యం హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ ఉండేది కాదు. జీన్స్ పేంట్, విరబోసుకున్న జుట్టు, రెగులర్గా కట్ చేసుకునే ఐబ్రోస్ తో అసలు పని చేస్తుందా అని అనుమానం వచ్చేది. కొన్నాళ్ళకు దాన్ని భరించలేక మాన్పించేసి నేనే చేసుకోవటం మొదలెట్టాను.

ఇక మళ్ళీ ఇటు వచ్చాకా కుదిరిన "దుర్గ" మాత్రం బాగా చేసేది. అంత నెమ్మదస్తురలిని ఈ కాలంలో నే చూడలేదు. వాళ్లమ్మాయి "మీనా" గురించి ఓసారి టపా రాసాను కూడా. డిగ్రీ అవగానే మీనాకు ఐదువేల ఉద్యోగం వచ్చింది పెళ్ళీ అయిపోయింది. ఆ ఇల్లు మారాకా మాత్రం మళ్ళీ తంటాలు మొదలు. ఇప్పుడు మాకు చేసే పనమ్మాయి కూడా విసిగిస్తుంది. పని వచ్చు కానీ బధ్ధకం. సరిగ్గా చేయకపోయినా ఏం అనకూడదు. ఎక్కువ పని చెప్పకూడదు. ఎంతసేపూ ఏం తీసుకుపోదాం అన్న దురాశే. ఇచ్చినది తీసుకుంటూ ఇంకా అది ఇస్తారా? ఇదిస్తారా అని అడిగితే ఇచ్చేది కూడా ఇవ్వాలనిపించదు. మానేస్తే చెప్పి మానేయదు. వస్తుందో రాదో తెలీక మహా ఇబ్బందిగా ఉంటుంది. రాకపోతే చెప్పి మాను అంటే వినదు. ఒక్కరోజు జ్వరం పనివాళ్ళకే ఎందుకు వస్తుందో నాకస్సలు అర్ధం కాదు.

ఇక అమ్మావాళ్ళకు చేసే "లక్ష్మమ్మ" ది ఒక పెద్ద కథ. లక్ష్మమ్మకు ఏభై ఐదు పైనే వయసు. తల్లికి తండ్రి తాలూకూ పింఛను వస్తుందని తల్లిని దగ్గర బెట్టుకుని సేవ చేస్తుంది. ముగ్గురు కూటుళ్ళకు పెళ్ళిళ్ళూ చేసింది. ముగ్గురివీ మూడు కథలు. తను అమ్మావాళ్ళింట్లో పనికి కుదిరినప్పుడు పెద్దమ్మాయి గొడవ చేసిందని దానికి అమ్మావాళ్ళఇల్లు అప్పజెప్పింది లక్ష్మమ్మ. దానికి ఎంత సేపూ డబ్బు ఆశే. నెల తిరిగేసరికీ జీతం డబ్బుల్లో పావు వంతైనా మిగలదు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే పని మానేస్తుంది. ఏవో గొడవలతో అది మానేసింది. ఇప్పుడు దాని చెల్లెల్లు వస్తోందిట పన్లోకి. దానికి చేతివాటుతనం ఉందట. జాగ్రత్తగా చూడకపోతే అంతే సంగతులు. పది రోజులొస్తే వారమ్ రోజులు మానేస్తుందిట. గట్టిగా దెబ్బలాడితే ఆ దిక్కూ ఉండదని నోరు మూసుకోవటం. ఓపిక తగ్గిపోయి చేసుకోలేని అమ్మ అవస్థలు చూడలేక మనసు చివుక్కు మంటుంది.

అడిగినంతా ఇస్తారులే. ఎవరి కోసం అన్న ధీమా ఇవాళ్టి పనివాళ్ళది. ఈ వీ.ఐ.పీ లను కాదని గడుపుకోలేని నిస్సహాయత మనది.

