సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 14, 2010

ఏమిటో ఈ ఆట..?!


తీరిక దొరికితే పుస్తకాలు చదవటం,ఎదన్నా రాసుకోవటం లేక నెట్ లో కొత్త కొత్త విషయాలేమైనా తెలుసుకోవటం నాకు అలవాటు. బాగా ఖాళీగా ఉంటే తప్ప టి.వీ.జోలికి పోను. ఒకప్పుడు బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం తీరిక సమయాల్లో టి.వీ.చూడటం టైంవేస్ట్ చేసుకోవటమే అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టివీ చూసినా తెలుగు చానల్స్ చూసే ధైర్యం చేయను.అవంటే నాకు భయం. కానీ ఈమధ్యన చానల్స్ తిప్పుతుంటే అనుకోకుండా ఏవో కొన్ని తెలుగు డాన్స్ ప్రొగ్రాంస్ చూడటం జరిగింది. 3,4 సార్లు ఇలా ఈ మధ్యన చూసాను.అవి కూడా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు.

2008 జూన్ లో అనుకుంటా నేను నవ్య లో పడిన "నా కోసం నేను కాదు" అనే ఆర్టికల్ లింక్ ఇచ్చాను బ్లాగ్లో.. అందులో పోటీ ప్రపంచంలో తమ పాప ముందు ఉండాలని తల్లిదండ్రుల ఫోర్స్ చేయటం వల్ల తాను చిన్నతనానికి ఎలా దూరంఅవుతోందో... ఒక పాప తన మనసులోని వ్యధ చెప్పుకుంటుంది.

టి.వీ.లో ఆ డాన్స్ లు చూస్తే నాకు ఆ ఆర్టికల్ గుర్తు వచ్చింది. ఇంకా అసలు వీళ్ళు పిల్లలేనా అని డౌట్ వచ్చింది. వాళ్ళు చేస్తున్నది మామూలు పాటలకు కాదు వాంప్ పాటలకు,క్లబ్ పాటలకూ. అసలు ఆ తల్లిదండ్రులు అలాంటి పాటలకు డాన్స్ చేయటానికి చిన్న చిన్న పిల్లలను ఎలా ప్రోత్సాహించగలుగుతున్నారు అని సందేహం కలుగుతోంది నాకు. చిన్న పిల్లలు ఆ పెదవి విరిపులూ,మొహంలో అసహ్యకరమైన భావాలు ఒలికిస్తూ గంతులు వేస్తూంటే చూడటానికి నాకు విరక్తి కలిగింది. వీళ్ళా దేశ భవిష్యత్తు? వీళ్ళా మన భావి తరం? ఇదా మనం పిల్లలకు నేర్పించవలసింది? అని బాధ వేసింది.


గత నవంబర్ 14న నాకిష్టమైన ఒక " పిల్లల పాట" సాహిత్యం,ఆ పాట ఒక టపాలో రాసాను.
"పిల్లల్లారా పాపల్లారా...
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లలారా..."
అని దాశరధి గారు రాసిన ఎంతో అందమైన సాహిత్యం అది.పిల్లలు అలా ఉండాలని, అలా పెరగాలని నేను అభిలషిస్తూ ఉంటాను...కానీ ఏమిటో సినిమా పాటలే భక్తి గీతాలూ, సినిమా డైలాగులే వేదవాక్కులూ అవుతున్నాయి ఇవాళ పిల్లలకు. మా బాబు ఫలానా హీరోలా
డైలాగు భలే చెప్తాడు తెలుసా అని మురిసిపోయే వాళ్ళనూ, మా పాప "ఆ అంటే అమలాపురం.." "రింగా రింగా .." పాటకూ ఎంతబాగా dance చేస్తుందో అని చెప్పుకునే వాళ్ళనూ, "అమ్మా లేదు,నాన్నా లేడు..." అంటూ పాడుతూ తిరిగే పిల్లలనూ ఇవాళ చూస్తున్నాం.

ఏమిటి ఈ ఆట? ఈ తరం ఎటు పోతుంది..? అనే ప్రశ్నలు మనసును వేధిస్తున్నాయి. అందరూ అలా ఉంటున్నారని నేను అనటం లేదు. కానీ చాలా వారకు పిల్లలు అలానే ఉంటున్నారు. ముఖ్యంగా టి.వీలో జరుగుతున్న పొటీ డాన్సులలో వాళ్ళు ఎన్నుకునే పాటలు మరీ కలవర పెడుతున్నాయి. అవి ఈ మధ్యన చూసి చూసీ ఆవేదనతో ఈ టపా రాయాలని మొదలుపెట్టాను..

నేను ఈ టపా రాయటం అనేది మార్పులు తెచ్చేయాలనో, ఎవరినో ఎత్తిపొడవాలనో కాదు. నేను రాయటం వల్ల ఏమీ జరగదని కూడా తెలుసు. ఇది కేవలం నా వ్యధనూ,భావితరం పట్ల నాకున్న ఆశనూ తెలపటానికే...! కనీసం నా పాపనైనా ఈ గందరగోళాలకు దూరంగా ఉంచుకోగలుగుతున్నాను...ప్రస్తుతానికి.అదే కాస్త తృప్తి.

Tuesday, April 13, 2010

"Businessworld" Magazine cover story


19th Apr.2010 dated "BusinessWorld" magazine లో KG BASIN మీద రాసిన cover story నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఈ విషయం మీద ఆసక్తి ఉన్నవారెవరైనా చదువుతారని
ఈ-లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను.

http://www.businessworld.in/bw/Magazine

ఈ మధ్యన కొంచెం రెస్టింగ్ స్టేజ్ లో ఉండబట్టి పుస్తకాలూ,పేపర్లూ ఎక్కువ చదివే సమయం దొరుకుతోంది.ఆసక్తి ఉండీ చూడనివారు ఉంటే చదువుకొగలరని ఇలా ఈ-లింకులూ గట్రా బ్లాగ్లో పెడుతున్నాను. ..:)

Friday, April 9, 2010

రమేష్ నాయుడు


కీర్తి ప్రతిష్ఠల వెనుక ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయో అనిపిస్తుంది ఆయన జీవితచరిత్రను వింటే. 54ఏళ్ళ జీవితంలో ఆయన గడించిన కీర్తి అజరామరం. అధిరోహించిన సంగీతసోపానాలు అనేకం. ఆయన మరెవరో కాదు పంతొమ్మిదొందల ఢభ్భైల్లో,ఎనభైల్లో అద్భుతమైన సుమధురమైన సంగీతాన్ని తెలుగువారికి అందించిన స్వరకర్త రమేష్ నాయుడు.తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకుల్లో ఒకరు.

1933లో కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లిలో జన్మించారు పసుపులేటి రమేష్ నాయుడు.టీనేజ్లోనే ఇంటి నుండి పారిపోయి బొంబాయి చేరారు. అక్కడ ఒక సంగీతవాయిద్యాల షాపులో పనికి కుదిరారు.అక్కడే సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆ షాపులో పని చేయటం వల్ల హిందీ,మరాఠీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆయనకు. 14ఏళ్ల వయసులో ఆయన 'Bandval pahija' అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ లను హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈయనదే.

అరవైలలో "దాంపత్యం","మనోరమ" మొదలైన తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చాకా తిరిగి బొంబాయి వెళ్ళారు.ఆ తరువాత కలకత్తా కూడా వెళ్ళి కొన్ని బెంగాలీ సినిమాలకు సంగీతాన్ని అందించారు.అక్కడే ఒక బెంగాలి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దాదాపు ఒక పది సంవత్సరాల వరకూ బెంగాలీ,నేపాలీ,ఒరియా చిత్రాలకు సుస్వరాలనందించారు. మళ్ళీ 1972లో శోభన్ బాబుగారి "ఆమ్మ మాట" ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి ద్వితీయ ప్రవేశం చేసారు.రమేష్ నాయుడు లోని ప్రతిభను ఎక్కువగా ఉపయోగించుకుని కొన్ని అపురూప గీతాలను మనకు అందేలా చేసిన దర్శకులు జంధ్యాల,దాసరి నారాయణరావు మరియు విజయ నిర్మల గార్లు.