Thursday, May 5, 2011

మంత్రిగారి వియ్యంకుడు(1983)


బాపు సినిమాల్లో బాగా ప్రజాదరణ చెందిన చిత్రాల కోవకు చెందుతుంది "మంత్రిగారి వియ్యంకుడు(1983)". చిరంజీవి విజయ చిత్రపరంపరలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. "రుద్రవీణ", "చంటబ్బాయ్"ల తరువాత నాకు నచ్చే చిరంజీవి సినిమా ఇది. చెప్పదలుచుకున్న సందేశానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకులకు అందించటం బాపు సినిమాల్లోని ప్రత్యేకత. మానవ సంబంధాలనూ, స్నేహాలనూ డబ్బుతో వెలకట్టలేమన్నది ఈ చిత్రం ఇచ్చే సందేశం. పాత్రల వ్యక్తిత్వాలను కాస్తంత హాస్య రసంలో ముంచి దుష్టపాత్రలను కూడా మనం నవ్వుతూ చూసేలా చెయ్యగలిగారు బాపురమణలు.

ఇక చిత్రానికి ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని గురించి పొగడటానికి మాటలు చాలవు. కెరీర్లో హై పీక్ లో ఉన్నప్పుడు చేసిన పాటలవటం వల్ల వినటానికి ఎంత బావుంటాయో అన్ని పాటలూ. ప్రతి పాటా మళ్ళీ మళ్ళీ వినాలనేలాగ ఉంటుంది. "ఏమనినే మరి పాడేదనో" పాట నాకు అన్నింటికన్నా ఇష్టం. ప్రతి పాటకూ కథకు అనువైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. పాటల్లోని ఏ వాక్యమూ బాలేదని అనిపించదు.  ఈ సినిమా వెరైటీ టైటిల్స్ ఓసారి చూసేయండి. టైటిల్స్ లో తులసి, సుధాకర్ ల జంటను కుదిర్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి.



కథ చాలా మామూలుదే. స్వశక్తితో బాగా డబ్బు గడించిన కొబ్బరికాయల సుబ్బారాయుడనే(అల్లు రామలింగయ్య) వ్యక్తి ఎవరి సాయంతో పైకి వచ్చాడో మర్చిపోతాడు. తాను దాటి వచ్చిన పేదరికాన్నే అసహ్యించుకుంటాడు. తన డాక్టర్ కొడుకుని మంత్రిగారి అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేసి తాను "మంత్రిగారి వియ్యంకుడు" అయిపోవాలని ఆశ పడతాడు. ఆ ఆశలను వమ్ము చేస్తూ అతని కొడుకు శివ(శుభలేఖ సుధాకర్) నర్స్ సుశీల(తులసి)ని ప్రేమిస్తాడు. సుశీల తన పాత మిత్రుడు, గడ్డు కాలంలో సాయం చేసినవాడు అయిన రావులపాలెం రామభద్రయ్య(రావికొండలరావు) కుమార్తె అని తెలిసి కూడా సుశీల తల్లిదండ్రులను పిలిపించి అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సుశీల తల్లి అన్నపూర్ణమ్మ(నిర్మలమ్మ) సుబ్బారాయుడిని డబ్బు మదంతో విర్రవీగటం అనర్ధాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తుంది.కాలేజీలో రామభద్రయ్య కుమారుడు బాబ్జీని(చిరంజీవి) అవమానించాలని ప్రయత్నించి తానే అవమానపడుతుంది సుబ్బారాయుడి కుమార్తె అనురాధ(పూర్ణిమా జయరాం). మెల్లగా జగడాలు ప్రణయాలుగా మారతాయి. అన్నపూర్ణమ్మను ఎన్నికలలో నిలబెడతాడు బాబ్జీ. చివరికీ అంతా కలిసి కొబ్బరికాయల సుబ్బారాయుడికి ఎలా బుధ్ధి చెప్పారు? రెండు జంటల పెళ్ళిళ్ళు అవుతాయా అన్నది మిగిలిన కథ.