"మేఘ సందేశం" సంగీతం ఆయనకు 1983లో బెస్ట్ మ్యుజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ ను తెచ్చిపెట్టింది. చిత్రంలోని అన్ని పాటలూ బహుళ ప్రజాదరణ పొందినవే. శివరంజని,ఆనంద భైరవి,శ్రివారికి ప్రేమలెఖ,ముద్ద మందారం,స్వయం కృషి మొదలైన సినిమాలు ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి.రమేష్ నాయుడు గారు మంచి స్వరకర్తే కాక మంచి గాయకులు కుడా. "చిల్లర కొట్టు చిట్టెమ్మ" చిత్రంలో ఆయన పాడిన "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..." పాటకు స్టేట్ గవర్నమెంట్ ఆ ఏడు బెస్ట్ సింగర్ అవార్డ్ ను అందించింది.ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది.

మెలోడీ రమేష్ నాయుడు పాటల్లోని ప్రత్యేకత. ఎక్కువగా వీణ,సితార్ వంటి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కే ప్రాధాన్యత కనిపిస్తుంది. అలానే వయోలిన్స్,ఫ్లూట్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తాయి."శివరంజని" లోని 'జోరు మీదున్నావె తుమ్మెదా' పాటలో వయోలిన్ వాయించిన నాగయజ్ఞశర్మగారు(ఈయన మణిశర్మ తండ్రిగారు)రమేష్ నాయుడు ఆర్కెస్ట్రాలో పర్మనెంట్ మ్యుజిక్ కండక్టర్ గా ఉండేవారట.

ఇక పాట సాహిత్యాన్ని చూసాకే ట్యూన్ కట్టేవారట. సిట్టింగ్ లో కూర్చున్న పదిహేను నిమిషాల్లో పాట తయారయిపోయేదంటే ఆయన ఏకాగ్రత ఎటువంటిదో అర్ధమౌతుంది. సినీపరిశ్రమలో కూడా సత్సంబంధాలు కలిగిన మంచి మనిషి ఆయన.వేటురిగారు తన "కొమ్మ కొమ్మకో సన్నాయి" పుస్తకంలో తాను పనిచేసిన సంగీత దర్శకులు, చిత్ర దర్శకుల గురించీ రాస్తూ అందరి గురించీ ఒకో అధ్యాయంలో రాస్తే, ఒక్క రమేష్ నాయుడు గారితో తన అనుబంధాన్ని గురించి రెండు అధ్యాయాల్లో రాసారు.ఆయన చివరి చిత్రం విశ్వనాథ్ గారి "స్వయంకృషి". ఆ చిత్రం రిలీజ్ కు ముందు రోజున, 1987 సెప్టెంబర్ 8న ఆయన తుది శ్వాస విడిచారు.

రమేష్ నాయుడు స్వరపరిచిన కొన్ని మధుర గీతాల జాబితా:
చందమామ రావే - (మనోరమ)
మరచిపోరాదోయీ - (మనొరమ)
అందాల సీమాసుధానిలయం - (మనోరమ)
(ఈ పాటను ప్రఖ్యాత హిందీ గాయకుడు తలత్ మెహ్ముద్ పాడారు)
శ్రీరామ నామాలు శతకోటి - (మీనా )
మల్లె తీగె వంటిది - (మీనా )
దీపానికి కిరణం ఆభరణం -( చదువు-సంస్కారం)
స్వరములు ఏడైనా (తూర్పు-పడమర)
తల్లి గోదారికే (చిల్లర కొట్టు చిట్టెమ్మ)
జోరుమీదున్నావె తుమ్మెదా(శివరంజని)
నవమినాటి వెన్నెల నేను(శివరంజని)
గోరువెచ్చని సూరీడమ్మా(జయసుధ)
ఊగిసలాడకే మనసా ( కొత్త నీరు)
రేవులోని చిరుగాలి (పసుపు-పారాణి)

నీలాలు కారేనా కాలాలు మారేనా(ముద్ద మందారం)
(ఒరియా లో వాణీ జయరాం చేత తాను పాడించిన ఈ స్వరాన్నే తెలుగులో మళ్ళి వాడుకున్నారు రమేష్ నాయుడు.)
జో..లాలి..జోలాలి..(ముద్ద మందారం)
అలివేణీ ఆణిముత్యమా( ముద్ద మందారం)
అలక పానుపు ఎక్కనేల(శ్రీవారి శోభనం)
తొలిసారి మిమ్మల్ని(శ్రీవారికి ప్రేమలేఖ)
లిపి లేని కంటి బాస(శ్రీవారికి ప్రేమలేఖ)
మనసా తుళ్ళి పడకే(శ్రివారికి ప్రేమలేఖ)

చంద్రకాంతిలో చందన శిల్పం(శ్రీవారి శోభనం)

మెరుపులా మెరిసావు (ప్రేమ సంకెళ్ళు)
కొబ్బరినీళ్ళా జలకాలాడీ (రెండు జెళ్ళ సీత)
పిలిచిన మురళికి (ఆనంద భైరవి)
కనుబొమ్మల పల్లకిలో (నెలవంక)
కదిలే కోరికవో (మల్లె పందిరి)
కోయిల పిలుపే కోనకు మెరుపు( అందాల రాశి)
సిన్ని సిన్ని కోరికలడగా (స్వయంకృషి)
సిగ్గు పూబంతి(స్వయంకృషి)
"మేఘసందేశం"లో అన్ని పాటలు...

నాకిష్టమైన "తల్లి గోదారికే ఆటుపోటున్నాది..." పాట సాహిత్యం:
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
పాడినది: రమేష్ నాయుడు

తల్లి గోదారికే ఆటు పోటుంటే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ..

ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి(2 )
సీకటికి దడిసేదేమిటి...
ఓ మనసా..

భగ భగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా(2 )
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ ...

అవతార పురుషుడు ఆ రామచంద్రుడు
అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు
అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిషికీ...తలరాత
తప్పుతుందా మనిషికీ...

Wednesday, April 7, 2010

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఒక హెల్త్ డ్రింక్

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక హెల్త్ డ్రింక్ గురించి..వివరాలు.
క్రింద చెప్పిన పాళ్ళలో ఆయా వస్తువులు కొనుక్కుని మర ఆడించుకోవాలి.

రాగులు - 500గ్రాములు
గోధుమలు - 50 గ్రా
జొన్నలు - 50 గ్రా
వేరుశెనగలు - 50 గ్రా
సగ్గు బియ్యం - 50 గ్రా
ఉప్పుడు బియ్యం - 50 గ్రా
సజ్జలు - 50 గ్రా
మొక్కజొన్నలు - 25 గ్రా
సొయాబిన్ - 25 గ్రా
పుట్నాల పప్పు - 25 గ్రా
బార్లీ - 25గ్రా


ఫ్లావర్ కోసం:

బాదాం - 25 గ్రా
జీడిపప్పు - 25 గ్రా
ఏలకులు - 25 గ్రా
ఈ మూడూ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.అనవసరం అనుకుంటే ఫ్లేవేర్ కోసం వాడే బాదాం,జీడిపప్పు కలుపుకోవటం మానేయటమే.

పైన రాసిన పదార్ధాల్లో Proteins,folic acid, calcium,fibre,iron,copper,carbohydrates,magnesium మొదలైన పోషక విలువలన్ని ఉంటాయి. షాపు వాళ్ళలాగ ఏది ఎంత % అన్నది చెప్పలేను. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కేలొరీలు బాగా ఖర్చు అవుతాయి కాబట్టి పిల్లలకు ఇది చాలా ఉపయోగకరం.