బిచ్చగాడికి నోట్లు ఇస్తున్నట్లు అల్లురామలింగయ్య ఫోటో తీయించుకునే సీన్లో పూర్ణిమా జయరాం వచ్చి "వాడ్ని జైల్లో వేయించేయ్..ఉరి తీయించెయ్.." అంటే ఎవరని కూడా అడక్కుండా పోలీస్ అల్లుడైన రాళ్లపల్లితో అవే మాటలు చెప్పే సీన్ భలే ఉంటుంది. కాలేజీలో "ఆ కాయను బేన్ చేసారు కదా" అంటూ చిరంజీవి హీరోయిన్ ను ఏడిపిస్తూ చెప్పే డైలాగులు, చిరంజీవిని డిస్మిస్ చేయించినప్పుడు పాడే పాట హాస్యంగా ఉంటాయి. "పది లక్షల రూపాయిల కోసమే గోయిందా సకల పాపాలు చేసావు గోయిందా" అంటూ చివర్లో నూతన్ ప్రసాద్ పాడటం, రాళ్లపల్లి డైలగులు, అల్లు రామలింగయ్య నటన హాస్యరసాన్ని ప్రవహింపజేస్తాయి. "డబ్బు జేసి", "క్రిందపడ్డా పై చేయి నీదేనంటావు?" మొదలైనవి పక్కా రమణ మార్కు డైలాగులు.

నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి ఇద్దరికీ కూడా మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. శ్రీలక్ష్మికి ఈ సినిమాలో పెద్దగా పాత్ర లేదు. కప్పల అప్పారావు పాత్రలో సత్యనారాయణది కూడా మితమైన పాత్రే. ఎక్కువగా మళయాళ, తమిళ చిత్రాలు, తెలుగులో బహుశా ఈ ఒకటే చిత్రం చేసిన కేరళకుట్టి పూర్ణిమా జయరాం ప్రఖ్యాత తమిళ దర్శక నిర్మాత, నటుడు, రచయిత భాగ్యరాజ్ ను వివాహం చేసుకున్నారు. వారి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ సినీప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  అప్పటికే ప్రఖ్యాత నటుడైపోయిన చిరంజీవి అభినయంలో స్టార్ మార్క్ స్టైలిష్ నటన ప్రతి ఫ్రేంలోనూ కనబడుతుంది. అయినా ఎక్కడా అతిగా కనబడదు. అది బాపూ దర్శకత్వ ప్రతిభ.


పాటలు:
అన్నిపాటలకూ సంగీతం  ఇళయరాజా. సాహిత్యం వేటూరి. కొన్ని వీడియో లింక్స్ దొరికాయి చూసేయండి.

1) "మనసా శిరసా నీ నామము పాడేద ఈ వేళా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
పాట లో గిటార్ వాడిన తీరు అద్భుతం.




2) "మనకు దోస్తి ఒకటే ఆస్తిరా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట బాలు హిట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చరణాలను పాడిన తీరు చాలా బావుంటుంది.




3) "ఛీ ఛీఫో పాపా "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


4)"కొలువైనాడే ఊరికి కొరివైనాడే "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


5) ఏమనినే పాడేదనో.."
జానకి,బాలు ఇద్దరూ ఈ పాటకు నూరుపాళ్ళు న్యాయం చేసారనిపిస్తుంది. అంత బావుంటుంది ఈ పాట.





6) "అమ్మ కదే బిజ్జి కదే నాపై కోపమా"
పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.హీరోని మచ్చిక చేసుకునే నేపథ్యంలో వచ్చే ఈ పాటలో పూర్ణిమా జయరామ్ వేసుకున్న వైట్ కలర్ స్కర్ట్ చాలా బావుంది. పాటకు వంద డ్రస్సులు మార్చే సినిమాటిక్ పాటలా కాక ఒకే డ్రెస్ తో పాటంతా తీయటం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది.

7) "సల సల నను కవ్వించనేల" పాట పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్ ల ప్రోత్సాహంతో రెండు జంటలు పాడుకునే ఈ పాట కూడా సరదా అయినదే.

నా మాట: తీరికవేళల్లో తాపీగా కూర్చుని హాయిగా నవ్వుకోవటానికి వీలున్న మంచి సినిమా.

Wednesday, May 4, 2011

మామ్మయ్య - ఊరగాయలు !