తయారి విధానం:

ఒక 2 స్పూన్లు పవుడర్ను తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అర గ్లాసు నీళ్ళలో కలుపుకుని పొయ్యి మీద పెట్టాలి. మరుగుకు వచ్చాకా మరొక అరగ్లాసు పాలు తీసుకుని అందులో కలుపుకుని బాగా కలిసాకా పంచదార వేసుకుని దింపేసుకోవాలి. పెద్దలు షుగర్ తినకూడనివాళ్ళు ఉంటే నీళ్ళలొ మరిగించుకున్నాకా చల్లర్చి మజ్జిగలో కలుపుకుని త్రాగచ్చు.

" మృత్యోర్మా అమృతంగమయ - 4 "

మూడవభాగం తరువాయి.. ..


కాంతిమతిని చూసి కిషోర్,మంజూ చాలా సంతోషిస్తారు. పది రోజులని ఇన్ని రోజులు వెళ్పోతే ఎలా అనడుగుతాడు కిషోర్. కాలేజీకు వెళ్ళి ప్రావిడెంట్ ఫండ్ తీసుకుని అభిమానంగా పలకరించినవారందరితో కబుర్లు చెప్పి, అలసటగా ఉండటంతో శారదా వాళ్ళింటికి వెళ్ళి పిల్లల్ని చూడాలని ఉన్నా బడలికతో ఇల్లు చేరుతుంది ఆవిడ.

సాయంత్రం ఏదో పెళ్ళి రిసెప్షన్ కు బయల్దేరుతూంటారు కొడుకూ కోడలు. పట్టు చీరతో నిండుగా ఉన్నా, బోసిగా ఉన్న మంజు మెడను చూసి ఒక పేట గొలుసు, జత గాజులు తీసి ఇవ్వబోతుంది కాంతిమతి. "కూతురిలా చూసే మీ అభిమానం చాలు ఇవన్ని వద్దని" వారిస్తుంది మంజు. కట్నాలు తీసుకోలేదు,బంగారం కుడా పెట్టలేదు పెళ్ళీలో మీకు...శైలూకి,జానకికి ఇచ్చాను నువ్వు కూడా తీసుకొమ్మని బలవంతపెడుతుంది ఆవిడ. "మీ అభిమానం పొందటమే నాకు సొమ్ము.ఇవి మీవద్దనే ఉంచండి" అంటుంది మంజు. కడుపున పుట్టిన కూతురికీ, అయిన సంబంధం అని చేసుకున్న జానకికీ, పరాయి పిల్ల అయినా ఇంత ఆప్యాయంగా ఉన్న మంజూకీ తేడా గమనించి మంజూ అభిమానానికి మురిసిపోతుంది కాంతిమతి.

ఆ రోజు రాత్రి ఆవిడ తన చిరకాల కోరికను తీర్చమని ,శేషజీవితం ఆశ్రమంలో గడపాలని ఉందనీ,తిరువణ్ణామలై కు తికెట్టు తీసుకొమ్మని కిషోర్ ను అడుగుతుంది . అదిరిపడతారు కొడుకూ,కోడలూ. తమ తప్పేదైనా ఉంటే మన్నించమనీ,తమని వదిలి వెళ్ళద్దని ప్రాధేయపడతారు. అటువంటిదేమిలేదనీ, ఎప్పటినించో తన మనసులోని కోరిక అదనీ, జీవన్ముక్తి మార్గాన్ని సులభం చేసుకోనిమ్మనీ అడ్దుకోవద్దని అంటుంది కాంతిమతి. భారంగా సరేనంటాడు కిషోర్. పిల్లల మనసులు నొప్పించి వెళ్ళగలనా అని మధనపడుతూ నిద్రలోకి జారుకుంటుంది కాంతిమతి.