 
మా మామ్మయ్య(నాన్నమ్మ) పెట్టే ఊరగాయల గురించి చెప్పేముందు ఆవిడ పాకప్రావీణ్యం గురించి కొంచెం చెప్పాలి. ఆవిడ చేతిలో అద్భుతం ఉండేది. ఏది వండినా రుచి అమోఘమే. ఆవిడ అత్తారింట్లో ప్రతిరోజూ పాతిక మందికి తక్కువకాకుండా వండేదిట. అది కూడా మడి వంట. ఇక పండగలు తద్దినాలు వస్తే వంటింట్లోనే మకాం. ఆవిడ కొబ్బరి పచ్చడి రుబ్బుతూంటే రోట్లో ఉండగానే సగం పచ్చడి అయిపోయేదిట.(అలా తినేసేవారట అటుగా వచ్చినవాళ్ళు). పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట.

ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి. రోజంతా మిల్లాడిస్తూ ఉండండి అని మా మావయ్య జోక్ చేసేవాడు. ఇదంతా మామ్మయ్య పాకప్రావీణ్యం గురించి చెప్పటానికే. ఇక వేసవిలో ఊరగాయల సంగతికొస్తే ఆ రకం పెట్టినా అన్నీ సమపాళ్ళలో కుదిరేవి. ఆవీడ పెట్టినన్ని ఊరగాయల రకాలన్నీ తినగలగటం మా పిల్లల అదృష్టం.


కాకినాడలో మా ఇంట్లోని వంటింట్లో ఓ మెష్ డోర్ ఉన్న గూడు ఉండేది. దాన్నిండా చిన్నవి, పెద్దవి రకరకల సైజుల్లో జాడీలు ఓ ముఫ్ఫై పైనే ఉండేవి. ఆ జాడీల ఆకారాలు కూడా రకరకాలుగా ముద్దుగా ఉండేవి. గుర్తు కోసం నేనో రెండు జాడిలు తెచ్చుకున్నాను కూడా. మాకు నెల నెలా సామర్లకోట నుండి పప్పు నూనె తెచ్చే ఆదినారాయణ ఊరగాయలు పెట్టే సమయానికి సైకిలు మీద ఫ్రెష్ పప్పు నూనెతో వచ్చేసేవాడు. మా పిన్నివాళ్ల అత్తగారు అయితే ఊరగాయలకు మావిడికాయలు చెట్టు నుండి దగ్గరుండి మరి కోయించుకునేవారు మొన్నమొన్నటిదాకా. పప్పునూనె కూడా గానుగలో దగ్గరుండి ఆడించుకునేవారు.


ఇక నాన్న ఆవకాయలకు ముక్కలు కొట్టేవారు. ఇంట్లోని మహిళలేమో మాగయకు తరిగగేసేవారు. అటు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా రానిచ్చేవారు కాదు. మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది. దాంతో మావిడికాయను చెక్కితే మాగాయకు ముక్కలు వచ్చేవి.(ఇప్పటి పీలర్ లాగన్నమాట). పెరట్లోనేమో పనమ్మాయి లక్ష్మి తాలూకూ కొందరు ఆడవాళ్ళు వచ్చి కారం కొట్టేవారు. ఆ రోకళ్ళ చప్పుడు భలేగా ఉండేది. అటువైపు అసలు వెళ్లనిచ్చేవారు కాదు ఘాటుకి తుమ్ములు వస్తాయని. వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే వొలుచుకునేవారు.



ఇక మా మామ్మయ్య పెట్టే ఆవకాయ రకాలు ఏమిటంటే:

1) వెల్లుల్లి ఆవకాయ
2)ఉత్తి ఆవకాయ (వెల్లుల్లి తిననివాళ్ళ కోసం)
3)పులిహార ఆవకాయ (కావాల్సినప్పుడల్లా కాస్తంత తీసుకుని పులిహోర పోపు పెట్టుకుంటారు)
4)అల్లం ఆవకాయ (దీంట్లో అవపిండి ఉండదు)
4)పచ్చావకాయ (పచ్చ మెరపకాయలతో పెడతారు)
5)పెసర ఆవకాయ (దీంట్లో అవపిండి బదులు పెసరపిండి వాడతారు)
6)బెల్లం ఆవకాయ
7)సన్న ఆవాల ఆవకాయ (ప్రత్యేకం సన్న ఆవపిండితో పెడతారు.ఘాటు ఎక్కువగా ఉంటుంది)
8)శనగల ఆవకాయ (ఎండిన శనగలు వెస్తారు. కొన్నాళ్ళకు అవి ఊరి తినటానికి బావుంటాయి)
9)నువ్వుపిండి ఆవకాయ(దీంట్లోనూ అవపిండి బదులు నువ్వుపిండి వాడతారు)
10)మావిడి పిందెలతో అవకాయ (కేరళావాళ్ళు ఎక్కువ చేస్తారు దీన్ని)

మాగాయ రకాలు:
1)నూనె మాగాయ
2) తొక్కు మాగాయ
3) ఎండు మాగాయ
4)తురుము మాగాయ/ కోరు మాగాయ
5)ఉల్లిమాగాయ(వెల్లుల్లి తో)

ఇవి కాక మెంతిపిండి ఎక్కువ వేసి చేసే
* మెంతికాయ
* చెంప మెంతికాయ ఆవిడ స్పెషల్స్.


ప్రతి ఏడాదీ ఈ రకాలన్నీ చెయ్యకపోయినా ఒకో ఏడూ వీటిలో సగం పైనే కవర్ చేసేది మామ్మయ్య. నెమ్మది నెమ్మదిగా ఓపిక తరిగేకొద్దీ రకాలూ తగ్గి రెండు,మూడు రకాలు మాత్రమే పెట్టే స్టేజ్ కి వచ్చేసింది చివరిరోజుల్లో.


మా ఇంట్లో ఆవకాయ తినటం తక్కువవటం వల్ల అమ్మ ఎప్పుడు ఇన్ని రకాలు ప్రయత్నించలేదు. ఇప్పుడిక డాక్టర్లు ఊరగాయలు తినద్దంటున్నారని అసలు పెద్ద ఎత్తున ప్రయత్నాలే లేవు. ఏదో శాస్త్రానికి నాలుగైదు రకాలు పెడుతోంది మా పిల్లల కోసం. మేము కూడా డైట్ కంట్రోల్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అంటూ చాలావరకూ ఊరగాయలకు దూరంగా ఉండిపోతున్నాం. తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను.

Tuesday, May 3, 2011

"Herbvia" ( Herbal Stevia Sweetner)


వచ్చేసింది వచ్చేసింది "Herbvia". i.e Herbal Stevia Sweetner. "Stevia"(http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_05.html) గురించి అదివరకూ రాసాను.


ఆ మధ్యన ఒక హెర్బల్ ఎగ్జిబిషన్ లో స్టివియా పౌడర్ వచ్చింది అని చూశాను. కానీ ఎక్కడ దొరుకుతుందో వివరాలు అడగటం మర్చిపోయాను. నిన్న బజార్లో ఓ సూపర్ మార్కెట్లో స్టీవియా పౌడర్ కొందామని వెళ్ళేసరికీ ఈ Herbvia చూశాను. చుట్టూ మనుషుల్లేకపోతే హుర్రే అని అరిచే మాటే. నేను మూడేళ్ల నుంచీ పంచదార బదులు స్టీవియా పౌడర్ కొని వాడుతున్నాను. కానీ అది సమపాళ్ళలో మరిగించుకుని, పది గంటల తరువాత వడబోసి దాచి వాడటం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. కానీ నేచురల్ స్వీట్నర్ అని మిగిలిన artificial sweetners కన్నా నేను దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.


ఇప్పుడు ఇక మరిగించుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ Herbvia పిల్స్ వాడేయచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లకైతే స్టీవియా చాలా మంచిది. చాలామంది ఆర్టిషియల్ స్వీట్నర్స్ వాడలేక పంచదార లేకుండా ఏదీ తినలేక తాగలేక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారికి ఇది వరమనే చెప్పాలి. పైగా ఎక్కువకాలం artificial sweetners వాడటం వల్ల ఎన్నో ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సుగర్ ఫ్రీ స్వీట్స్ అని బజార్లో అమ్మేస్తూ ఉంటారు. వాటిల్లో వాడే artificial sweetners డయాబెటిస్ వాళ్లకు ఎంతో హాని చేస్తాయి.

* ఇవి మెదడు మీద ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తాయి.