మర్నాడు ఉదయాన్నే ప్రకాశరావుగారు కాంతిమతిని పలుకరించటానికి వస్తారు. ఉభయకుశలోపరి అయ్యాకా, మంగను గురించిన విషయం చర్చకు తెస్తారు ఆయన. మంగను ఒక ఫాన్సి షాపులొ పనికి చెర్పించాననీ,ఆ షాపు ఓనరు కొడుకు మంగ తనకు లొంగలేదని ఆమెను నానా అల్లరి పెట్టాడనీ, ఎలాగైనా అతనికి బుధ్ధి చెప్పి మంగతో అతనికి వివాహం జరిపిస్తానని అంటారు ప్రకాశరావుగారు.బలవంతపు పెళ్ళి వలన మంగ సుఖపడలేదని అలా చేయవద్దని అంటుంది కాంతిమతి. మనసులేని మనువు వలన ఎంతటి ఆవేదన పడవలసివస్తుందో మీకు తెలియదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆవిడ. కాసేపు తరువాత వచ్చిన మంగ కూడా ఆవిడ వాదనను బలపరుస్తూ తన అభిప్రాయాన్ని చెబుతుంది. తనను నన్ను నానా అల్లరి పెట్టిన మనిషిపై తనకు అసహ్యం తప్ప ప్రేమ లేదని,అతడికి కూడా తనపై పగే తప్ప కనీసం జాలి కూడా లేదనీ, ఈ పెళ్ళి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ...ఈ పెళ్ళి తప్పించమనీ అంటుంది మంగ.

పధ్ధెనిమిదేళ్ళు నిండిన ఆ అమ్మాయి అంత లోతుగా ఆలోచించి నిబ్బరంగా నిర్ణయం తీసుకోవటం కాంతిమతికి ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రకాశరావుగారితో మళ్ళీ మాట్లాడతానని చెప్పి మంగను పంపించి సోఫాలో వెనక్కు వాలిన కాంతిమతికి గతం గుర్తుకు వస్తుంది...
స్కూలుకు మూడురోజులు శెలవులు వచ్చాయని ఆనందంగా ఇంటికి వచ్చిన కాంతిమతిని ట్రాన్స్ఫర్ పై పొరుగురిలో ఉద్యోగం చేస్తున్న గొపాలరావుదగ్గరకు వెళ్ళి రమ్మని,పిల్లల్ని తాను చూసుకుంటానని అంటుంది అత్తగారు. ఎంతో ఆనందంతో భర్తకు ఇష్టమైన చీర బ్యాగ్లో పెట్టుకుని కోటి కోర్కెలతో రైలు ఎక్కుతుంది కాంతిమతి.

ఇంటిలోకి అడుగుపెట్టగానే భర్త కుర్చీకోడు మీద కూర్చుని తిఫిన్ తినిపిస్తున్న యువతిని చూసి అవాక్కవుతుంది. కాంతిమతిని నువ్వెవరని ప్రశ్నించి.. తాను అతని భార్యననీ,తామిద్దరమూ కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నామనీ ఇన్నాళ్ళకు కలిసామనీ ఆ యువతి చెప్పిన మాటలు విన్న కాంతిమతి కాళ్ళ క్రింద భూమి బద్దలై అందులో తాను కూరుకుపోయినట్లనిపిస్తుంది ఆమెకు. తల గిర్రున తిరిగి, కృంగిపోతుంది ఆమె. తనను ఇష్టపడికాదు పెద్దల బలవంతం మీద పెళ్ళి చేసుకున్నారు అన్న ఆ యువతి మాటలు ఆమెకు కత్తిపొటులా తోస్తాయి.'కాంతీ' ఆగమని గోపాల్రావు పిలుస్తున్నా వినిపించుకోకుండా స్టేషన్ కు చేరి రైలెక్కేస్తుందామె.

(ఇంకా ఉంది..)

Sunday, April 4, 2010

చలం గారి మాటలు...

"escapist అంటే... " అంటూ ప్రఖ్యాత రచయిత చలంగారు చెప్పిన ఈ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరుస్తాయి.
"చలం" గారి ఈ మాటల్ని మీరు కూడా వినండి..