* గర్భవతులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* ఇవి బ్లడ్ సుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయ్యలేవు.

ఇవి కేవలం artificial sweetners యొక్క కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు మాత్రమే. స్టీవియాలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స ఏవీ ఉండవు. ఈ స్టీవియాతో తయారు చేసిన Herbvia లో కూడా స్టీవియా పౌడర్ కున్న సుగుణాలే ఉన్నాయా లేవా అన్నది ఇంకా నేను ధృవీకరించుకోవాల్సి ఉంది. కానీ జనాలు ఎక్కువగా వాడే ఏస్పర్టేమ్, సర్కోస్ లాంటి artificial sweetners కన్నా డెఫినేట్ గా Herbvia నయం అని చెప్పవచ్చు.

Monday, May 2, 2011

పాటల్లో చెత్త ఉపమానాలు


నిన్న పొద్దుటి ఊసు. ఆదివారం కదా వాకింగ్ కి బధ్ధకంగా బయల్దేరా. అంటే లేటుగా అన్నమాట. అన్ని Fms లోనూ భక్తిగీతాలు అయిపోయి సినిమా పాటలు మొదలైపోయాయి. ఇదీ బానే ఉందనుకుంటూ వింటూ నడుస్తున్నా. రోబోలోని ఓ హిట్ సాంగ్ మొదలైంది. ఈ పాట ఎలా హిట్టయ్యిందో జనాలే చెప్పాలి. చరణంలో ఏ వాక్యానికీ పొంతనలేదు. ఈ డబ్బింగ్ పాటలు పాడేవాళ్ళు చాలామటుకు తెలుగువాళ్ళు ఉండరు (తెలుగువారు కాకపోయినా తెలుగు వచ్చినవాళ్ళూ ఉంటారు). మరి తెలిసో తెలీకో ఇచ్చిన సాహిత్యాన్ని శ్రధ్ధగా పాడేస్తారు పాపం... వినే మన ఖర్మకి మనల్ని వదిలేసి.

ఇంతకీ ఇందాకటి రోబో పాటలో చిన్మయి అనుకుంటా "తేటగ ఉన్న దూటనయ్యో నన్ను నోటబెట్టెయ్ మొత్తం" అని పాడింది. ఓరి భగవంతుడా ఇదేం ఉపమానం తండ్రీ అనుకున్నా. పచ్చి దూట ఎవరన్నా కరకర నమిలి తినగలరా అసలు? తమిళంలో ఈ పాటలో ఈ వాక్యం ఇలానే ఉందో మరి ఏమన్నా మార్పులున్నాయో...లేక ఇది అనువాదకుల ప్రతిభో మరి తెలీదు. ఇలాంటి భయానక ఉపమానాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసిన పాటల్లోనే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి.

వెంఠనే నాకు "బాయ్స్" సినిమాలో పాటలోని ఓ వాక్యం గుర్తుకొచ్చింది. సాధనా సర్గమ్ పాడుతుంది "కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం.." అంటూ. నిఘంగా ఆవిడకు ఆ వాక్యం అర్ధం తెలిస్తే ఆ పాట పాడేదా? అని డౌటొచ్చేది నాకు ఆ పాట ఎక్కడైన విన్నప్పుడల్లా.
ఎంత గాఢప్రేమికులైతే మాత్రం కుళ్ళిపోయిన పండులో పురుగులతో పొలికా? వాక్యాలకు పొంతన లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త కంపారిజన్ లు ఎందుకు వాడతరో...తెలీదు.

'దేషం', 'ఆష', 'ఆకాషాలు' అని పాడుతూంటే చచ్చినట్లు వింటున్నాం. అవికాక ఇలాంటి
ఘోరమైన వాక్యాలు డబ్బింగ్ పాటల్లో కోకొల్లలుగా వస్తున్నా ఆదరించేస్తున్నాం. అయినా చేసేవారు చేస్తున్నారు, రాసేవాళ్ళు రాస్తున్నారు, వినే మనం వినేస్తున్నాం.


మీకూ గుర్తున్న ఇలాంటి చెత్త కొంపారిజన్లు ఏమన్నా ఉంటే తెలపండి...