Saturday, April 3, 2010

Fields Medal, the math Nobel, comes to India

మొన్నటి "Times of India" న్యూస్ పేపర్లోని ఒక వ్యక్తిని గురించిన ఈ వార్త నన్ను చాలా ఆకట్టుకుంది. The news about a Reclusive Russian genius "Grigory Perelman".Though we don't know the reasons for his recluse and refusing big prizes, the thing that fascinated me is the man's simplicity and his disinterest towards an amount of $1 million...! ఆసక్తికరమైన Fields Medal గురించి Mr.Perelman గురించి క్రింద చదవండి..

**********************************************************************

Fields Medal, the math Nobel, comes to India
New Delhi:
For the first time ever, the Fields Medal — popularly known as the Nobel Prize for mathematics — will be announced from Indian soil. India has won the bid over Canada to host the prestigious International Congress of Mathematicians 2010, the inaugural function of which will see announcement of the medal’s latest winner, most probably by President Pratibha Patil. The Congress, which was first held way back in 1897, will take place in Hyderabad from August 19-27.


The Fields Medal is awarded to the world’s best mathematicians at the Congress, held once every four years. But unlike the Nobel, winners of the Medal can’t be over 40 years of age. This is one reason why many great mathematicians have missed it, having done their best work or having had their work recognised too late in life.
Founded at the behest of Canadian mathematician John Charles Fields, the medal was first awarded in 1936 to Finnish mathematician Lars Ahlfors and American mathematician Jesse Douglas, and has been periodically awarded since 1950. No Indian has ever won it.

Hyderabad will also see the installing of a new prize — the Chern Prize — named after S S Chern, a towering figure in geometry in the 20th century.
Interestingly, there will be another first this year for the Congress — a unique International Congress of Women Mathematicians — two days before the ICM. Of the 400 women who have already registered for the Congress, around 150 are from India.
The conference will have another attraction — it will see 40 mathematicians play chess against world champion Vishwanathan Anand. Dr M S Raghunathan from the Tata Institute of Fundamental Research’s school of mathematics said, “This is the third time that the Congress is taking place in Asia, after Kyoto in 1990 and Beijing in 2002. We had bid for it way back in 2004 and we finally won it. The Congress will see 200 invited talks. The last time, it was held in Spain. We expect about 400 people to attend it.”


********************************************************

No to $1 mn?Reclusive Russian genius who refuses awards may attend the meet in Hyderabad
St. Petersburg/New Delhi: Who doesn’t want to be a millionaire? Maybe a 43-year-old unemployed bachelor who lives with his elderly mother in Russia and who won $1 million for solving a problem that has stumped mathematicians for a century. Grigory Perelman can’t decide if he wants the money.
“He said he would need to think about it,” said James Carlson, who telephoned Perelman with the news he had won the Millennium Prize awarded by the Clay Mathematics Institute of Cambridge, Massachusetts. Carlson said he wasn’t too surprised by the apparent lack of interest from Perelman, a reclusive genius who has a history of refusing big prizes.

What’s exciting officials in India is a possibility of the Congress being attended by Perelman, one of the world’s most reclusive yet brilliant maths wizards. Dr Raghunathan told TOI that efforts were on to get Perelman to Hyderabad.
Perelman became the first person ever to decline the Fields Medal four years ago. But he is now under fresh pressure to receive another highly prestigious award for solving one of the century’s most complex mathematical problems — the Poincare Conjecture. Perelman, 43, has cut himself off from the outside world and lives with his elderly mother in a tiny flat in St Petersburg. It was on March 18, 2010, that the Clay Mathematics Institute announced it had awarded Perelman the $1 million Millennium Prize. Dr Raghunathan said, “I have written to Clay Institute asking for Perelman’s address in order to reach him and invite him.” Perelman was honoured for proving the Poincare Conjecture, a theorem about the characterisation of the three dimensional sphere. Originally conjectured by Henri Poincare, the claim concerns a space that locally looks like ordinary three-dimensional space but is connected, finite in size, and lacks any boundary. That was one of seven problems the Clay Institute identified in 2000 as being worthy of a $1 million Millennium Prize. It’s the first problem on the list to be solved. Technically, the award is a done deal. “He has been awarded the prize. That’s the decision of the committee,” Carlson said. “He may or may not accept the money.” TNN & AGENCIES